Monday, July 20, 2020

SRI RAMANUJA PHILOSOPHICAL FOUNDATION TRUST

;
                  *శ్రీ రామానుజ ఫిలసాఫికల్ ఫౌండేషన్ ట్రస్ట్*

భారత దేశ మంతటికి గాను , దాతలు, శ్రేయోభిలాషులు   మరియు  అప్పటి  జడ్జి  *శ్రీమాన్ లేట్ గోపాల కృష్ణమూర్తి*  గారు , పేద ప్రజలను / బంధువులను ఆదుకోవాలనే ప్రధాన ఉద్దేశ్యంతో   *చాత్తాద శ్రీవైష్ణవ వెల్ఫేర్ ట్రస్ట్*  1997  లో ఆవిర్భవించింది.  దీని రిజిస్ట్రేషన్ నెంబర్. 69 / 19997 .దీనికై సర్వశ్రీ బి . బాలకృష్ణ  గారు , టి . రాజమన్నార్ గారు మరియు సూర్యనారాయణ గారు మొదలగు విశాఖ వాస్తవ్యులు చేసిన కృషి ఎంతో ప్రశస్త నీయమైనది.   అయితే  , ఆ తరువాత  ఒక సంవత్సరం వరకు , ఇందులో ఎలాంటి కార్యక్రమాలు జరుగలేదు.

ఆ తరువాత , ప్రజాకాంక్షను కోరే పెద్ద మనసు గల దాతలు, శ్రేయోభిలాషులు   కొందరు కలిసి ట్రస్టీస్ గా ఏర్పడి 1998  లో , దీని పేరును *శ్రీ రామానుజ ఫిలసాఫికల్ ఫౌండేషన్ ట్రస్ట్* గా మార్చడం జరిగినది.
దీని యొక్క రిజిస్టర్డ్ ఆఫీస్: ఎం .ఐ . జి . II -97 , సెక్టార్ - 3 , ఎం . వి .పి. కాలనీ ,విశాఖపట్నం - 530017 . ఆంధ్ర ప్రదేశ్ .
హైదరాబాద్ చాప్టర్ ఆఫీస్:  2 - 2 - 1146 - 7 - 12 / 1 , న్యూ నల్లకుంట , నర్మదా భవన్, శివమ్ రోడ్ , హైదరాబాద్ - 500044 . తెలంగాణ .

*ఆబ్జెక్టివ్స్  ఆఫ్ ట్రస్ట్:*
01 . కుల మతాలతో సంబంధం లేకుండా , పేద విద్యార్థుల విద్యార్జన కొరకు ఉపకార వేతనములు మరియు ఇతర సదుపాయాలు కలుగ చేయడం.
02 . పేద , బిక్కు , వితంతువులకు , వృద్ధులకు,  వైద్య సదుపాయాలు కలుగజేయడం .
03 . నిరుద్యోగులకు , శారీరక వికలాంగులకు  ఆర్ధిక సహాయాన్ని అందించడం.
04 . ఇతర ప్రజా చారిటబుల్ ట్రస్ట్ లకు , ఇన్స్టిట్యుషన్స్ కు మరియు అసోసియేషన్స్ కు అన్నధానాలకు  నిధులు ఇవ్వడం .
05 . నిరుద్యోగులు  ఉద్యాగాలు పొందడానికి , ట్రైనింగ్  సహకారాలను అందించడం.
06 . నీతివంతమైన , సాంఘీక , వైజ్ఞ్జ్యానిక, సాహిత్య మరియు ఆధ్యాత్మిక పుస్తకాలను  పబ్లిష్ చేయడం, మొదలైనవి .

*శ్రీ రామానుజ ఫిలసాఫికల్ ఫౌండేషన్ ట్రస్ట్*   చైర్మన్ గా  *శ్రీ కర్పూరం వెంకటేశ్వర్లు* గారు  2010  వరకు   చైర్మన్ గా కొన సాగారు . ఇప్పటికీ  ట్రస్ట్ మెంబెర్ గానే  కొన సాగుతున్నారు . ఆ తరువాత  శ్రీమంతుడు *శ్రీ దాస్యం మురళీధర్ స్వామి* గారు చైర్మన్ గా ఉన్నారు .
ఇప్పడు * శ్రీ మాచవరం వెంకటేశ్వర్లు* గారు చైర్మన్ గా కొన సాగుతున్నారు.
ఇప్పుడు  *శ్రీ రామానుజ ఫిలసాఫికల్ ఫౌండేషన్ ట్రస్ట్* , మన చాత్తాద శ్రీవైష్ణవ సంఘానికి అనుబంధం గానే నడుస్తున్నది.

*శ్రీ రామానుజ ఫిలసాఫికల్ ఫౌండేషన్ ట్రస్ట్*  కు ఎంతోమంది దాతలు, దానకర్ణులు ,విశాల హృదయులు విరాళాలు ఇచ్చారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది , దానకర్ణురాలు Dr.*శ్రీమతి నర్మద* గారు . Dr. *శ్రీమతి నర్మద* గారు సుమారుగా  80  వేల డాలర్లు , వాయిదాల  పద్దతిలో ఇచ్చారు . అప్పుడు మన కరెన్సీలో చూసుకుంటే  సుమారుగా 40  లక్షల రూపాయలు. అప్పుడు వారి అనుమతితో  సుమారుగా  23 లక్షలను ఫిక్షుడు డిపాజిట్ చేసి , కొంత డబ్బును *నర్మదా భవన్* నిర్మాణానికి ఖర్చు చేశారు.   

*శ్రీ రామానుజ ఫిలాసఫికల్ ఫౌండేషన్ ట్రస్ట్*  కార్యక్రమాల గురించి , అప్పటి గౌరవ కార్యదర్శి *శ్రీమాన్ దాస్యం మురళీధర్ స్వామి* 2005  రిలీజ్ ఐన సావనీర్ లో ఏమి అన్నారో వారి మాటలలోనే చూడండి. 

*మన సమాజంలో చాల మంది బీద  వారున్నారు . వారిలో ఎక్కువ మంది అతి బీద వారు గ్రామీణ ప్రాంతాలలోనే ఉన్నారు . వీరి సంపాదన కనీసం కూడు , గుడ్డకు సరిపోదు . కొంత మంది తమ పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో కూడా ఉచిత విద్యను అందించలేని పరిస్థితులలో ఉన్నారు . పేదరికంతో , అజ్ఞ్యానంతో , అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. కొన్ని సందర్భాలలో సంపాదించే కుటంబ సభ్యుల అకాల మరణంతో భార్యా పిల్లలు  దిక్కులేని స్థితికి చేరుకుంటున్నారు. మరియు కుటుంభంలో సంపాదించే కుమారులు సైతం వేరు పడటంతో  వృద్ధులకు నిలువ నీడ లేని పరిస్థితులు ఏర్పడుతున్నవి*.
*పై సమస్యల బాధల నివారణకై  రాష్త్ర , కేంద్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలతో విశేషంగా  కృషి చేస్తున్నవి. కొన్నిమానవతా  సంస్థలు వారికీ నచ్చిన ఆశయాలతో వారి పరిధిలో కొందరి బీద వారికీ సహాయం చేస్తున్నారు. ఇవి కాక కొన్ని ఆర్ధికంగా నిలదొక్కుకున్న కుల సంస్థలు , వారి కులం లోని బీదలకు ఆర్ధిక సహాయం అంద చేస్తున్నాయి . వీటన్నిటి వలన కూడా అందరి బీదలకు పూర్తి స్థాయిలో సాయం అందడం లేదు*.
బీదల పాట్లు , కష్టాలు ఎలా ఉంటాయో , 2005  లోనే  సావనీర్ లో  *శ్రీ దాస్యం మురళీధర్ స్వామి* గారు , చాలా చక్కగా రిపోర్ట్ చేశారు . *శ్రీ దాస్యం మురళీధర్ స్వామి* గారికి , మన సమాజం పట్ల , బీదల పట్ల ఎంతటి  అవగాహన , సానుభూతి , దయ ఉందో ,దీనిని బట్టి మనం అర్ధ చేసుకోవచ్చు. అంతే కాదు . వారు పెద్ద మొత్తంలో విరాళాలు కూడా ఇచ్చిన దయార్ద్ర హృదయుడు.

ఇప్పటికీ ప్రతి సంవత్సరం  ఎంతో మంది దాతలు దేశ , విదేశాలనుండి విరాళాలు పంపిస్తున్నారు. అంతే కాదు, పెద్ద ఉద్యోగంలో ఉన్న ఒక బంధువు , *శ్రీ రామానుజ ఫిలసాఫికల్ ఫౌండేషన్ ట్రస్ట్* కు , తన వేతనంలో , ప్రతి నెలా 1 % ఇస్తానని 2005 లోనే వాగ్దానం చేశాడు.      
ఆ విధంగా వచ్చిన విరాళాలను ,డిపాజిట్ల పై వచ్చే వడ్డీలను మరియు ఇతర ఆదాయాలను 2003 వ సం. నుండి వృద్ధులకు , వితంతంతువులకు పింఛన్లు ఇస్తున్నారు . పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు ఇస్తున్నారు . రోగులకు ఆర్ధిక సహాయం చేస్తున్నారు. కుల మత బేధం లేకుండా అన్నదానం నిర్వహించే నాలుగు సంస్థలకు నిధులను అంద చేస్తున్నారు . ముఖ్యంగా మన కమ్యూనిటీ కే అధికంగా నిధులను వెచ్చిస్తున్నారు.

అలానే ప్రతి సంవత్సరం ఆదాయపన్ను  చట్టం ప్రకారం , విరాళాలను ఖర్చులను ఆడిటింగ్ జరిపిస్తున్నారు . ఆ విధంగా చేయడం  వలన , ఆదాయపన్ను చట్టం విరాళాలలకు , 50 %   పన్ను మినహాయింపులు కల్పిస్తున్నది.  ప్రతి విరాళాలను , ఖర్చులను  పారదర్శకంగా , మన పత్రికలో రెగ్యులర్ గా  ప్రచురిస్తున్నారు.
ఎంత చక్కగా కార్యక్రమాలు నిర్వహించినా , చాల మంది బంధువుల నుండి కొన్ని ఆరోపణలు వస్తున్నవి. అవి ఏమిటంటే , 

01 . *శ్రీ రామానుజ ఫిలాసఫికల్ ఫౌండేషన్ ట్రస్ట్* ఉంది అన్న సంగతి , కమిటీ సభ్యులు ఎవరు ? ఎలా ఎన్నుకోబడుతారు ?  దాని వలన ఎవరికి సహాయం అందుతుంది?  మన కులం వారికేనా?  ఇతర కులాల వారికి  కూడానా?  ఎవరు రెకమండేషన్ చేయాలి?   అన్న విషయం సుమారుగా 70 % బంధువులకు తెలియదు.

02 . ప్రతి సం. రం. కేవలం కొన్ని శాఖలకే పెర్మనెంట్ గా సహాయం అందుతుంది. చాలా శాఖలకు ఆర్ధిక సహాయం అందడం లేదు. రాష్ట్రములో సుమారుగా  46  శాఖలున్నాయి . అంటే మిగిలిన శాఖలలో బీదలు , వృద్దులు , వికలాంగులు , వితంతువులు లేరా?
 
03 . ఎప్పుడు అప్లై  చేయాలి? ఎవరికి అప్లై చేయాలి? ఏమేమి సబ్మిట్ చేయాలి? ఎవరికి  అప్లికేషన్స్  సబ్మిట్ చేయాలి ? ఎవరు రికమండ్ చేయాలి? అనే విషయాలు పత్రికలో అడ్వాన్స్  గా రావడం లేదు . ఒక వేల వచ్చినా , సమయం అయిపోయాక  చేతిక పత్రిక అందడం వలన , మరల సం . వరకు  వేచి ఉండాల్సిన  పరిస్థితి.

