Saturday, January 2, 2016

వాల్మీకి ' ఎవరు ?

ప్ర . ' వాల్మీకి '   ఎవరు ?

జ .  ' వాల్మీకి  ' అంటే  ఎవరో  సాదారణంగా  మనందరికి  తెలుసు . వారు ఒక గొప్ప ఋషి . ' రామాయణం ' అనే  ఇతి హాస్యాన్ని, మహా గ్రంధాన్ని  సంస్కృతంలో  రచించిన  గొప్ప మహా  నీయుడు . 

కాని  వాస్తవానికి పూర్వ కాలంలో  అతను ఒక  వేటగాడు . అంతే  కాదు  ఒక గజ దొంగ  కూడాను. అప్పుడు  అతని పేరు ' రత్నాకర ' .  ఇతను  ప్రతి  రోజు  అడవికి వేటకు  వెల్లేవాడు . జంతువులను  వేటాడి , వాటిని అమ్మి కుటుంభాన్ని పోషించే వాడు . అలానే జంతువులు  దొరకని రోజు , దారి దోపిడీ  చేసి కుటుంభాన్ని పోషించే  వాడు .

అలా  ఒక రోజు  అడవిలో దారి దోపిడీ  చేస్తుండగా , ఓ బాటసారి  ఏమాత్రం  ఎదురు తిరగలేదు .  కాని ఒక మాట అంటాడు, నీవు  నా దగ్గర దోచుకున్నావు సరే . అందుకు నాకు ఏ మాత్రం బాధ  లేదు .  కాని  కొన్ని  ప్రశ్నలు వేస్తాను . వాటికి సమాధానం  చెప్పి  ఈ సోమ్మునంతా తీసుకుని పో  అని అంటాడు . 
"సరే" అడగమంటాడు రత్నాకరుడు 

బాటసారి ఏమి అడిగి ఉంటాడో కళ్ళు మూసుకుని ఒక్కసారి ఆలోచించండి.

గుర్తు కొచ్చాయా కళ్ళు తెరిచి సారి చూడండి.

బాట సారి : ఈ సొమ్మును  ఎందుకు  దోచావు ?
రత్నాకర : ఈ  సొమ్ము  నాకు నా కుటుంభాన్ని  పోషించా డానికి .   
బాట సారి : సరే  బాగుంది . అంటే  నీవు  దోపిడీ చేసిన  సొమ్మును  అనుభవిస్తూ , నీ బార్యా  పిల్లలు  హాయిగా  సంతోషంగా ఉంటున్నారు . అవునా ?
రత్నాకర : అవును .  
బాట సారి : దారి దోపిడీ పాపం , నీచం  కదా ?
రత్నాకర :  అవును . 
బాట సారి : అయితే  నీ పాపంలో  కూడా   నీ బార్యా పిల్లలు సగ  భాగం  పంచుకుంటారేమో  ఒక్క సారి అడిగి వచ్చి  ఈ సొమ్మును  తీసుకుని పో  అని అంటాడు . 

రత్నాకరుడు , "సరే"  అని ఇంటి వెళ్తాడు . ఇంటికి వెళ్లి అలానే బార్యా పిల్లలను  అడుగుతాడు .  వారు , " నీవు చేసిన  పాపాన్ని మీమెందుకు  భరిస్తాం . భర్తవి   కాబట్టి మమ్మల్ని పోషించే  భాద్యత  మీదే " అని అంటారు . 

తిరిగి  వచ్చి అదే విషయ్యాన్ని ఆ బాట సారికి చెబుతాడు . అప్పుడంటాడు  ఆ బాట సారి. "చూసావా , నీ బార్యా పిల్లలు , నీ దోపిడీ  సొమ్ము కావాలంటారు .  కాని నీ పాపాలలో  నీ కష్టాలలో  ఎంత మాత్రం పాలు పంచుకో నంటారు . అలాంటప్పుడు,  నీ బార్యా పిల్లలను  పోషించేందుకు   నీవెందుకు  దోపిడీ  చేయాలి ?".

అప్పుడు ' రత్నాకరుడు ' బాగా ఆలోచిస్తాడు . జీవితంపై  విరక్తి  చెందుతాడు . బార్యా  పిల్లలను  వదిలి పెట్టి , హిమాలయాల్లోకి  వెళ్లి   ఓ  చెట్టు  క్రింద  కూర్చొని తీక్షణంగా   తపస్సు చేస్తాడు . ఎండకు , వానకు  ,
చలికి  ఎ మాత్రం  బెదర లేదు  అదర లేదు . ఆ విధంగా అతనిపై  పుట్ట పెర్గి  అతను కనబడ  కుండా పోతాడు . అప్పుడు  ఆకాశవాణి వచ్చి  తన కర్తవ్యాన్ని బోధిస్తాడు. దాని  ప్రభావమే  ' రామాయణ  ' ఆవిర్భావం .  ఆ పుట్ట కారణంగానే  అతనికి వాల్మీకి  అనే పేరు వచ్చింది . 
వాళ్మీకం అంటే పుట్ట. ఆ బాటసారే  'నారద  మహార్హి ' . 

పిల్లలూ!  దీని వలన  మనకు తెల్సిన  నీతి ఏమంటే,  ''పొరపాట్లు  అందరూ చేస్తారు . ఆ తప్పులనుండి బయట పడి  తొందరగా  నిజాయితీగా  మంచి పనులు చేస్తే  మహా మనీషు లవు తారు అని " 
మీరు ఏమంటారు ?
అవును తాతయ్యా!...

  



 

No comments: