ఛందస్సు (CHANDASSU ) - నేర్చుకుందామా !

 సీస పద్యాలు  - ఛందస్సు  (CHANDASSU ) - లిరిక్స్

కృషితో నాస్తి దుర్భిక్షం . ప్రయత్నం చేస్తే సాధించలేనిది   అంటూ ఏమి ఉండదు అంటారు పెద్దలు. అందుకని కాస్త సాధన చేయండి , సాధించండి ఫలితాలు . 
ఛందస్సు ను సులువుగా నేర్చుకోవచ్చు . సాధన మొదలుపెట్టండి ఈ రోజే .

పద్యాలలో అనేక రకాలు ఉంటాయి , అందులో, 

Iజాతిపద్యాలు
II. ఉపజాతిపద్యాలు
III. వృత్తపద్యాలు

I. జాతిపద్యాలు:
a).కందము
b)ద్విపద మొదలయినవి

II. ఉపజాతి పద్యాలు:
a) ఆటవెలది పద్యాలు
b) తేటగీతి పద్యాలు
c) సీస పద్యాలు

III. వృత్తపద్యాలు:

a) ఉత్పలమాల చంపకమాల
b) శార్దూలం
c) మత్తేభం
d) మత్తకోకిల
e) తరలము మొదలయివి

ఆటవెలది లక్షణాలు:

ఇందులో నాల్గు పాదాలు ఉంటాయి
ఒక్కొక్క పాదానికి ఐదేసి గుణాలుంటాయి
ఒకటోపాదం,మూడోపాదం ఒకవిధంగా ఉంటాయి
రెండో పాదం,నాలుగో ఒకవిధంగా ఉంటాయి
మొదటి పాదంలో వరుసగా మూడు సూర్య గణాలు,రెండు ఇంద్రగణాలుంటాయి

గణాలు:
నలము (IIII)
నగము (IIIU)
సలము (IIIU)
భగణం (UII)
రగణము (UIU)
తగణము(UUI)
పైవాటిని ఇంద్రగణాలంటారు

నగణం(III)
హగణం(UI)
పైవాటిని సూర్యగణాలంటారు

ప్రతిపాదంలో,నాలుగో గణం మొదటి అక్షరానికి యతి మైత్రి ఉంటుంది.

ప్రాసయతి నియమం:
పాదంలో మొదటి గణం హగణమయితే..నాలుగో గణంలో మొదటి రెండక్షరాలు హగణంగా ఉండాలి.
పాదంలో మొదటి గణం నగణమయితే...నాలుగో గణంలో మొదటి మూడక్షరాలు నగణంగాఉండాలి.

వేమన ఆటవెలది:
ఉప్పుకప్పురంబు నొక్కపోలికనుండు
చూడఁజూడ రుచుల జాడవేరు
పురుషులందుఁబుణ్య పురుషులు వేరయా
విశ్వదాభిరామ వినురవేమ!!

ఈపద్యాన్ని బాగా గమనిస్తే,
ఒకటి,మూడు,నాలుగు పాదాలకు యతిమైత్రి చెల్లింది.
రెండోపాదంలో మాత్రం యతి మైత్రి చెల్లలేదు.
అందుకే వేమనకవి..ఈపాదంలో ప్రాసయతి వేసాడు

  చూడ...జాడ
      UI.....UI
చూడ..హగణం
జాడ...హగణం
ప్రాసయతిలో మాత్రలు సమానంగా ఉండాలి.





ఛందస్సు: యతి ప్రాస గణాలు:
**************************

యతి అనగా నేమి

1. యతి అనగా పద్య పాదం లోని మొదటి అక్షర స్థానాన్ని యతి అంటారు

2. యతిగా శబ్దం లోని వర్ణము/స్వరము / అక్షరం /అచ్చు లేదా హల్లు ను వాడుతాము

3. జంట పదాలను యతిలో వాడచ్చు

4. ఏక వర్ణాన్ని యతిగా వాడవచ్చు

5.  యతిలో లఘువు లేదా గురువు వచ్చే వర్ణములను వాడవచ్చు

6. యతి, ప్రారంభ వర్ణము అలాగే గణము అవుతుంది. 