04 . ఎంతో మంది అధ్యక్షులు , శాఖల నుండి అప్లికేషన్స్ పంపించినా , ఇంత వరకు సమాధానం లేదు. అనే ఆరోపణలు ఉన్నాయి.

05 . విరాళాలు పంపించిన వారికి  ఎంత శాతం పన్ను మినహాయింపు ఉంటుంది? , ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? అనే వివరాలు తెలియడం లేదు అనే ఆరోపణలు వస్తున్నాయి.

06 . ఒక్క రోజు కూడా మీటింగ్ పెట్టి , ట్రస్ట్ గురించి బంధువులకు అవగాహన కల్పించిన దాఖలాలు లేవు అనే ఆరోపణలు వస్తున్నాయి .

07 . దాతలనుండి  నిరంతరాయంగా విరాళాలు  సేకరించి ,  పేదలకు ఆర్ధిక సహాయం అందించడానికి , కాల నియమాలు  ఎందుకు  అని ప్రశ్నిస్తున్నారు.

08 . ఆన్ లైన్ లో  విరాళాలు అందిస్తే , పెండింగ్ లో ఉన్న మొత్తం  ఇంత  అని పత్రికలో ప్రకటించక పోవడం. పెండింగ్ లో ఉన్న బ్యాంక్ క్రెడిట్ మొత్తాలకు   రసీదులు వ్రాసి పెట్టక పోవడం.

09 . ట్రస్ట్ ఫోన్ నెంబర్ ఏమిటి ? ఎవరిని కాంటాక్ట్ చేయాలి?  వెబ్సైట్ , ఇమెయిల్ ఐడి ఏమిటి ?  

ట్రస్ట్ పై అవగాహన పెంచుకోండి. ఈ ట్రస్ట్ రాష్ట్రం లోని  అర్హులందరికి, ఉన్నంతలో  ఆర్ధిక సహాయం అందిస్తుంది.  తాహత్తు ఉన్నవారు విరాళాలు ఇవ్వండి . పన్ను మినహాయింపులను పొందండి. అడుగడుగునా ప్రశ్నించే తత్వం పెంచుకోండి. అర్హులైన వారు , శాఖల అధ్యక్షుల ద్వారా అప్లై చేయండి. ఆ తరువాత కూడా ఎందుకు రాలేదో విచారించండి. అనర్హులు లబ్ది పొందితే  నిలదీయండి. మౌనం చాలా ప్రమాద కరం*.

PROBLEMS AND SOLUTIONS

;
                                              *సమస్యలు-పరిష్కారాలు*

అన్ని అర్హతలు ఉండి కూడా ఉద్యోగం రాక నిరుద్యోగి గానే ఉంటే , మీ మీ నక్షత్రాల ప్రకారం ఓ పది మొక్కలను నాటి  జాగ్రత్తగా పెంచి పోషించండి. అవి ఫలాలు అందించే లోపు మీకు ఉద్యోగం రావచ్చు. లేదా మీ టాలెంట్ ప్రకారం ,మీకు నచ్చిన బిజినెస్ ఎంచుకోవాలి.

ఏదైనా కార్యాలయంలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటే , క్రమ శిక్షణ తో , సమయపాలన తో ,ఎవరిపైనా చాడీలు చెప్పకుండా ,మీ పని మీరు చేసుకుంటూ , వీలయితే తోటి వారికి సహాయం చేస్తూ , తోటి వారితో సరదాగా ఉంటే ,ఏ సమస్యలు ఉండవు.

ఆ కారణంగా అవమానాల పాలు అవుతున్న వారు , ఇతరుల గురించి పట్టించు కోకుండా ,ఇతరులపై ఈర్ష్య , అసూయలు పెంచుకో కుండా , ఎవరికీ హాని చేయకుండా ,మనవి కాని వాటిపై ఆశలు పెంచు కోకుండా ఉంటే అవమానాలు మన దరి  చేరవు.

దాయాదుల తో ఆస్తి తగువులు ఉన్నవారు , మన వెంటరాని ఆస్తులపై అత్యాశలు పెంచుకో కుండా , అనవసరంగా కోర్టులకు వెళ్ళకుండా, సామరస్యంగా పరిష్కరించుకుంటే ,ఏ తగవులు ఉండవు. చీమలకు పంచదార పోయండి.

సంతానం విషయంలో విచారం ఉన్నవారు , చుట్టుపక్కల ఉన్న పిల్లలను ప్రేమగా చూసుకుంటూ, ప్రతి నెలా మీకు వీలైన రోజు , అనాధ పిల్లల హాస్టల్ కు వెళ్లి, మీకు చేతనైన ఆహారం, పండ్లు ఫలాలు, పుస్తకాలు, పెన్నులు, బట్టలు పంచండి. వీలయితే కొంతకాలం కొరకు పిల్లలను దత్తత తీసుకోండి. చుట్టు పక్కల పిల్లలకు సేవలు చేయండి.

ఇంట్లో వివాహం ఆలస్యం అవుతున్న ఆడపిల్ల ఉంటే  వారంలో ఒక రోజు నానబెట్టిన గోధుమలలో బెల్లం కలిపి ఆవులకు పెట్టండి. ప్రతి రోజూ మొక్కలకు నీరు పోయాలి. నిత్యం ఇష్టమైన దేవుళ్ళకు పూజలు చేయాలి. కుటుంబ సభ్యులకు సేవ చేయాలి.

భూ వివాదాలు ఏర్పడినప్పుడు మన వెంటరాని భూముల గురించి తాపత్రయ పడకుండా, ఊరికే వచ్చే ఆస్తులపై, మోసం సొమ్ము తో కొన్న భూములపై అత్యాశలు  పెంచుకో కుండా , కక్షలకు , ప్రతీకారాలు కూ పోకుండా , చెప్పుడు మాటలు వినకుండా, చట్ట ప్రకారం  కలిసి మాట్లాడు కుంటే ఏ సమస్యా ఉండదు. 

ఇల్లు అమ్ముడు పోక ఇబ్బందులు పడుతున్న వారు , ఇంటి చుట్టూ మొక్కలను పెంచి , ఇంటి  వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచుతూ, అందరితో కలుపు గోలుగా ,ప్రేమగా ఉండండి. ఇంట్లో కొంతకాలం నుండి వాడని ఏ వస్తువులు ఉన్నా  ,పాత బట్టలు ఉన్నా పేదలకు ఉచితంగా పంచండి. అలానే ధరపై  కూడా లిబరల్ గా ఉంటే ఇల్లు త్వరగా అమ్ముడు పోతుంది.

రహస్య శత్రువులు ఉన్నవారు , ఒకరిపై మరొకరికి షికాయితలు చేయకుండా, ఎవరిపైనా ఈర్ష్యా అసూయ పెంచుకో కుండా, ప్రశాంతంగా, మనకు సంబంధం లేని ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ,తమపని తాము చేసుకుంటూ, అందరితో సరదాగా ఉంటూ ,సమాజ సేవ చేస్తూ ఉంటే ఇక రహస్య శత్రువులు ఉండరు.

పంట దిగుబడి సరిగా రాని రైతులు పొలాన్ని చక్కగా దున్ని , సరియైన విత్తనాలు వేస్తూ , సేంద్రియ ఎరువులను వాడుతూ, క్రిమి కీటకాలకు తగిన మందులు వాడుతూ , కలుపు మొక్కలు తొలగిస్తూ , తగిన శ్రద్ధ తీసుకోవాలి. భూసార పరీక్షలు చేయించి ,ఆ భూమి ఏపంటకు ఉపయోగపడుతుందో ,ఆ పంటనే వేయాలి. అప్పుడు ఆ భూమిలో అధిక దిగుబడి వస్తుంది.

చుట్టుపక్కల వారితో మీకు గొడవలు జరుగుతూ ఉంటే , ఈశాన్యం వైపున , తులసి మొక్కలను ,ఎరుపు మొక్కలను పెంచాలి. 
ఎవరిపైనా ఈర్ష్యా అసూయలు పెంచుకో కుండా, ఈ ఏరియాలో మేమే గొప్ప అనే అహంకారం పెంచుకో కుండా , గోడకాడ, వాకిలి కాడ , కొద్దిగా సర్దుబాటు తో ఉంటూ , చేతనైనంత సహాయం చేస్తూ , అందరితో కలుపు గోలుగా ఉంటే , చుట్టు పక్కల వారితో ఎలాంటి సమస్యా ఉండదు.

అధికమైన రుణ బాధలతో మీరు బాధ పడుతూ ఉంటే ,  గొప్పలకు పోకుండా, ఖర్చులు తగ్గించుకుని , కష్టపడి పనిచేస్తూ , సంపాదించిన డబ్బును, కొద్ది కొద్దిగా తీరుస్తూ, ఎవరికి మోసం చేయకుండా , నిజాయితీ గా ఉంటూ , అందరితో ముఖ్యంగా అప్పుల వారితో ప్రేమగా ఉంటే ఋణ బాధ తగ్గవచ్చు.

మీ సంపాదన చాలీచాలకుండా ఉంటే , మనకు అవకాశం ఉన్న 24 గంటల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నిజాయితీ గా కష్టపడి పని చేసి డబ్బు సంపాదించాలి. మోసం చేసి సంపాదిస్తే ,ఏదో ఒకరోజు అవమానాల పాలో ,జైలు పాలో , ఎన్కౌంటరో కావాల్సి వస్తుంది. మీరు చేయదలుచుకుంటే వందల పనులు ఉన్నాయి. సంపాదించ దలుచుకుంటే వందల అవకాశాలు ఉన్నాయి. సంపాదనకు వయసుతో పనిలేదు. అమితాబచన్ నేటికి సంపాదిస్తూనే ఉన్నాడు. డాక్టర్.అబ్దుల్ కలాం, చనిపోయినా పేటెంట్స్ ద్వారా సంపాదిస్తూ నే ఉన్నాడు. ఎవరి స్వభావానికి ,తగిన పనులు వారు ఎంచుకోవాలి. ఖర్చులు తగ్గించుకోవాలి. గొప్పలకు పోకూడదు. రెగ్యులర్ గా పొదుపు చేస్తూ ఉండాలి. డబ్బే డబ్బును సంపాదించే విధంగా ప్లాన్ చేసుకోవాలి.

అకారణ వివాదాల్లో ఇరుక్కుని ఉంటే , సమాజానికి ఉపయోగపడే సేవల్లో పాలు పంచుకోండి. కరోనా గురించి ప్రచారం చేయండి.  అందరితో ప్రేమగా ఉండండి. 

చదువులో వెనక పడి పోతుంటే ,మీరు రోజు మెడిటేషన్ చేయండి. మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి. చెడు స్నేహాలను ,చెడు అలవాట్లను శాశ్వతంగా విడనాడాలి. ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచండి.  కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండండి. చేతనైన సహాయం ఇంట్లో చేయండి. ప్రశాంతంగా కూర్చొని మనసుపెట్టి, ఇష్టంగా, నేర్చుకోవాలనే తపనతో చదవండి. మనసులో చదివింది విశ్లేషించండి. శాశ్వతంగా గుర్తుండి పోతుంది. చదువులో ఫస్ట్ ఉంటారు. 

మీకు శత్రువులు ఎక్కువ అవుతుంటే , మరోసారి తప్పు చేయను ,మీకు ఎలాంటి హాని చేయను, నేను ఎవరి విషయంలో జోక్యం చేసుకోను ,మీకు ఇవ్వాల్సింది త్వరలో ఇస్తాను అని దగ్గరకు వెళ్లి క్షమాపణ కోరండి.

 మీరు విదేశాలు వెళ్లే ఛాన్స్ మిస్ అయి పోతూ ఉంటే , మీకు దానికి సంబంధించిన అర్హతలు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి.
అర్హతలు పెంచుకోవాలి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలి. అవకాశం కోసం ఎదురు చూడాలి.