7. పూర్వ కవుల ప్రకారం కొన్ని రాశుల వారు కొన్ని అక్షరాలతో పద్య రచన ప్రారంభం చేస్తే తక్కువ కాలంలో విశేష కీర్తిని పొందుతారని పూర్వికుల నమ్మకం.

8.  యతి గణంలో  కవికి ఇష్టమైన రంగును వ్యక్థ పరిచే పదం/అక్షరంతో మొదలెట్ట వచ్చు

9. యతి లో కవి అదృష్ట సంఖ్యను వ్యక్తం చేసే గణం/పదం గానీ వాడుకోవచ్చు

10. యతి గురుస్తానం గా పరిగణిస్తారు.


కొన్ని సూచనలు

ప్రాస వాడటం ఎలా? 

1. పద్యంలో ప్రాస యనేది యుండును. ప్రాస యనగా ప్రతీ పాదమ్మున యున్న 2వ యక్షరంబు

2. ఈ ప్రాస యందు పలు విధములు యుండును యిందున యే గుణింతము నైనా వాడవచ్చు

3. మన రచనలో సర్వ యేక ప్రాస వాడవచ్చున్

4. పద్యంబునకొక ప్రాస వాడవచ్చున్

5. ఒక రచన లేదా ప్రక్రియకు నొక ప్రాస వాడవచ్చున్

6. ప్రాస వలన ప్రక్రియకు యందంబు వచ్చున్

7. ఈ బ్రాస వలన పద బందంబుతో బందంబు బద్యానికి యేర్పడున్

8. పద్యం చివర యంటే యంత్య ప్రాస వాడవచ్చున్

9. బద్యం మధ్యలో పలు పాదములందు ప్రాస వాడవచ్చున్

10. ప్రాస లేకన్ బద్యంబు నకు సొగసుల్


సూచనలు కొన్ని

తెలుగు ఛందస్సు 3 భాగాలు
1. దేశీ 
2. మార్గ
3. మాత్ర

పై మూడు ఛందస్సు లలో గణాలు అవే ఉంటాయి. కానీ పద్యాలే వేరుగా ఉంటాయి. అని గుర్తుంచుకోండి

1. దేశీ ఛందస్సు లో జాన పదాలు, పద్యాలు ఈ ఛందస్సు లో ఉండెను

ఇంద్ర
సూర్య
చంద్ర గణాలు పూర్వ కాలం దేశీ ఛందస్సు

 ఆధునిక గణాలు 

మాతృ గణాలు
పితృ గణాలు
శిశు గణాలు
ఆచార్య గణాలు 
శ్రుత గణాలు
కళాపూర్ణ గణాలు
మొదలైనవి ఉంటాయి.


2. మార్గ ఛందస్సు లో 
ఏక వర్ణ
ద్వి వర్ణ
త్రై వర్ణ
చతుర్వర్ణ
పంచ వర్ణ
మొదలైనవి ఉంటాయి 
ఇవి సంస్కృత భాష నుండి దిగుమతి అయిన పద్యాలు ఉంటాయి.

3. మాత్ర చందస్సులో
ఒక మాత్ర
రెండు మాత్రలు
మూడు మాత్రలు
నాలుగు మాత్రలు
మొదలైనవి

జాన పదాలు మౌఖికంగా ఈ మాత్రలలో ఉండెను

సూచనలు కొన్ని

వ్యాసాన్ని పూర్తిగా పద్యంగా మార్చడం ఎలా ?
1. నిత్యం మనం మాట్లాడే పదాల్ని పద్యంలో కూర్చాలి
2. అరుదైన పదాల్ని వాడాలి
3. అలవోకగా పలికే పదాల్ని వాడాలి
4.  చిన్న చిన్న పదాలను కలిపి సంధులుగా మార్చాలి
5. సమాస పదాల్ని ఎంచుకోవాలి
6. అలంకారంలో వచ్చు పదాల్ని రాసుకోవాలి
7. వచనాన్ని మన పద్దతిలో మార్చాలి
8. భావవ్యక్తీకరణ లో రాగం వస్తుందా లేదా చూసుకోవాలి
9. చెప్పే విషయాన్ని సూటిగా చెప్పాలి
10. క్రియా పదాలు తెలిసుండాలి
11.రచనా సందర్భంలో వాడే పదాలు గుర్తుకుతెచ్చుకోవాలి
12. అవదానం తో పదాల్ని మనో పలకం పై చిత్రించాలి

అప్పుడే పద్యం రాయడానికి మీ మనస్సు సిద్ధం అయినట్లు రవి గాంచని చోటును కవి గాంచగలడు అద్భుతాలు సృష్టించగలుగుతాడు.👍🤝🙏


సూచనలు

1. పద్యం రాయుటకు పదజాలం సిద్ధం చేసుకోవాలి.

2. పద్యం ఒక భావంతో వ్యక్తీకరణ చేసుకుంటూ ముందుకు సాగాలి.

3. పద్య లక్షణాలు మదిలో మెదులుతూ ఉండాలి పాదానికి అనుగుణంగా వచ్చేటట్లు చూసుకోవాలి.

4. పద్యం పాడుతూ రచన చేయాలి.

5. పద్యంలో ఒకవేళ 
అలంకారాలు రావాలని అనుకుంటే ముందే నిర్ణయం తీసుకొని రచనలో కూర్చాలి.

6. విభక్తుల ను సాధ్యమైనంత వరకు తొలగించి పద్య రచన కొనసాగాలి.

7. వస్తు పోలికలు ముందు ఏర్పాటు చేసుకోవాలి

8. అంశం ముందుగానే అనుకోవాలి.

9. అంశంపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి.

10. పదాల కోసం నిఘంటువు సహాయం పొందాలి.

11. అప్పకవీయము, ఛందో దర్పణం, ఛందో రంజీతము లాంటి లక్షణిక గ్రంథాలు అధ్యనము చేయాలి.

12. సమకాలీన విషయాలు రచనలో వచ్చే విధంగా చూసుకోవాలి.

13. ఒకే అంశంపై కనీసం 10 పద్యాలు తాత్పర్యంతో రాసుకోవాలి.

14. రచనలు జాగ్రత్త చేసుకోవాలి.

15. ఆర్థిక వీలును బట్టి ముద్రణ చేయించుకోవాలి.

డాక్టర్ ఎల్మల రంజీత్ కుమార్

పద్యం వ్రాయు వారికి ఉపయోగపడేవి

మైత్రి అచ్చులు : 

1.అ - ఆ - ఐ - ఔ- ( య - హ - న) 
2. ఇ - ఈ - ఎ - ఏ
 3. ఉ - ఊ - ఒ - ఓ

మైత్రి ఉభయాక్షరాలు :

 1.c -న- ౯
2.ం -ము - అం 
3 . :హ / అ

మైత్రి హల్లులు : 

1. క - గ - ఘ - క్ష 

2. చ - ఛ - జ ఝ 

3. ట - ఠ - డ - ఢ

 4. త - థ - ద - ధ 

5. ప ఫ బ భ 

6. న -ణ - జ్ఞ - ఞు - మ

 7. ల- ళ -ఱ - డ 

8. ఋ - ౠ 

9. మ- మ 

10. య - య 

11. ర - ఱ - ఋ , ౠ 

12. వ - వ 

13. శ - ష - స - క్ష

నేటి కొన్ని సూచనలు

*  పద్యం రాసేవారిని కవి అని పిలుస్తాం.

1. పద్యం ఆదిలో అచ్చు ఉంటే ఉత్తమ పద్య రచన పద్దతి.

 2. హల్లుతో కూడా ప్రారంభం చేయచ్చు.

3. పద్యం ఆదిలో సంయుక్త లేదా ద్విత్వ అక్షరాలకు గురువు ఇవ్వాలి.

4. పద్యం మధ్యలో అచ్చులు వస్తే కచ్చితంగా హల్లులు గా మార్పులు చెయ్యాలి.

5. భావవ్యక్తీకరణ, పద్య లక్షణాలకు అనుగుణంగా మలచడం కవి నైపుణ్యం అవుతుంది కొత్త శిల్పానికి మార్గం అవుతుంది.

6. ఒక పద్యంలో వాడిన పదాలను మళ్ళీ రాకుండా చూడాలి. అప్పుడు మన పద సంపద పెరుగుతుంది

7. ఒక అంశానికి సంబంధించి కనీసం పది పద్యాలు రాస్తే భవిష్యత్తు లో పాఠకులకు ఉపయుక్తంగా ఉంటుంది.

8. కావ్యం, శతక రచనకు ఇప్పుడే సిద్ధం అవ్వండి.

9. ఒక ఛందస్సులో ఒక రచనకు ప్రాధాన్యత ఇవ్వండి.

10. ప్రతిరోజు ఒక  పద్యమైన రాయండి.


సూచనలు:

ఒక అక్షరము గణాలు
I ల
U గురువు

రెండు అక్షరాల గణాలు
IIఋ
IU వ
UI హ
UU 


మూడు అక్షరాల గణాలు
III న
IUI జ
UII భ
UUI త

IIU స 
IUU య
UIU ర
UUU మ

సూర్య గణాలు
I I I న
UI హ

ఇంద్ర గణాలు

IIII నల
IIIU నగ
IIUI సల
UII భ
UIU ర
UUI త
  


పద్యాలు

ఉపజాతి ... ప్రాస లేనివి

జాతి .... ప్రాస కలవు

మాత్రలు కలిగినవి

ఆటవెలది లక్షణాలు

1. నాలుగు పాదాలుంటాయి
2. ఈ పద్యంలో సూర్య గణాలు
I I I న. 
UI హ

ఇంద్ర గణాలు

IIII నల
IIIU నగ
IIUI సల
UII భ
UIU ర
UUI త
పై గణాలు నియమం ప్రకారం ఉంటాయి

3. 1వ మరియు 4 వ గణంలోని మొదటి అక్షరాలకు యతి వాడాలి

4. మొదటి పాదం లో 3 సూర్య గణాలు 2 ఇంద్ర గణాలు వస్తాయి.

ఉదాహరణకు 1వ పాదంలో ఇలా కూర్చ వచ్చు కొన్ని మీకు అవగాహన కోసం ఇస్తున్నాను

III III III  IIII IIIU
III III UI IIUI IIUI
III UI UI UII UIU
UI UI UI IIIU IIUI
UI UI III UIU UII
UI III III UII UUI
UI III UI UII UII
III UI UI UIU UIU

III III III  IIII IIII
III III UI IIUI UII
III UI UI UII IIUI
IUI UI UI IIIU UIU
UI UI III UIU UIU
UI III III UII UII
UI III UI UII UIU
III UI UI UIU UUI

5. రెండవ పాదంలో ఐదు సూర్య గణాలు రావాలి

ఉదాహరణకు ఇలా

III III III III III
III III III III UI
III III III UI III
III III UI III III
III UI III III III
 III UI UI UI UI
III UI III UI III
III UI UI III III
III UI UI UI III

UI UI UI UI UI
UI UI UI UI III
UI UI UI III UI
UI UI III UI UI
UI. III UI UI UI
UI UI III III UI
UI III UI III UI
UI III III UI UI
UI III III III UI
UI III UI III III
UI UI III III III
UI III UI UI III
పై విధంగా కూర్చు కోవచ్చు

6. ఉదాహరణకు 3వ పాదంలో ఇలా కూర్చ వచ్చు

III III III  IIII IIIU
III III UI IIUI IIUI
III UI UI UII UIU
UI UI UI IIIU IIUI
UI UI III UIU UII
UI III III UII UUI
UI III UI UII UII
III UI UI UIU UIU

III III III  IIII IIII
III III UI IIUI UII
III UI UI UII IIUI
IUI UI UI IIIU UIU
UI UI III UIU UIU
UI III III UII UII
UI III UI UII UIU
III UI UI UIU UUI

7. నాల్గవ పాదంలో ఐదు సూర్య గణాలు రావాలి

ఉదాహరణకు ఇలా

III III III III III
III III III III UI
III III III UI III
III III UI III III
III UI III III III
 III UI UI UI UI
III UI III UI III
III UI UI III III
III UI UI UI III
UI UI UI UI UI
UI UI UI UI III
UI UI UI III UI
UI UI III UI UI
UI. III UI UI UI
UI UI III III UI
UI III UI III UI
UI III III UI UI
UI III III III UI
UI III UI III III
UI UI III III III
UI III UI UI III
పై విధంగా కూర్చు కోవచ్చు

8. ప్రాసయతి ని కూడా పాటించవచ్చు అప్పుడు యతి నియమము పాటించారాదు

9. ప్రాస ఉండదు

10. ఉప జాతి పద్యం

11. దేశీ పద్యం


తేటగీతి సూత్రం

"సూర్యుడొక్కరుండు సురరాజులిద్దరు
దినకరద్వయంబు తేటగీతి"

లక్షణాలు

1. పాదాలు: 4

2. ప్రతిపాదంలోనూ ఒక సూర్యగణం + రెండు ఇంద్ర గణాలు + రెండు సూర్యగణాలు ఉంటాయి

3. యతి, ఒకటోవ గణం మొదటి అక్షరానికి నాలుగో గణంలో మొదటి అక్షరం యతి

4. ప్రాసయతి చెల్లును

5. ప్రాసయతి చెల్లించిన పద్యాన్ని అంతరాక్కరగా పిలుస్తారు.

6. నాలుగు పాదాల్లో 1s 2E 2s

III UIU UUI III III
III IIII IIIU III III
III IIII IIUI III III
III UII UII III III
III UIU UIU III III
III IIII IIII III III
III IIUI IIUI III III 
III IIIU IIIU III III
III UUI UUI III III
III UII IIUI III III 


UI UIU UUI III III
UI IIII IIIU III III
UI IIII IIUI III III
UI UII UII III III
UI UIU UIU III III
UI IIII IIII III III
UI IIUI IIUI III III 
UI IIIU IIIU III III
UI UUI UUI III III
UI UII IIUI III III 

III UIU UUI III UI
III IIII IIIU III UI
III IIII IIUI III UI
III UII UII III UI
III UIU UIU III UI
III IIII IIII III UI
III IIUI IIUI III UI
III IIIU IIIU III UI
III UUI UUI III UI
III UII IIUI III UI

UI UIU UUI III UI
UI IIII IIIU III UI
UI IIII IIUI III UI
UI UII UII III UI
UI UIU UIU III UI
UI IIII IIII III UI
UI IIUI IIUI III UI
UI IIIU IIIU III UI
UI UUI UUI III UI
UI UII IIUI III UI

ఇంకా కొన్ని పాదాలు వస్తాయి అయిన ప్రస్తుతము ఇవి ఇస్తున్నాను. మీకు సులువైన పాదాన్ని ఎన్నుకొని రాయండి. నాలుగు పాదాలు వేరు వేరు  తీసుకోవచ్చు.  1, 4 గుణాలకు యతి వేయాలి.

(సేకరణ)

No comments: