Wednesday, May 8, 2024

దిక్కు లేని పక్షులు

 లఘు కవిత

శీర్షిక: *దిక్కు లేని పక్షులు*
ప్రక్రియ: మణిపూసలు
(రూప కర్త: శ్రీ వడిచర్ల సత్యం )

పరువుగల కుటుంబం
అన్యోన్య కుటుంబం
చిన్న మనస్పర్ధలొచ్చె
విడిపోయె కుటుంబం!

సంపాదనకనీ పోయె
అవకాషముందని పోయె
నీవెంతని అహము తోటి
భర్త భార్య నొదిలి పోయె!

సంపాదనలొ పడిపోయె
త్రాగుడుకు బానీసాయె
కుటుంబాన్ని మరవడంతొ
అనుబంధం దూరమాయె!
అందముందని పోయే
వయసుఉందని పోయే
భార్య భర్తపై అహముతొ
పక్కోడితొ లేచిపోయె !

మోజులో వాడుకునే
లోగుట్టు తెలుసుకునే
ఉన్నదంతా ఊడ్చుకొని
తరిమి తరిమి కొట్టెనే!

సమస్యలూ సహజము
అందరికవి నిత్యము
కూర్చుని మాట్లాడుకునిన
ఉండేడిది ఫలితము !

ఉభయులకూ అర్ధమాయె
కాలమంత గడిచిపోయె
కోర్టుల చుట్టూ తిరుగుతు
దిక్కు లేని పక్షులాయె !

మానవ నైజం

 వచన కవిత

శీర్షిక: మానవ నైజం

మనిషీ తినేది ఒక మెతుకు
దాని కొరకు నిత్యం వెతుకు
ఆపై  చేస్తాడొక సొతుకు
పరువు పోయాక ఎందుకు ఆ బతుకు !

పొగిడించుకోవాలని ఆశ
పొగడక పోతే నిరాశ
లేదంటే రోజంతా దుర్భాష
అసహనంతో వెళ్ళగక్కుతారు గోస!

తాను చేస్తే సంసారం
అదే ఎదుటి వారు చేస్తే వ్యభిచారం
మనిషికి మనిషిపై ఎందుకో అసహనం
తోటి వారిపై ఎందుకో కోపం
ఇదే మానవ నైజం!

నీచులకుండదు ఏ ఆశయం
ప్రతి దానికీ ఏదో ఒక సంశయం
రోజంతా త్రాగుతారు కషాయం
తోటి వారిపై కప్పుతారు విషవలయం!

తుమ్మ చెట్టైనా ఇచ్చు మేత మేకకు
మర్రిచెట్టైనా ఇచ్చు నీడ మనిషికి
తులసి మొక్కైనా పోయు ప్రాణం, పోయే జీవికి
కానీ కుటిలుడు,
క్షణం క్షణం లాగుతుండు ఎదిగే వారిని!

పాముకు కోరల్లోనే విషం
తేలుకు కొండిలోనే విషం
కుక్కకు పండ్లలోనే విషం
కానీ , మనిషికి నిలువెల్లా విషం

ప్రకృతి అనేది ఒక శక్తి
దాని ముందర మనిషి ఒక వ్యక్తి
పెంచుకోకూడదు ప్రతి దానిపై ఆసక్తి
సద్వినియోగపరుచు కోవాలి యుక్తి
పరమాత్మ పై పెంచాలి భక్తి
దొరుకుతుంది రేపు  ముక్తి !

Saturday, April 27, 2024

చిట్టి పొట్టి చిన్నారులు

 లఘు కవిత: చిట్టి పొట్టి చిన్నారులు

ప్రక్రియ: ముత్యాల హారాలు

చిట్టి పొట్టి చిన్నారులు
ఎండాకాలం సెలవులు
ఇంటి పక్కనె పార్కులు
వెలుదురు బాలబాలికలు!

రంగుల రాట్నమాడేరు
ఊయలలెక్కి ఊగేరు
వంతెనపైకీ ఎక్కేరు
జారుడు బండ ఎక్కేరు!

అప్ డౌన్ లు ఆడేరు
హాంగింగ్ ఆట ఆడేరు
గౄపుఊయలలాడేరు
ఆనందంగ గడిపేరు!

ముసిముసి నవ్వులతో
ఉరుకులు పరుగులతో
అమిత  ఆనందంతో
గడిపిరి ఉత్సాహంతో!

ఆటలు ధైర్యము నిచ్చు
ఆటలు ఆరోగ్య మిచ్చు
ఆటలు హాయిని ఇచ్చు
ఆటలు ఆనందమిచ్చు !

ఆటలు శక్తిని పెంచు
ఆటలు ఆకలి పెంచు
ఆటలు బుద్ధిని పెంచు
అవి మనోబలం పెంచు !

చట్టాలెవరికి చుట్టాలు? (WHO ARE RELATIVES TO THE LAWS ?)

 వచన కవిత

శీర్షిక: చట్టాలెవరికి చుట్టాలు?

పదవి కోసం వెంటబడే
కాదు కూడదని కామా పెట్టే
రుధిరం మసిలిపోయే,మాట మూగబోయే
తట్టింది ఒక చక్కని ఉపాయం
రెచ్చగొట్టారు జనుల త్యాగాలకు
ప్రాణ త్యాగాల సమాధులపై
నిలిచారు ఒక హీరోగా!

నా రాజ్యం నా యిష్టం
వ్యవస్థలను అష్టదిగ్బంధం
అధికారులంతా భయభ్రాంతం
ప్రజలు సోమరులాయే
రాజ్యాన్ని అప్పుల పాలాయే !

అంబారీ పై స్వారీ చేస్తూ
దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనో
పట్టపగలే దోచిరి సర్వ సంపదలు
పెరిగి పోయిరి సమాజంలో బినామీలు
ఉచితాలకు బానిసలయిరి పేదలు
పడుతుండిరి జనులు అరిగోసలు
అప్పుల పాలయ్యేరు రేపటి తరాలు!

వీరేమైనా,
బ్రిటీష్ పాలకుల దత్త పుత్రులా
నిజాం నవాబుల వారసులా
ప్రజా కంఠకుడు హిట్లర్  తోబుట్టువులా
రక్త పిశాచి ముస్సోళినీ ఆదర్శప్రాయులా
చార్లెస్ శోభరాజు ఆప్త మిత్రులా!

చట్టాలెవరికి చుట్టాలు ?
ఈడీ అంటే అంత చులకనా ?
సిబిఐ అంటే ఇంత హేళనా ?
కోర్టులంటే యింత అలక్షమా?
ఎందుకంత నిర్లక్ష్యం వ్యవస్థలపై?
దోపిడి సంపద చూసుకునా?
మా కంటే తెలివైన మోసగాళ్ళు లేరనా?


దోచింది కనబడుతుంది అద్దంలా
దాచింది కనబడుతుంది దేశ విదేశాల్లో
అనుభవించేది కనబడుతుంది ఆహార్యంలో
దభాయిస్తారెందుకో  ముదురుల్లా!

కోర్టుల విలువైన సమయం వృధా
అమాయకులు యేళ్ళ కొలది జైళ్ళ పాలు
అభివృద్ధి పనులు ఆగిపోయే
న్యాయం ధర్మం కోసం ప్రజల ఉత్కంఠ
అయినా, నేరస్థుల వితండవాదం మహా జోరు !

నేరాలను ఒప్పుకోని నేరస్థులు
మోసాలను కప్పిపుచ్చే అవినీతిపరులు
పశ్చాత్తాపం తెలియని గ్రహవాసులు
దేశానికి, ప్రపంచానికి అత్యంత ప్రమాదకరం!

జానెడు పొట్ట కోసం
ఆరడుగుల పాడె కోసం
కోట్ల జనాల పొట్ట గొట్టి
లక్షల కోట్లు కూడబెట్టి
చివరకు ఏమి సాధిస్తారు కలియుగంలో!

చిప్ప కూడు తింటూ
తిహార్ జైల్లో ఉంటూ
కరకు నేలపై పంటూ
జైలర్ చెప్పిన పనులు చేస్తూ
జీరోగా నిలిచి పోతారు చరిత్రలో!

ఈ తేడాలెందుకో (WHY THESE DIFFERENCES)

 వచన కవిత

శీర్షిక: "ఈ తేడాలెందుకో"


దేశం ఒకటే,దైవం ఒకటే
రాజ్యాంగం ఒకటే,చట్టం ఒకటే
జనులలో పారే రుధిరం ఒకటే
అయినా ప్రజా పాలనలో
ఈ తేడా లెందుకో!

దేశం ఒకటే,దైవం ఒకటే
రాజ్యాంగం ఒకటే,చట్టం ఒకటే
జనులలో పారే రుధిరం ఒకటే
ధనికులకు చట్టాల వలన సుఖాలు
పేదలకు చట్టాల వలన కష్టాలు
ఈ తేడా లెందుకో!

దేశం ఒకటే,దైవం ఒకటే
రాజ్యాంగం ఒకటే,చట్టం ఒకటే
జనులలో పారే రుధిరం ఒకటే
అయినా కుటుంబ నియంత్రణ
కొందరికి
కుటుంబ నియంత్రణ
నిషిద్దం మరికొందరికి
ఈ తేడా లెందుకో!

దేశం ఒకటే,దైవం ఒకటే
రాజ్యాంగం ఒకటే,చట్టం ఒకటే
జనులలో పారే రుధిరం ఒకటే
అయినా రిజర్వేషన్లు కొందరికి
రిజర్వేషన్లు ఉండవు మరికొందరికి
ఈ తేడా లెందుకో!

దేశం ఓకటే,దైవం ఒకటే
రాజ్యాంగం ఒకటే,చట్టం ఒకటే
జనులలో పారే రుధిరం ఒకటే
అయినా చిల్లర 
ఆర్ధిక నేరస్థులు జైలులో
ఘరాన
ఆర్ధిక మోసగాళ్ళు ఏ.సి.లలో
ఈ తేడా లెందుకో!

దేశం ఒకటే,దైవం ఒకటే
రాజ్యాంగం ఒకటే,చట్టం ఒకటే
జనులలో పారే రుధిరం ఒకటే
అయినా నేతల, అధికారుల
పిల్లలు ప్రయివేట్ స్కూల్లో
బీద ప్రజల
పిల్లలు ప్రభుత్వ స్కూల్లో
ఈ తేడా లెందుకో!

దేశం ఒకటే,దైవం ఒకటే
రాజ్యాంగం ఒకటే,చట్టం ఒకటే
జనులలో పారే రుధిరం ఒకటే
అయినా  నేతల , అధికారుల
వైద్యం ప్రయివేట్ హాస్పిటల్స్ లో
పేద , మధ్యతరగతి ప్రజల
వైద్యం ప్రభుత్వ హాస్పిటల్స్ లో
ఈ తేడా లెందుకో!

దేశం ఒకటే,దైవం ఒకటే
రాజ్యాంగం ఒకటే,చట్టం ఒకటే
జనులలో పారే రుధిరం ఒకటే
అయినా పాలకులు
హామీలిచ్చి మాటతప్పుతే 
నాయకులు
ప్రజలు
ఓట్లేసి అధికారమిచ్చి ప్రశ్నిస్తే
నేరస్థులు
ఈ తేడా లెందుకో!

దేశం ఒకటే,దైవం ఒకటే
రాజ్యాంగం ఒకటే,చట్టం ఒకటే
జనులలో పారే రుధిరం ఒకటే
గుడులలో
కొందరు హుండీలో సొమ్మును
పంచుకుంటే నేరంకాదు
మరి కొందరు
ఆ ఆదాయాన్ని తీసుకుంటే నేరం
ఈ తేడా లెందుకో!

దేశం ఒకటే,దైవం ఒకటే
రాజ్యాంగం ఒకటే,చట్టం ఒకటే
జనులలో పారే రుధిరం ఒకటే
అయినా నేతలు, అధికారులు
మోసాలు చేస్తే, భూకబ్జాలు చేస్తే నేరం కాదు
పేదలు
పొట్ట కూటి కోసం దొంగిలిస్తే నేరం
ఈ తేడా లెందుకో!

దేశం ఒకటే ,దైవం ఒకటే
రాజ్యాంగం ఒకటే ,చట్టం ఒకటే
జనులలో పారే రుధిరం ఒకటే
అయినా నేతల జీత బత్తాలపై
పన్నులు వేయరు
కానీ ఉద్యోగుల జీతభత్యాలపై
పన్నులు వేస్తరు
ఈ తేడాలెందుకో!

దేశం ఒకటే ,దైవం ఒకటే
రాజ్యాంగం ఒకటే ,చట్టం ఒకటే
జనులలో పారే రుధిరం ఒకటే
అయినా లక్షల కోట్లు ఉన్న అవినీతి పరులపై
సంపద పన్ను పెంచరు
యెన్నో మినహాయింపులు
కానీ చిరు ఉద్యోగుల ఆదాయాలపై
అధిక పన్నులు
అనేకమైన ఆంక్షలు
ఈ తేడాలెందుకో !

దేశం ఒకటే ,దైవం ఒకటే
రాజ్యాంగం ఒకటే, చట్టం ఒకటే
జనులలో పారే రుధిరం ఒకటే
బ్యాంకులు లక్షల కోట్ల అప్పులకు
ఒక్క ప్రశ్న అడుగరు
కానీ, లక్ష రూపాయల అప్పుకు
సవా లక్ష ప్రశ్నలేస్తరు
ఈ తేడాలెందుకో!

దేశం ఒకటే ,దైవం ఒకటే
రాజ్యాంగం ఒకటే ,చట్టం ఒకటే
జనులలో పారే రుధిరం ఒకటే
అయినా నేతలు, అధికారులు, ధనికులు
ఉన్న వారికే పది గృహాలు
కానీ లేని పేద వారికి
ఒక్క గుడిసే ఉండదు
ఈ తేడాలెందుకో !


దేశం ఒకటే,దైవం ఒకటే
రాజ్యాంగం ఒకటే,చట్టం ఒకటే
జనులలో పారే రుధిరం ఒకటే
పేదా మధ్య తరగతి ప్రజలకే
చట్టాలన్నీ వర్తిస్తాయి
నేతలకు, ధనికులకు, బ్యూరోక్రాట్స్ కు
ఏ చట్టాలు వర్తించవు
ఈ తేడా లెందుకో!

దేశం ఒకటే,దైవం ఒకటే
రాజ్యాంగం ఒకటే,చట్టం ఒకటే
జనులలో పారే రుధిరం ఒకటే
అయినా ప్రతిపక్షాలకు
ఎన్నికల నిబంధనలు వర్తిస్థాయి
పాలకులకు
ఎన్నికల నిబంధనలు వర్తించవు
ఈ తేడా లెందుకో!

దేశం ఒకటే,దైవం ఒకటే
రాజ్యాంగం ఒకటే, చట్టం ఒకటే
జనులలో పారే రుధిరం ఒకటే
ధనికులైన 
పేదలైనా
ముసుగు పెట్టుకుని
గుడిసెలో
ముడుసుకుని పడుకున్నా
విమానాలలో విహరిస్తున్నా
వజ్రాల 
పట్టెమంచంపై పవళిస్తున్నా
యముడు
పిలుస్తే
ఎవరైనా పోయేది 
ఒకే చోటుకే
ఈ తేడా లెందుకో!

జరా దేఖో  ప్రైం మినిస్టర్ సాబ్!

Friday, April 5, 2024

ఎన్నికల సంస్కరణలు (Election reforms)

 వచన కవిత

శీర్షిక: ఎన్నికల సంస్కరణలు

జనాల మాయ జేయ, జరుగు జగమెల్ల
ఐదేళ్ళ కొకసారి ఎన్నికల జాతర
పిల్లలకు ముద్దులు వనితలకు వందనాలు
అబ్బో! ఉత్త (ర)ఉపన్యాసాల హోరు
ఆపైన డబ్బు పంపకాల జోరు
ఎంతో వినూతనం, మరెంతో ఆర్భాటం
కానీ.. ఫలితం శూన్యం!

విలువైన సమయం, వేల కోట్ల డబ్బు ,
ఉత్పాదకత... అంతా హుష్ కాకి!
అయినా,ఏది పేదలకు ప్రతిఫలం ?

ఎంగిలి మెతుకులు జల్లుతూ,నేతలు 
జనాన్ని మార్చే ఓటు బ్యాంకుల్లా
నాయకులు కుబేరులవ, 
ప్రజలను చేసే ఉచితాలకు వారసుల


అధికారం పదవులు పోగానే నేతలు
రంగులు మారుస్తారు ఊసరవెల్లుల్లా
ఉనికిని చాటుకోడానికో ఉంపుడు గత్తెల్లా
దోచింది కాపాడుకోడానికి దొడ్డిదారిన
చేరిపోతారు అధికార పార్టీ లో

తుప్పు పట్టిన ఎన్నికలకిపుడు
రావాలి  ఎన్నికల సంస్కరణలు
ఆలోచించాలి విజ్ఞులు, ఆపద వీడను
మునుల కాలం కాదిది, శాపం పెట్ట నేతలకు

80 యేండ్ల వృద్ధునికి పదవి కావాలా?
గెలిచే సత్తా లేనపుడు,రెండు చోట్ల పోటా?
ఓటుకు నోటిచ్చి గెలిచిన వాడు పాలకుడా ?
జాలి ఓట్లతో గెలిస్తే, అదీ గెలుపేనా?
ఊసర వెల్లిలా మారే వారికేద్దామా ఓటు?
ఐదేళ్ళ సేవకు పెన్సనా?  అదియూ పన్ను లేకుండా!

మార్పు కొరకే ఈ తపన
అసమానతలు తొలగాలని నా ఆలోచన
వెలుగు నివ్వాలి జగతిన
దేశం సాగి పోవాలి ప్రగతి బాటన                  
****

Friday, January 12, 2024

30 Days Congress Govt.ment /30 రోజుల కాంగ్రెస్ పాలన తెలంగాణ రాష్ట్రంలో: CONGRESS RULLING FIRST 30 DAYS IN TELANGANA

 30 రోజుల కాంగ్రెస్ పాలన:


నూతనంగా తెలంగాణా ఏర్పడ్డాక, మొదటి సారి కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 7, 2023 న  ముఖ్యమంత్రి గా శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గా శ్రీ బట్టి విక్రమార్క గారుప్రమాణ స్వీకారాలు చేసారు.

పువ్వు పుట్టగానే పరిమళం తెలుస్తుంది అన్నట్లు,
ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండి చేసిన కార్యక్రమాలు:
01. ప్రమాణ స్వీకారం చేశాక మేము ప్రజా పాలకులం కాదు, ప్రజా సేవకులమని స్లోగన్ ఇచ్చారు. ప్రజలలో ఒక ఆత్మీయ భావనను, ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించారు.
02. ప్రగతి భవన్ ఇనుప కంచెలను, నామ రూపాలు లేకుండా చేసి, తెలంగాణా లోని నాలుగు కోట్ల ప్రజలు, స్వేచ్ఛ వాయువులు పీల్చుకునేట్లు చేసారు.
ప్రగతి భవన్ పేరును, "మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్" గా మార్చారు. ప్రజల సమస్యలను చెప్పుకునే విధంగా, వారంలో రెండు రోజులు మంగళ, శుక్రవారాలలో, నేరుగా అధికారులను కలిసి, సమస్యలను వ్రాత పూర్వకంగా అందించేందుకు అవకాశం కల్పించారు. వాటిని సమయానుకూలంగా పరిష్కారించే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రజలు సెక్రటేరియట్ కు నేరుగా వెళ్ళే విధంగా స్వేచ్ఛ ను కలిగించారు.

03. వెంటనే క్యాబినెట్ నెట్ ను ఫామ్ చేసారు.
04. ఆదర్శనీయంగా స్పీకర్ ను నియమింప జేసారు.
05.మ్యానిఫెస్టోలో చెప్పిన  6 గ్యారంటీలలోని , మహాలక్ష్మి పథకంలోని ఒకటైన , "మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం"  అనే పథకాన్ని, సోనియా గాంధీ గారి జన్మదినం పురష్కరించుకుని డిసెంబర్ 9, 2023 న, ప్రారంభించారు.
అదే రోజు చేయూత పథకంలోని తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ, 10 లక్షల ఉచిత భీమాను ప్రారంభించారు.
06. డైరెక్ట్ రిలేతో అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేశారు. ప్రజలు ఇంట్లోనే కూర్చుని, ఎవరేమి మాట్లాడుతున్నారు, ఎవరు విలువైన అసెంబ్లీ సమయాన్ని వృధా చేస్తున్నారు అనే విషయాలను తెలుసుకునే విధంగా , పారదర్శకతను పాటించారు.
రేపటి ప్రభుత్వానికి ఒక దిశానిర్దేశం చేశారు.
07. ఐఏస్, ఐపిఎస్, ఇతర అధికారుల ట్రాన్స్ఫర్ లు చేపట్టారు. సమీక్షలు చేశారు.
08. ఆర్ధిక రంగంపై , విద్యుత్ రంగంపై ఒక స్వేత పత్రాన్ని విడుదల చేశారు. అసెంబ్లీలో చర్చకు తీసుకొచ్చారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు 6 లక్షల 71 కోట్లని తేల్చారు.
09. అందు బాటులో ఉన్న నిధుల ప్రకారం ఆర్టీసికి , మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కొంత డబ్బు చెల్లించారు. భీమా ప్రీమియం చెల్లించారు.
10. అందు బాటులో ఉన్న నిధుల ప్రకారం రైతు బంధును వేశారు. గత ప్రభుత్వంలో లాగానే , ఆసరా పెన్షన్లను వేశారు.
11. UPSC లాగా పరీక్షలు జరిపించాలని, స్వయంగా  డిల్లీ వెళ్లి UPSC చైర్మన్ కలిసి సలహాలను తీసుకున్నారు.
12. ఫార్మా సిటీని , ఫార్మా విలేజ్ గా మార్చాలని, ఫార్మా పారిశ్రామిక వేత్తలతో సంప్రదించి, నిర్ణయం తీసుకున్నారు.
13. డిసెంబర్ 28 నుండి - జనవరి 06 ,2024 వరకు "ప్రజా పాలన" స్పెషల్ డ్రైవ్ పెట్టి, ఆరు గ్యారింటీలకు సంబంధించి అప్లికేషన్ లను స్వీకరించారు. వివిధ పథకాలకు సంబంధించి రాష్ట్ర మొత్తంలో
1,25 ,00,000 అప్లికేషన్లు వచ్చాయి.
14. జనవరి 7 న , ప్రజాపాలన వెబ్ సైట్  www.prajapalana.telangana.gov.in ను ప్రారంభించారు. అప్లికేషన్లను ఎంట్రీ చేయడం ప్రారంభించారు. ఇది జనవరి 17, వరకు పూర్తి అవుతుందని చెప్పారు. జనవరి 18 నుండి, ప్రజలు వెబ్సైట్ లో , వారి అప్లికేషన్ ఆక్సెప్ట్ అయ్యిదా లేదా సులువుగా తెలుసు కోవచ్చంటున్నారు. ప్రతిదీ పారదర్శకం.
15. అవినీతి నాయకుల , అధికారుల , బినామీల లెక్కలను ఒక్కటొక్కటిగా బయటకు తీస్తున్నారు.
16. ఇద్దరు ఎమ్ ఎల్ సి పదవులకు, క్యాబినెట్ మంత్రుల సూచనల మేరకు, తెలంగాణా పోరాట యోధులకు, మేధావులకు అవకాశం కల్పించారు.



పారదర్శక పరిపాలన కొరకు, ఐఏఎస్ లతో ఒక సలహా మండలిని ఏర్పాటు చేశారు.
గవర్నర్ గారితో, ప్రధాన మంత్రితో, రాష్ట్ర పతితో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు.
తమ పార్టీ సభ్యులతో, ఇతర పార్టీల సభ్యులతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు.
తమ కార్యాచరణ ఏమిటో ఒక పత్రికా సంపాదకుల ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.
తమ సమస్యలను తెలుపుకునే విధంగా, ధర్నాలు రాస్తారోకోలు చేసుకునే విధంగా, ప్రజలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. గత ప్రభుత్వం లో ఏ రోజు ఏమి జరుగుతుందో, పదేండ్లైనా , పార్టీ ఓడి పోయే వరకు ఎవరికీ తెలిసేది కాదు. ఏ జి.వొ. వెబ్సైట్ లో కనబడలేదు. ఇప్పటి వరకైతే వీళ్ళ కొడుకులు, బిడ్డలు, అల్లుండ్లు దోచిన దాఖలాలు లేవు. అంతా
పారదర్శక పాలన ప్రస్తుతానికైతే ప్రజలకు కనబడుతుంది, అవినీతికి పాల్పడిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు. ప్రగతి భవన్ ముళ్ళ కంచెలు తొలిగాయి. మహిళలు , విద్యార్ధినులు తెలంగాణా అంతటా ఉచితంగా తిరిగే స్వేచ్ఛ లభించింది. స్వేచ్ఛ అంటే ఇది. ఆత్మ గౌరవం అంటే ఇది.
అంతకంటే ఇంకేమి కావాలి ప్రజలకు?

గత ప్రభుత్వంలో బాధలు, నిర్భంందాలను  అనుభవించిన ప్రజలు, భూదోపిడికి గురైన ప్రజలు, రాష్ట్ర అభివృద్ధి , రాష్ట్ర శ్రేయస్సు కోరుకునే నిజాయితీ ప్రజలు, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి గల నిధుల లేమిని అర్ధం చేసుకున్న ప్రజలు, ఉచిత పథకాల కొరకు ఎదిరి చూడటం లేదు. డిమాండ్ చేయడం లేదు. ఉచిత పథకాలు వద్దనే వారే చాలా మంది కనబడుతున్నారు. వారు,  ప్రశ్నించే స్వేచ్ఛ, జీవించే స్వేచ్ఛ, ఉచిత విద్య, ఉచిత వైద్యం ,ఉచిత న్యాయం మరియు నీతి వంతమైన పాలన కోరుకుంటున్నారు. కానీ ఉచిత పథకాలు కాదు. నిధుల అవకాశాన్ని బట్టి, ప్రభుత్వమే అందిస్తుంది. అది భారత రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ భాద్యత కూడా.  ప్రజలు చెల్లించిన పన్నులను, పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమ పథకాలకు ఎలాగో ఖర్చు చేస్తారని, ప్రజలు భావిస్తున్నారు.

Monday, January 8, 2024

మహిళల ఉచిత బస్సు ప్రయాణం 💯% విజయ వంతం

మనసుంటే మార్గముంటుందంటారు, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది తప్పక ఉంటుంది.

"మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం"  డిసెంబర్ 9, 2023 న, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది.
ఇది పేద మధ్యతరగతి మహిళలకు వరం లాంటిది.
ఎందుకంటే నేడు మెజారిటీ కుటుంబాలలో మహిళలే అధికంగా ఉన్నారు.
సమయం లేక పోవడం వలన, తెలంగాణ రాష్ట్ర మహిళలకు మాత్రమే అని అన్నారే గానీ మరి ఎలాంటి నిబంధనలు పెట్టలేదు.
మహిళలలు కూడా చాలా ఆనందాన్ని వ్యక్త పరిచారు. రోజులు గుడుస్తుంటే, మహిళలో మిశ్రమ స్పందన కనిపిస్తుంది. అలానే ఆటో వాండ్లు, వారికి జీవనోపాధి కరువైందని, ధర్నాలు , రాస్తారోకోలు ప్రారంభించారు. ప్రతి రోజూ ఏదో ఒక మూలన చర్చ జరుగుతుంది. సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.
ఏదైనా కొత్తగా ఉచిత పథకం ప్రారంభించినప్పుడు లేదా  మార్పు చేసి నప్పుడు కొందరికి మేలు జరుగుతే, మరికొందరికి బాధ, నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఇది సహజం.
వీరిని ఎంత సమన్వయం  చేయాలనుకున్నా, కొంత అసంతృప్తి మిగిలే ఉంటుంది.
ప్రభుత్వం వేరు, ఆర్టీసి వేరు. మొదట ఆర్టీసి వారు,
మేము ఇప్పటికే నష్టాల్లో ఉన్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటే, ఆర్టీసి మరింత నష్టాల్లో కూరుకు పోతుందని తేల్చి చెప్పేశారు.
నెల రోజులు గడిచాక ఇప్పుడు కొందరు మహిళలు ఉచిత ప్రయాణాన్ని వద్దని చెబుతున్నారు. రద్దు చేయాలంటున్నారు . మరికొందరు టిక్కెట్లు రేట్లు తగ్గిస్తే బాగుండేది అంటున్నారు. మరికొందరు సీనియర్ సిటిజన్స్ మహిళలకు ఇస్తే సరిపోతుంది అంటున్నారు. ఇంకొందరు, దగ్గరి రూట్ల వారికి ఉచిత ప్రయాణం అంటే బాగుంటుందని, పేదల వరకు పెడితే బాగుంటుందని, బస్సులు పెంచాలని, కండక్టర్లు, డ్రైవర్లు చిన్న చూపు చూస్తున్నారని , బస్సులలో రద్దీ పెరుగడం వలన ఇబ్బంది అవుతుందని , దొంగతనాలు , కొట్లాటలు జరుగుతున్నాయని , అలానే మగవారు, అన్ని సీట్లలో మహిళలలే కూర్చోవడం వలన, మేము డబ్బులు చెల్లించి, నిలబడి వెళ్ళాల్సి వస్తుందని, ఇంకా ఎన్నో రకరకాల అభిప్రాయాలు వ్యక్త పరుస్తున్నారు. అనుభవం లోకి వస్తున్నాయి.
ఇక ఆటో డ్రైవర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వలన, మా ఆటోలలో ఎవరూ ఎక్కడం లేదని, దీని వలన, మేము ఆటోల ఇ.ఎమ్.ఐ లు , పిల్లల స్కూలు ఫీజులు, కరెంట్ బిల్లులు, హాస్పిటల్ ఖర్చులు, జీవనోపాధి భారంగా మారిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆటో డ్రైవర్ల అధ్యక్షుడు స్వామి గారంటారు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం మంచిదే. కానీ లక్షల జీతాలు తీసుకునే టీచర్లు, ఇతర ఉద్యోగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం అంటే మాకు తీవ్ర నష్టం జరుగుతుంది అని అంటున్నారు. వీరి మాటలలో న్యాయం ఉంది.

విద్యార్ధినులకు, పేద, మధ్యతరగతి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రద్దు చేయనవసరం లేదు. ఇది ఒక మంచి పథకం. ఇది మహిళలకు సాధికారత నిస్తుంది. ధైర్యాన్ని ఇస్తుంది . స్వేచ్ఛ నిస్తుంది. ఆర్ధిక స్వావలంబన కలిగిస్తుంది. చైతన్య పరుస్తుంది. సమాజం గురించి అవగాహన కలిగిస్తుంది. విద్యను, ఉపాధిని ప్రోత్స హిస్తుంది.
మహిళా బిల్లు కంటే గొప్పగా ఎంపవర్ మెంట్ ను ఇస్తుంది. దీనని దుర్వినియోగం కాకుండా చూడాలి.
"మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం" పథకం విజయవంతం కావాలంటే, ఈ సూచనలను , సలహాలను అమలు చేస్తే, ఆర్టీసీని ,అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరిచినట్లవుతుంది.

01. ఆర్టీసికి  మహిళా టికెట్ల డబ్బును, ప్రభుత్వం నెల వారిగా చెల్లించాలి. ఆర్టీసికి మరో మేలు ఏమంటే, బస్సులలో ఆక్యుపెన్సీ పెరిగి ఆదాయం పెరుగగలదు.
02. విద్యార్ధినులకు, నిరుద్యోగ మహిళలకు, చిన్న చిన్న ఉద్యోగులకు మరియు పేద మధ్యతరగతి మహిళలకు వారి తెల్ల రేషన్ కార్డులను, ఆధార్ కార్డులను బేస్ చేసుకుని స్మార్ట్ కార్డులు జారీ చేయాలి.
03. ప్రభుత్వ ఉద్యోగులకు, లక్షల్లో జీతాలు పొందే వారికి, ధనవంతులకు, కార్లు, ఆపై వాహనాలు ఉన్న వారికి, ఆదాయ పన్నులు చెల్లించే వారికి, స్వచ్చందంగా ఉచితాలు  వద్దు అనే మహిళలకు ఉచిత స్మార్ట్ కార్డులు జారీ చేయకూడదు.
04. తక్షణమే స్మార్ట్ కార్డులు ఒక సంవత్సరం వ్యాలిడిటీతో  ఇష్యూ చేయాలి. స్మార్ట్ కార్డులు ఇష్యూ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. బస్సు పాసులు రెన్యువల్ చేసినట్లుగానే చేసి, ఉచిత స్మార్ట్ కార్డులనూ లామినేషన్ చేసి ఇవ్వాలి. సంవత్సరం తర్వాత,  ఆధారాలను చూపించి రెన్యువల్ ఉచితంగా చేయించు కోవాలి.
లేకుంటే స్మార్ట్ కార్డులు దుర్వినియోగం అవుతాయి.
05. బస్సు ప్రయాణం చేసేటప్పుడు వారి వద్ద స్మార్ట్ కార్డు లేనట్లయితే టికెట్ కొట్టాలి. జిరాక్స్, వాట్సాప్ స్మార్ట్ కార్డులను పరిగణనలోకి తీసుకోకూడదు.
06. బస్సుల సంఖ్య ను పెంచాలి. ఉన్న బస్సులను కండీషన్ లో పెట్టాలి.
07. మహిళలు, మహిళల సీట్లలోనే కూర్చోవాలి. సీనియర్ సిటిజన్స్ సీట్లను, వికలాంగుల సీట్లను వారికే కేటాయించాలి. వారు మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు.
08. కండక్టర్లు, డ్రైవర్లు మహిళలను , ఉచిత బస్సు ప్రయాణమని, చిన్న చూపు చూడ కుండా ఆర్టీసి చర్యలు తీసుకోవాలి.
09. పండుగలకు, తీర్థాలకు, విహారాలకు ఉచిత బస్సు ప్రయాణం రద్దు చేయాలి.
10. ఆటో డ్రైవర్లు గమనించాల్సింది, వారి కుటుంబాల మహిళలకు కూడా ఉచిత బస్సు ప్రయాణం మేలు చేకూరుస్తుందన్న విషయం. ఇతర ప్రజలకు లాగానే , ఆటో డ్రైవర్లకు, కరెంట్ బిల్లులు, గ్యాస్ భారం తగ్గుతుంది.  ఆటో డ్రైవర్లు గమనించాల్సిన మరో విషయం కార్లలో వెళ్ళే వారు , క్యాబులలో వెళ్ళే వారు, బస్సులలో వెళ్ళరు. బస్సులు కాలనీలలో తిరుగవు. ఒక ఇంటినుండి మరో ఇంటికి లేదా మరో చోటికి వెళ్ళాలన్నా , అత్యవసరంగా వెళ్ళాలన్నా ఆటోలను, క్యాబ్ లనే ఆశ్రయిస్తారు కానీ బస్సులను కాదు.ధనికులకు, లక్షల జీతాలు పొందే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రద్దు చేయడం వలన , ఇక విద్యార్థినిలు, చిన్న చిన్న ఉద్యోగ మహిళలు, గతంలో పాసులు తీసుకుని బస్సులలోనే వెళ్ళే వారే కాబట్టి,  డ్రైవర్ల ఉపాధికి ఎలాంటి సమస్యా ఉండదు.
11. అర్హులైన ఆటో డ్రైవర్లకు ఇప్పటికే  5 లక్షల ఉచిత భీమాను కొనసాగిస్తున్నారు.
12. అర్హులైన డ్రైవర్లకు ఉచిత రేషన్ కార్డులు ఇవ్వాలి.
13. అర్హులైన డ్రైవర్లకు ప్రతి సంవత్సరం 12,000 రూ.లు చెల్లించాలి.
ఇలా చేయడం వలన అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరిచినట్లవుతుంది. సమస్యలు తగ్గుముఖం పడతాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నూరు శాతం విజయవంతం అవుతుంది.

Monday, January 1, 2024

ప్రజాపాలన అప్లికేషన్ పై అనుమానాలు - వివరణలు

 నూతనంగా, డిసెంబర్,7-2023 న  ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై , ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలపై

అనేకమైన అనుమానాలు , 6 గ్యారంటీల అప్లికేషన్లపై అనేక అభ్యంతరాలు, అసత్య ప్రచారాలు, దుష్ప్రచారాలు చేయడం సరికాదు.  ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులలోనే అనగా డిసెంబర్ 9 న రెండు గ్యారెంటీలలోని , రెండు సబ్ గ్యారంటీలైన "మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం" , రెండవది "10 లక్షల ఆరోగ్యశ్రీ భీమా " ను అమలు చేసారు.
ఆర్టీసికి, ఇన్స్యూరెన్స్ కు ప్రీమియం కు డబ్బు చెల్లింపు చేసే ఉంటారు కదా. ఒక వైపు నిధుల లేమి మరో వైపు అనర్హులను కట్టడి చేయాలి. ఆ కారణంగా  , వెరీఫై చేసుకుంటూ, "రైతు భరోసా" పథకానికి సంబంధించి రైతులకు 5 వేల చొప్పున వేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన ఏ ప్రభుత్వానికైనా, ప్రాధాన్యత ప్రకారంగా 100 రోజులలోపల హామీలను ప్రారంభించడానికి అవకాశం ఇవ్వాలి.
"ఫలించే వృక్షానికే రాళ్ళ దెబ్బలు అన్నట్లు " , నిబద్ధతతో ఒక్కొక్కటిగా పథకాలను అమలు చేసే ప్రభుత్వాలపై బురద చల్లడం తగదు.
ఇక డిసెంబర్ 28,2023 నుండి జనవరి 6, 2024 వరకు ,  స్పెషల్ డ్రైవ్ అని ప్రారంభించిన 6 గ్యారంటీల అప్లికేషన్లపై అపోహలను సృష్టించడం,
దుష్ప్రచారాలు చేయడం శ్రేయస్కరం కాదు. పాలకులు ఎవరైనా సరే  నిబద్దతగా , నిస్వార్ధంగా పని చేస్తున్నారా లేక ఏమైనా అవినీతికి పాల్పడుతున్నారా అనేది చూడాలి. గవర్నర్ ను , ప్రధాన మంత్రిని, రాష్ట్ర పతిని, ఇతర నేతలను, మేధావులను కలుపుకు పోతున్నారా లేదా చూడాలి. కొంత కాలం సమయం ఇవ్వాలి. అవినీతి నిరూపితమైన పాలకులను 60 యేండ్లు దూరం పెట్టాలి. ప్రజలకు మంచి పాలన అందిద్దామని ముందుకు వచ్చిన, ప్రభుత్వాలను ప్రొత్సహించాలి తప్పా , బలహీనం చేయకూడదు.
ఆరు గ్యారెంటీల అప్లికేషన్ నింపడంలో ఎలాంటి సమస్యలు లేవు. చాలా సులభంగా ఉంది. తక్కువ సమయంలో కొత్తగా అప్లికేషన్ ప్రిపేర్ చేసేటప్పుడు కొంత క్లారిటీ లేక పోవచ్చు. అవి అనుభవం మీద తెలుస్తాయి. వాటిని సరిచేసే అవకాశం తప్పకుండా ఉంటుంది. "పెట్టని మహాతల్లి పెట్టకనే పాయే, పెట్టేది కూడా పెట్టక పాయే అన్నట్లుగా" మాట్లాడటం సబబు కాదు. ప్రజాపాలన దరఖాస్తును ఎవరైనా సులువుగా నింపవచ్చు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ లేదు. అప్లికేషన్ నింపడంలో దరఖాస్తు దారులకు ఉండే కొన్ని అపోహలను ,సందేహాలను నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను.
01. యజమాని పూర్తి పేరు : ఆధార్ లో ఉన్నట్లుగా  పురుషుడి పేరు గానీ, మహిళ పేరు గానీ ఆంగ్లంలో లేదా తెలుగులో వ్రాయండి. సాధారణంగా రేషన్ కార్డు మహిళల పేరు మీద ఉంటుంది కాబట్టి, మహిళల పేరు వ్రాయడం ఉచితం. లేదా మీ ఇష్టం.
02. లింగం: స్త్రీ నా, పురుషుడా, ఇతరులు (న్యూట్రల్ జెండరా)
అక్కడి బాక్స్ లో టిక్ చేయండి.
03. ఎస్సీ, ఎస్టీ,బి.సి, మైనారిటీ, ఇతరులా టిక్ చేయండి.
04.పుట్టిన తేది, ఆధార్ కార్డు ప్రకారం తేది,నెల సంవత్సరం నింపండి.
05.ఆధార్ కార్డు నెంబరు వ్రాయండి
06. రేషన్ కార్డు నెంబరు ఉంటే వ్రాసి దాని జిరాక్స్ కాపీని అటాచ్ చేయండి. లేకుంటే ఒక తెల్ల కాగితంపై , MRO కు రిక్వెస్ట్ చేస్తూ మీ కుటుంబ సభ్యుల పేర్లు, సంబంధం, పుట్టిన తేది, ఆధార్ నెంబర్, అడ్రస్, సెల్ నెంబర్ వ్రాసి వ్రాసి క్రింద సంతకం చేసి , అప్లికేషన్ కు అటాచ్ చేయండి. లేదా పూర్తిగా ఆ కాలం వదిలేయండి.
రేషన్ కార్డు అడ్రస్ వేరే ఉన్నా, అదే కార్డు నెంబరు వేయండి. తరువాత రేషన్ షాపు అడ్రస్ మార్చు కోండి.
07.మీ సెల్ నెంబర్ వేయండి
08. వృత్తి: మీరు చేసే పని ఏమిటో వ్రాయండి. సాధారణంగా ఈ ఆరు గ్యారెంటీలు పేదవారికి మాత్రమే కాబట్టి, కూలి అని వ్రాయండి. లేదా మీ ఇష్టం.
09. కుటుంబ సభ్యుల వివరాలు: క్రమ సంఖ్య, పేరు, దరఖాస్తు దారులతో సంబంధం (బార్యా, భర్తా, పెళ్లి కాని కొడుకా, బిడ్డా, తల్లా, తండ్రా, అత్తా, మామా), పురుషులా, స్త్రీలా, వారి పుట్టిన తేదీలు, ఆధార్ కార్డు నెంబరు వ్రాయండి.
దరఖాస్తు దారుని ఫోటో ను ఆ పై డబ్బాలో అతికించండి. దరఖాస్తు సంఖ్యను అధికారులు వేస్తారు.
10. చిరునామా: ఆధార్ కార్డు మీద లేదా ఓటర్ కార్డు మీద ఏ అడ్రస్ ఉంటే అదే వ్రాయండి . ఏమైనా తేడా ఉంటే తరువాత ఆధార్ ను అప్డేట్ చేసుకోండి.

మహాలక్ష్మి పథకం: ఇక్కడ అర్హులైన వారు 2,500 టిక్ చేయండి. కుటుంబంలో ఒకరికే వస్తుంది.
18 నుండి 55 సం.రాల వయసు గల వారికే ఇది వర్తిస్తుంది. పెన్షన్ వచ్చే వారికి ఇది రాదు.
రూ.500 గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కొరకు టిక్ చేయండి.
గ్యాస్ కనెక్షన్ నెంబరు వేయండి. గ్యాస్ సప్లయ్ చేస్తున్న వారి పేరు, గ్యాస్ పేరు వ్రాయండి.
సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు వాడుతున్నారో వ్రాయండి.
ఇక్కడ గ్యాస్ కనెక్షన్ కుటుంబ సభ్యుల ఎవరి పేరుమీద ఉన్నా పర్వాలేదు.
ఇ.కె.వై.సీ కి దీనికి ఎలాంటి సంబంధం లేదు. అది సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించినది.
రైతు భరోసా పథకం: (రైతులు, కౌలుదారులు,కూలీల కొరకు మాత్రమే. ఇతరులు వదిలేయండి)
ఆల్రెడీ రైతు బంధు వచ్చే వారు దీనిని నింప నవసరం లేదు. ఒక వేళ నింపినా నష్టమేమి లేదు.
రైతా లేదా కౌలు దారా అనేది టిక్ చేయండి.
రైతు  పట్టాదారు నెంబరు వేయండి. సాగు చేస్తున్న భూమి ఎన్ని ఎకరాలు, సర్వే నెంబర్ వేయండి.
కౌలు దారైతే సాగుచేస్తున్న భూమి విస్తీర్ణం, సర్వే నెంబర్ వేయండి.
వ్యవసాయ కూలీలకు సం.రానికి 12,000 లకు సంబంధించి
ఉపాధి పథకం కార్డు నెంబరు వేయండి.
ఇందిరమ్మ ఇండ్ల పథకం: ఇండ్లు లేని అర్హులైన వారు ఇంటి నిర్మాణానికి ఆర్ధిక సహాయం కొరకు టిక్ చేయండి.
అమరవీరులు, ఉధ్యమ కారులకు 250 గజాల స్థలం కొరకు, వివరాలను ఫిల్ చేయండి. కాని వారు వదిలేయండి.
గృహ జ్యోతి పథకం: కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచితం ఉంటుంది. దీనికి సంబంధించి, మీరు ఎన్ని  యూనిట్ల మధ్యలో వాడుతున్నారో  టిక్ చేయండి. కరెంట్ మీటర్ కనెక్షన్ నెంబరు వ్రాయండి.
ఇక్కడ కిరాయికి ఉండే వారు, వారు చెల్లించే బిల్లు నెంబర్ వ్రాయండి.
చేయూత పథకం: వృద్ధులకు నెలకు 4,000 అలానే వికలాంగులకు 6,000:
ఇక్కడ గుర్తు పెట్టుకోండి, ఇదివరకే పెన్షన్ పొందే వారు దీనిలో టిక్ పెట్ట నవసరం లేదు. పొరపాటున టిక్ చేసినా నష్టం ఏమీ లేదు.
రాని వారు మాత్రం తప్పక టిక్ చేయాలి. దివ్యాంగులైతే సదరన్ సర్టిఫికెట్ నెంబర్ వేయాలి.
చివరగా జతపరుచవల్సిన దరఖాస్తు దారుల ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ కాపీలు అటాచ్ చేయాలి. రేషన్ కార్డు లేని వారు తెల్లకాగితం పై కుటుంబ వివరాలు వ్రాసి ఇవ్వ వచ్చు. లేదా వదిలేయండి.
క్రింది భాగంలో  సంతకం లేదా వ్రేలు ముద్ర వేసి పేరు వ్రాయండి. తేది వేయండి.
అక్కడే అధికారులకు ఇవ్వండి, మీకు ఒక రశీదు ఇస్తారు. దానిని భద్రపరుచుకోండి.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే డిసెంబర్ 28 ,2023 నుండి, జనవరి 6, 2024 అనేది ఒక స్పెషల్ డ్రైవ్ మాత్రమే. వివిధ కారణాల వలన అప్లై చేసుకోని వారు ఉంటే, వారు జనవరి 6 తర్వాత కూడా MRO ఆఫీస్ లలో గానీ, మున్సిపల్ ఆఫీస్ లలో గానీ, మరేదైనా ప్రభుత్వం సూచించిన ఆఫీస్ లలో గానీ అప్లై చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అర్హులైన చివరి లబ్ధిదారులకు అందే వరకు ఇది ఒక నిరంతర ప్రక్రియ.

Tuesday, December 19, 2023

రాజకీయ మార్పుల ఆవశ్యకత/ ప్రభుత్వాల మార్పు ఆవశ్యకత

రాజకీయాలలో , ప్రభుత్వ పాలనలలో మార్పు జరుగుతూ ఉండాలి. రాజకీయాల్లో మార్పు జరుగాలని కోరుకోవడం మంచిది కూడా. ఫలాల నిచ్చే ఒక వృక్షానికి చెదలు పట్టినప్పుడు, ఫర్టిలైజర్స్ చల్లి, దానిని రక్షించక పోతే, అవి ఆ వృక్షాన్నే తినేస్తాయి. అలానే , భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశంలో రాజకీయాలలో మార్పు అనేది లేక పోతే , ఒకే పార్టీ / పాలకులు కంటిన్యూ గా పరిపాలిస్తే, ఆ నాయకులు ఏకచత్రాధిపతులుగా, నియంతలుగా మారిపోతారు. అనేక కుంభకోనాలకు పాల్పడుతారు. అవి ప్రజలకు తెలియకుండా పోతాయి. కోట్లాదిమందికి చెందాల్సిన సంపదను, కేవలం ఒకరిద్దరు నాయకులు తినేస్తారు. ప్రజలకు మాస్క్ లాగా ఉచిత పథకాలనే ఎంగిలి మెతుకులను చల్లి, దోచుకోవడం ప్రారంభిస్తారు. నియంతృత్వ పోకడలతో పాలనను కొనసాగిస్తారు. ఒక సారి ఎన్నికై ఆ పార్టీ అధికారం చేపడితే, ఐదేండ్లు, ఆ నాయకులే పరిపాలిస్తారు. ఒక వేళ నేతలు నిజాయితీగా , సమర్ధవంతంగా పరిపాలిస్తే ప్రజలు సంతోషంగా, ఆనందంగా జీవనం కొనసాగిస్తారు. లేదంటే, ప్రజలు స్వేచ్ఛ లేకుండా, అభివృద్ధి లేకుండా ఐదేండ్లు నరకం అనుభవించాల్సిందే. నాయకులు పోటీ చేసేటప్పుడు బి.ఫామ్ తో పాటు , ఒక అఫిడవిట్ ను సబ్మిట్ చేస్తారు. దానిలో వారి పూర్తి వివరాలు, ఆస్తులు అప్పులు, కేసులు ఎన్నో అన్నీ పొందు పరిచి సంతకం చేస్తారు. ఇది ఒక ప్రమాణ పత్రం లాంటిది. ఇక గెలిచాక, ప్రతి ఒక నేత రెండు ప్రమాణాలు చేస్తారు. ఎలాగంటే, "నేను ఏ తప్పు చేయను, ఏ మోసం చేయను, ప్రభుత్వ ఆస్తులను అన్యాక్రాంతం చేయను, నష్టపరుచను , పారదర్శక పాలన అందిస్తాను, ఆశ్రిత పక్షపాతం లేకుండా పాలన అందిస్తాను, ప్రజలను నిష్పక్షపాతంగా, కన్నబిడ్డలుగా చూసుకుంటాను " అని , వారి వారి దైవ శాక్షిగా ప్రమాణం చేస్తారు. తీరా ఐదేండ్ల తరువాత చూస్తే అన్నీ మోసాలే, అన్నీ దోపిడీలే, వారి ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగి పోతున్నాయి. కానీ ఏ స్పీకర్ గానీ, ఏచట్టాలు గానీ, మరొకటి గానీ చర్యలు చేపట్టిన దాఖలాలు ఈ 77 యేండ్ల చరిత్రలో ఇప్పటి వరకు లేవు. కొందరు ధైర్యం చేసి కేసులు పెట్టినా, విచారణలు జరిపించినా, నిరూపించబడినవి, శిక్షలు పడినవి వ్రేళ్ళ మీద లెక్క బెట్టదగినవి మాత్రమే. మరి కొందరు నేతలు, వారి ఆస్తులను కాపాడుకోవడానికి, నేరాలను, మోసాలను కప్పిపుచ్చుకోడానికి, ఒక పార్టీ ప్రజల ఓట్లతో ఎన్నుకోబడి, మరోరకమైన పార్టీ లోకి చేరుతున్నారు. మరల ఎన్నికలప్పుడు, ఏ కేసు లేకుండా, పరిశుద్ధ నాయకులుగా పోటీ చేస్తున్నారు. గెలుస్తున్నారు. ఎక్కడా దేనికీ ఒక నియంత్రణ అంటూ లేదు. ఎన్నికల కమీషన్ , చట్టాలు ఏమి చేయలేనప్పుడు , ప్రజలే ఓటు ద్వారా మార్పు కోరుకోవాలి. ముంచేవారెవరో , అభివృద్ధి చేసేవారెవరో తెలుసుకుని, మార్పు రావాలని కోరుకునే చదువుకున్న యువతీ యువకులు, సామాజిక బాధ్యతగల మేధావులు , ఓటర్లకు ఎన్నికల గురించి అవగాహన కల్పించడంలో తప్పు లేదు. అవినీతి నేతలను, ఎన్నిక కాకుండా చూడడానికి, ఓటర్లు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి, కాళ్ళు వేళ్ళు పట్టుకుని మార్పు వచ్చే విధంగా వారిని మోటివేట్ చేయడంలో తప్పు లేదు. నష్టం లేదు. నేటికీ, మెజారిటీ ప్రజలకు, ప్రజాస్వామ్యంపై ,రాజ్యాంగ హక్కులపై, చట్టాలపై, కోర్టులపై పూర్తి అవగాహన లేక , వారికి ఆ సమయానికి ఉచితంగా ఏది లభిస్తే అదే చివరి అవకాశంగా భావిస్తున్నారు. అందువలననే, రేపు ఆ పార్టీ పోతే, ఉచితాలు, సంక్షేమ పథకాలు లభించవేమో అని భావిస్తున్నారు. అలాంటి వారికి వివరంగా చెప్పి, మార్పు చెందే విధంగా, ప్రజలు అభివృద్ధి చెందే విధంగా, ఎవరికి చేతనైన విధంగా వారు , ఓటర్లను చైతన్య పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరో విషయం ఏమిటంటే, బావిలో నీరు ఎండినపుడే, గాజు పెంకులు బయట పడుతాయన్నట్లు, ఒక నాయకుడు ప్రజలకు మోసం చేసాడా లేదా, రాజ్యాన్ని దోచాడా లేదా అనేది, ఆ నాయకుడు లేదా ఆ పార్టీ ఓడి పోయినపుడే బయట పడుతుంది. అప్పటి వరకు పరిశుద్ధమైన నాయకులు గానే చలామని అవుతారు. చివరగా ప్రజలు గుర్తుంచు కోవల్సింది ఏమంటే, పుట్టుకతో వచ్చే బుద్ధి పుడకల్లోనే పోతుందన్నట్లు, మోసపూరితమైన నాయకులు, మరల మోసమే చేస్తారు, మరల దోచుకుంటూనే ఉంటారు. కాబట్టి అలాంటి నాయకులకు, అలాంటి పార్టీకి మరోసారి అవకాశం ఇవ్వకూడదు. మరోసారి మరో పార్టీని ఎన్నుకోవాలి. మార్పు కోరుకోవాలి. ప్రతి ఐదేండ్ల కొకసారి రాష్ట్ర పతి పాలన విధించాలని, సేవకులైన నాయకులు దోచుకోవడం ఆగిపోవాలని, నేతలలో భయం కలుగాలని. వారిలో సత్ప్రవర్తన రావాలని, ప్రజలకు ప్రశ్నించే స్వేచ్ఛ ఉండాలని, అభివృద్ధి జరుగాలని కోరుకుందాం.

Monday, December 18, 2023

తలసరి అప్పు అప్పు అంటే ఏమిటి? What is mean by per capita Debt?

ఈ మధ్య కాలంలో అతిగా రాష్ట్రాల అప్పుల మీద, ఆదాయాల మీద మరియు తలసరి అప్పుల మీద చర్చ జరుగుతుంది. అలానే ప్రతి రాజకీయ, ప్రభుత్వాల విషయాలు ఈ మధ్యనే బహిరంగంగానే ప్రజలకు తెలుస్తున్నాయి. ఇది మంచి శుభ పరిణామం . కొందరు రాష్ట్రంలో అప్పులు పెరిగితే , ఒక్కొక్కరి పైన ఇంత భారం పడుతుందని, దానికి మరి కొందరు, ఒక్కొక్కరిపై అంత భారం పడితే ఏంది, మంత్రులు ఏమైనా మీ ఇంటికొచ్చి మిమ్మల్ని మిత్తి అడుగు తున్నారా, అసలడుగుతున్నారా అని అమాయకంగా మాట్లాడుతుంటారు . నిజమే అలా ఎవరూ ఇంటికొచ్చి ఏమి అడుగరు. డిమాండ్ చేయరు. ముందుగా "తలసరి అప్పు" అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకు ఒక రాష్ట్రానికి 5లక్షల కోట్ల అప్పు ఉంది అని అనుకుందాం. ఇక ఆ రాష్ట్రంలో సుమారుగా 3కోట్ల50లక్షల జనాభా ఉందనుకుందాం. అప్పుడు ఆ 5 లక్షల కోట్ల అప్పును, 3 కోట్ల 50 లక్షల జనాభాతో భాగిస్తే, ఒక్కొక్కరిపై అప్పు 1,42.857 అని తెలుస్తుంది. దీనినే "తలసరి అప్పు" అని , ఒక్కొక్కరి పై పడే భారం అని అంటారు. వ్యక్తుల లాగానే ప్రభుత్వాలు అప్పు చేయడం అనేది సహజం. అయితే ఆ అప్పు రాష్ట్ర అభివృద్ధికి చేస్తే సమస్య ఏమిలేదు. అప్పు ఎంత చేయాలి , దానిని ఎలా తీర్చగలం, దాని వలన ఎంత కాలానికి ప్రయోజనం చేకూరుతుంది, అప్పులు భరించే స్తోమత రాష్ట్రానికి , దేశానికి ఉందా అనేది పరిశీలించి అప్పులు చేస్తే తప్పు లేదు. ఇప్పుడు అప్పుగా కనబడినా, భవిష్యత్తులో దాని ఫలాలు, మనం , మన రేపటి తరాల వారు అనుభవిస్తారు. కానీ అదే అప్పును, స్వార్థంతో కొందరి కుటుంబాల తరాలకో, రేపటి అధికారం కొరకో, దోచుకుంటూ పోతే, నేడు ప్రజలు, రేపటి వారి తరాలు మరింత పేదరికం లోకి దిగజారి పోతారు, సోమరులుగా, బానిసలుగా మారిపోతారు. ఇక ఏ ప్రభుత్వమైనా ఆ అప్పును, దానిపై వడ్డీని ఎలా రికవర్ చేస్తారంటే; 01. ప్రజలపై అధిక పన్నుల భారం మోపుతారు 02. ట్రాఫిక్ చలాన్ల రేట్లు పెంచుతారు 03. ప్రజలకు చెల్లించాల్సిన సంక్షేమ పథకాలను ఆపేస్తారు. 04. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ నిలిపేస్తారు 05. ప్రజలకు సంబంధించిన ఉచిత విద్య, వైద్య సదుపాయాలు ఆపేస్తారు 06. కార్య కర్తలకు మినహా అర్హులైన వారికి సంక్షేమ పథకాలు నిలిపేస్తారు 07. ప్రభుత్వ ఖాలీలను/ఉద్యోగాలను భర్తీ చేయరు 08. ప్రభుత్వ బడి పిల్లలకు భోజన సదుపాయాలు, పుస్తకాలు, బట్టలు సప్లై చేయరు. 09. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలను నిలిపేస్తారు. 10. రోడ్లను, మోరీలను, పారిశుధ్యాన్ని పట్టించుకోవడం శుద్ధ దండుగ అని అనుకుంటారు. 11. నిజాయితీగా పన్నులు కట్టే వారు అసహనానికి గురవుతారు 12. ప్రభుత్వ భూములను అనుంగులైన వారికి, తక్కువ ధరలకు అమ్ముతారు. 13. అప్పటికీ అప్పు, వడ్డీలు తీరక పోతే, రాబోయే ప్రభుత్వం నెత్తిన వేస్తారు. గత చరిత్రను చూస్తే ఇది ప్రస్తుతం జరిగేది. అంతేకానీ ఏ మంత్రి ఇంటికి వచ్చి అసలు గానీ మిత్తి గానీ అడుగరు.

Tuesday, December 12, 2023

మహిళలకు తెలంగాణా అంతటా ఉచిత ప్రయాణం (FREE BUS TRAVEL TO WOMEN IN TELANGANA

"ఉచితం" అనేది రెండు వైపుల పదునైన ఆయుధం లాంటిది. ఉచితం పేర్లు ఏవైనా అవి కొందరికి మేలు కలిగిస్తే మరికొందరికి సమస్యలను సృష్టిస్తాయి. ఉచితాల వలన ప్రభుత్వానికి  కొన్ని లాభాలుంటే, కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. ఉచితాల వలన కొన్ని రాష్ట్రాలు, దేశాలు అప్పుల పాలై  కుప్ప కూలినవి కూడా ఉన్నాయి.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వలన కలిగే 
 కొన్ని ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం:

01. మహిళలకు ఉచిత ప్రయాణం వలన, ఆర్ధిక భారం తగ్గుతుంది. బస్ పాస్ ల డబ్బు, బస్సు చార్జీలు మిగలడం వలన, పేద మహిళలు వాటిని ఇతర ఖర్చులకు పొదుపుగా వాడుకుంటారు.
02. చిరు ఉద్యోగులకు, విద్యార్థినులకు, అనారోగ్యంతో ఉన్న వారు , అడ్డకూలీలకు, దూర ప్రాంతాల వ్యాపారస్తులకు చాలా మేలు జరుగుతుంది.
03. అనారోగ్యంతో ఉన్న మహిళలు, వారి పిల్లలు , 5 సం.లోపు ఉన్న మగ పిల్లలకు కూడా మెరుగైన వైద్యం కోసం పట్టణాలకు వచ్చే వారికి , ఉచిత బస్సు ప్రయాణం ఎంతో ఊరట నిస్తుంది.
04. పాచి పనులు, నర్సు పనులు, ఇతర సర్వీసులు అందించే వారు, ఇంటి కిరాయీలు తక్కువగా ఉన్న చోట నివసిస్తారు. రవాణా చార్జీల భారం భరించలేక, ఆ చుట్టుపక్కలనే, తక్కువ డబ్బులకు పని చేస్తారు.
ఇప్పుడు వారు ఏ ప్రాంతాలలో డబ్బులు ఎక్కువగా ఇస్తారో అక్కడికి వెళ్ళి ఎక్కువ డబ్బు సంపాదించు కోగలరు
05. రవాణా చార్జీల వలన కొందరు, వారి పనులను వాయిదా వేసుకుంటారు. 4, 5 పనులకు కలిపి ఒకేసారి వెలుతారు. ఇప్పుడు అలా పెండింగ్ పెట్టరు.
06. ఏ మీటింగ్ లు ఉన్నా, మహిళలందరు కలిసి, ఎంత దూరమైనా వెళ్ళి పోతారు.
07. విద్యార్ధినులను, ఉద్యోగ మహిళలను స్కూటర్ల పై , కార్లలో డ్రాప్ చేసే , తల్లిదండ్రులకు, భర్తలకు, ఎంతో డబ్బు, సమయం ఆదా అవుతుంది,
08. స్త్రీలకు ఆర్థిక సాధికారత పెరుగుతుంది. స్వేచ్ఛ, ధైర్యం, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ప్రయాణాలపై అవగాహన పెరుగుతుంది.
09. మహిళలు, గుళ్ళకు, ఫంక్షన్లకు , విహారాలకు, బంధువుల ఇండ్లకు వెలుతూ ఉండటం వలన ప్రశాంతత లభిస్తుంది.
10. చిన్న చిన్న పనులకు, మగవారు స్కూటర్లపై, కార్లలో వెళ్ళే బదులు, వారి కూతుర్లను, భార్యలను, తల్లులను పంపిస్తారు. దీని వలన ఫ్యామిలీకి అధిక డబ్బు, సమయం ఆదా అవుతుంది.
11. స్త్రీలే అధికంగా వెలుతారు కాబట్టి, బస్సులలో సెక్యూరుడుగా ఫీలవుతారు.
12. దూర ప్రాంతాలని, బస్సు చార్జీల భారం భరించలేక, కొందరు పేద విద్యార్థినిలు, మధ్యలోనే చదువులు మానేస్తున్నారు. అలాంటి వారు ఇప్పుడు చదువుకోడానికి ఆసక్తి చూపుతారు.
13. అంతే కాకుండా రవాణా చార్జీలు భరించలేక కొందరు ఆడ పిల్లలను దగ్గరలోని ఏదో ఒక స్కూల్ లో చదివిస్తున్నారు. ఇప్పుడు వారు ఎంత దూరమైనా మంచి స్కూళ్ళలో చదివించడానికి అవకాశం ఉంది.
14. మరికొందరు పట్టణాలలో, రూములు రెంటుకు తీసుకుని చదవడానికి, ఉద్యోగం చేయడానికి, చాలా డబ్బు ఖర్చు అవుతుంది. రిస్క్ అవుతుంది, సేఫ్టీ ఉండటం లేదు. ఇప్పుడు వారు ఇంటి నుండే పట్టణాలకు వెళ్ళి చదువుకుని లేదా ఉద్యోగం చేసి రాత్రి వరకు ఇంటికి చేరవచ్చు.
15. రవాణా ఖర్చు లేక పోతే అన్ని ప్రాంతాలలో ధరలు తగ్గి పోతాయి.
16. రవాణా చార్జీలు లేక పోవడం వలన, గ్రామీణ ప్రాంతాల మహిళలు, అక్కడ తక్కువ ధరలకు అమ్మే బదులు, పట్టణాలకు వచ్చి ఎక్కువ ధరలకు కూరగాయలు, పండ్లు, పూలు, ఇతర వస్తువులు, మధ్య దళారులు లేకుండా అమ్మకో గలరు.
17. స్త్రీల మూవ్ మెంట్ పెరుగుతుంది. ఇప్పటి వరకు రవాణా చార్జీలు ఉండటం వలన, ఒంటింటి కుందేలు లాగానే ఉండేవారు. ఇప్పుడు అది ఉండదు. అవసరాలు  ఉంటే ఎక్కడికైనా వెలుతారు.
18. పార్లమెంట్ లో పాసైన మహిళా బిల్లు కంటే గొప్పగా , పూర్తి స్వేచ్ఛ లభించినట్లుగా, స్త్రీలు చాలా గొప్పగా ఫీలవుతుంటారు 
19. పర్యాటక రంగం అభివృద్ధి చెందగలదు. దీని వలన ప్రభుత్వానికి పరోక్ష పన్నుల రూపంలో ఆదాయం పెరుగగలదు.

ఇప్పుడు ఇక కొన్ని నష్టాల గురించి తెలుసుకుందాం:
01. మహిళలకు బస్సు చార్జీలు ఉచితమైతే, అది ప్రభుత్వానికి నష్టం. రోజుకి అది సుమారుగా 7 కోట్ల రూపాయలు ఉంటుందని అని ఒక అంచనా
02. బస్సు చార్జీలు ఉచితం కావడం వలన, మెట్రో, ఎంఎం టీఎస్ ట్రేన్లలో ప్యాసెంజర్లు తగ్గిపోతారు. అందువలన వీటికి నష్టం వాటిల్లుతుంది.
03. బస్సులలో ట్రాన్స్ జెండర్స్ కు ఫ్రీ అవకాశం కల్పించారు ‌. వీరిలో ఎవరు నిజమైన ట్రాన్స్ జెండర్సో తెలియదు. బెగ్గింగ్ కొరకు చీరెలు కట్టుకుని ప్రయాణం చేస్తే, మహిళలకు చాలా ఇబ్బంది కరంగా మారవచ్చు.
04. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వలన, ధనవంతులు, ఆదాయ పన్నులు కట్టే వారు, కార్లు, బస్సులు ఉన్న వారు కూడా, ఆర్టీసి బస్సులలో ప్రయాణించడం వలన, ప్రభుత్వానికి అధిక భారం పడుతుంది. అలానే బస్సులలో అనవసరంగా రద్దీ పెరుగుతుంది. దీని వలన స్థోమత గల, ఉద్యోగ భాద్యత గల మహిళలకు అన్ కంఫర్ట్ గా ఉంటుంది.
05. మహిళలకు అధిక భారం పెరుగుతుంది. ప్రతి పనికి, పేద మగవారు, మీకు ఉచితం కదా అని, మద్యానికి , మందులకు, బ్యాంకులకు, షాపింగ్ లకు స్త్రీలనే బయటకు పంపిస్తారు. మగవారు చెసే బయటి పనులన్నిటికీ స్త్రీలనే పంపించడానికి ఆలోచిస్తారు.
06. మొదట సరదాగానే ఉంటుంది. కానీ కొంత కాలం తర్వాత వారు చాలా భారంగా ఫీలవుతారు. ఆ తర్వాత బయట స్నేహాలు పెరిగి, ఇతర వ్యాపకాలకు అలవాటు పడవచ్చు.
07. కుటుంబాలలో, ప్రతి రోజూ ఏదో ఒక సమస్య ఉండనే ఉంటుంది. అలాంటి సమస్యలు జరిగినప్పుడు, స్త్రీలు ఇంట్లోనే సర్దుకు పోయే వారు. ఇప్పుడు అలా ఇంటి పట్టున ఉండకుండా, ప్రశాంతత కొరకు అని ఎక్కడికైనా వెళ్ళి పోతారు.
దీని వలన మరిన్ని సమస్యలు రావడానికి అవకాశం ఉంది.
08. బస్సు ప్రయాణం ఉచితమని తిరిగే అలవాటు ఉన్న కొందరు  ప్రక్క స్త్రీలను వెంటేసుకుని తిరగడం వలన ఉన్నతమైన మంచి కుటుంబాలలో, భార్యా భర్తల సంబంధాలు, తల్లిదండ్రులు పిల్లల సంబంధాలు దూరమయ్యే అవకాశాలను కొట్టి పారేయ లేము.
09. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం లేక పోలేదు
10. పని ఉన్నా లేకున్నా బస్సులలో ఉచితం కాబట్టి, మహిళలు ప్రయాణించడం వలన, బస్సులలో మహిళల సంఖ్య పెరిగి, ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుంది.
11. ఉచితం అనగానే రద్దీ, దీనికి తోడు, అన్నీ మరిచి,  బస్సులలో ఆనందంగా ఉంటారు. దొంగలకు అలాంటి అవకాశమే కావాలి. ఆ కారణంగా బస్సులలో దొంగతనాలు జరిగే అవకాశం లేక పోలేదు.
12. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావడం వలన, ఆటోలకు, వోలా, ఊబర్ లాంటి టాక్సీ లకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. చక్రాలు తిరుగుతేనే వారు ఇ.ఎమ్.ఐలు , పిల్లల ఫీజులు, టాక్స్ లను కట్టగలరు. కుటుంబాలను పోషించుకోగలరు. లేదంటే వారి కుటుంబాలు రోడ్డున పడగలవు.
13. ద్వి చక్ర వాహనాల అమ్మకాలు తగ్గి పోతాయి.
మధ్య దళారులకు నష్టం వాటిల్లుతుంది.
బస్సులు ఉచితం అని ఓ పది మంది మహిళలు కలిసి రెగ్యులర్ గా , గుళ్ళకు, విహార యాత్రలకు తెలంగాణా అంతటా తిరుగు తుంటే, ప్రభుత్వానికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు ప్రయాణం మరింత ప్రయోజనకరంగా మారాలంటే ఏమి చేయాలి?

ఉచితాలకు అలవాటు పడిన ప్రజలు, హామీ ఇచ్చిన హామీలలో ఏ చిన్న మార్పు చేసినా విరుచుకు పడుతారు. వీరికి తోడు ప్రతి పక్షాలు మరియు విమర్శకులు తోడవుతారు. ఇది సహజం. అయినప్పటికీ,
01. ఆదాయ పన్నులు చెల్లించే వారు, కార్లు, బస్సులు ఉన్న, ధనవంతులైన మహిళలు, వారి పిల్లలు, ఉచితం మాకు వద్దు అనే మహిళలు, వారే స్వచ్చందంగా ఉచిత బస్సులలో ప్రయాణించ వీలు లేకుండా, వారికి ఉచిత కార్డులను ఇష్యూ చేయకూడదు. దీని వలన కొంత వరకైనా ఆటో, టాక్సీ డ్రైవర్ లకు మరియు ప్రభుత్వానికి కొంత మేలు జరుగ గలదు.
02. విద్యార్ధినులకు, ఉద్యోగం కొరకు వెళ్ళే మహిళలకు, చిరు ఉద్యోగులకు, పేద మహిళా కూలీలకు, చిరు వ్యాపారస్తులకు, అర్హులైన ట్రాన్స్ జెండర్స్ కు , మాత్రమే ఫ్రీ కార్డులను ఇష్యూ చేయాలి.
03. ముందుగా, ఇప్పటి వరకు బస్ పాస్ లు కలిగిన మహిళలందరికీ, విద్యార్ధినులందరికీ, ఫ్రీ కార్డులను జారీ చేయాలి. ఆ తర్వాత ఇతర మహిళలకు జారీ చేయాలి.
04. ఆఫీస్, స్కూల్ టైమ్ లలో, అవసరమైన రూట్లలో మహిళలకు స్పెషల్ బస్సులను వేయాలి.
బస్సుల సంఖ్యను పెంచాలి, సమయపాలన పాటించాలి
05. ప్రభుత్వ పాఠశాలలో ఫ్రీ అంటే ఎంత మంది పిల్లలు చదువుతున్నారు. అలానే  బస్సులలో ఉచితం అన్నంత మాత్రాన అందరూ బస్సులలో నే వెళ్ళరు . వారి సౌకర్యం, వేగం , సెక్యూరిటీ  , ఇంటి వరకు చేరే విధానం చూసుకుంటారు. వీధుల్లోకి, ఇండ్ల వరకు బస్సులు పోవు . ఆటో , టాక్సీ వారు ఇవన్నీ గమనించి, ప్రయాణికులలో మన్నత పెంచు కుంటే, వారి గిరాకీ ఎక్కడికి పోదు. ధరలు తగ్గించి పోటీ పడాలి. 
06. మెట్రో, ఎంఎం టీఎస్ లకు కూడా, ఎలాంటి నష్టం వాటిల్లదు. దానిలో ప్రయాణించే ధనికులు, వేగం, సేఫ్టీ కోరుకునే వారు వాటిల్లోనే వెలుతారు.
07. గ్రామ ప్రాంతాలకు, పల్లె వెలుగు బస్సులను పెంచాలి
08. ఆర్టీసీకి నష్టం రాకుండా, వారి యొక్క సమస్యలను పరిష్కరిస్తూ, ఆర్టీసి ఆదాయ వనరులను పెంచాలి.
09. ఆర్టీసీకి నెలకోసారి, మహిళలకు సంబంధించిన చార్జీలను చెల్లించాలి
19. ప్రభుత్వానికి నష్టం కలుగకుండా, టూరిజం , పార్కింగ్స్  అభివృద్ధి చేయాలి. దీని వలన ప్రభుత్వానికి పరోక్ష పన్నుల రూపంలో ఆదాయం పెరుగగలదు.
11. నిజాయితీగా అభివృద్ధి పనులు చేపడుతూ, మెల్లగా మెల్లగా ఉచితాలను తగ్గించడానికి ప్రయత్నాలు చేపట్టాలి. ప్రజలలో చైతన్యం తీసుకు రావాలి. ఇది వ్యవస్థలలోనే రావాలి. ఓటు బ్యాంకు కొరకు ఉచితాలను ఇవ్వాలని పోటీ పడుతున్నారు. ఉచితాలకు అలవాటు పడిన ప్రజలు, ఎవరు ఎక్కువ ఉచితాలు ఇస్తే వారికి ఓటు వేస్తున్నారు. లేదంటే ఇంట్లో నుండి కదలడం  లేదు. ఉచితాలను ప్రోత్సహించే వారికి కఠిన శిక్షలు వేసే, ఎన్నికల వ్యవస్థ రావాలి. ఓటర్లకు పంచే డబ్బు, ఏ ప్రాంతంలో పట్టుబడితే, ఆ ప్రాంతంలో అభివృద్ధికే , మొత్తం డబ్బును ఖర్చు చేసే చట్టాలు రావాలి. 

Friday, December 8, 2023

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు సలహాలు, సూచనలు

 ఏ ప్రభుత్వమైనా, ప్రజల ఆలోచనలను, సూచనలను, సలహాలను తీసుకుంటూ, పరిపాలన సాగిస్తేనే, ప్రభుత్వం పది కాలాల పాటు ఫరిడవిల్లు తుంది. అలానే నాయకులు చరిత్రలో, ప్రజలు గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచి పోతారు .


రాష్ట్రం అప్పుల పాలు కాకుండా, మిగులు నిధులుతో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, అన్ని వర్గాల , అన్ని ప్రాంతాల ప్రజలు, అన్ని వయస్సుల వారు సంతోషంగా జీవిస్తూ, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే, పాలకులు
ప్రజల సలహాలు, సూచనలు  తప్పక పరిశీలనకు తీసుకుంటారని ఆశిస్తున్నాం.

నేడు జీవన వ్యయం అనూహ్యంగా పెరిగింది కాబట్టి, అర్బన్ ఏరియాలో నివసించే వారి వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉన్న వారిని, అదే రూరల్ ఏరియాలో నివసించే వారి వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉన్న వారిని  ఈ 6 గ్యారంటీ పథకాలకు అర్హులుగా పరిగణించాలి. అలాగే తప్పకుండా  ఈ 6 గ్యారంటీలను అమలు చేయాలి.
అలానే 5 నుండి 10 లక్షల లోపు  వార్షికాదాయం ఉన్న వారిని మధ్యతరగతి గాను  పరిగణించాలి.

అర్హులైన వారికి ఈ 6 గ్యారంటీలను అమలు చేయడం సాధ్యమా అంటే , ఖచ్చితంగా సాధ్యమే.
ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి, అవినీతి సొమ్మును రికవరీ చేస్తూ, భూకబ్జాలను తిరిగి రాబట్ట గలుగుతే, భూసీలింగ్ లను అమలు చేసినట్లయితే, అవినీతి  పథకాలను అరికట్టి నట్లయితే, తక్షణమే ధరణి పోర్టల్ ప్రక్షాళన చేపడితే ఈ 6 గ్యారంటీలు కచ్చితంగా సాధ్యమవుతాయి. సులభంగా అమలు జరుగుతాయి కూడా.

01. మహాలక్ష్మి పథకం ద్వారా, అర్హులైన మహిళలకే,  ప్రతినెలా 2500 రూ.లు ఇవ్వాలి. ఆదాయ పన్నులు కట్టే వారికి, కార్లు, లారీలు, బస్సులు ఉన్న కుటుంబాల మహిళలకు వర్తింప చేయకూడదు. ప్రతి కుటుంబానికి 500 రూ.లకే గ్యాస్ సిలిండర్ తప్పక ఇవ్వాలి, మహిళలకు తెలంగాణా అంతటా ఆర్టీసి బస్సులలో ఉచిత ప్రయాణం అమలు చేయాలి. అయితే చాలా బస్సు రవాణా సౌకర్యాలు లేవు. అలాంటి రేట్లను గుర్తించి బస్సులను నడుపాలి. ఇప్పటి వరకు ఆయా రూట్లలో, ఆటోలు, క్యాబ్ లో పైన ఆధారపడాల్సి వస్తున్నది. మరో విషయం, ఉచిత ప్రయాణం కాబట్టి మహిళలు ఎక్కువగా ప్రయాణం చేయడం జరుగుతుంది. కాబట్టి, రద్దీ ఉన్న రూట్లను గుర్తించి, మహిళలకు సెపరేట్ బస్సులను వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వలన విద్యార్థినులకు, చిరు ఉద్యోగ మహిళలకు చాలా మేలు చేకూరుస్తుంది. ఆర్ధిక భరోసా నిస్తుంది. మహిళలకు ఉచితం అనేసరికి , వారి ఫ్యామిలీ తో కూడా వస్తారు కాబట్టి, బస్సుల్లో రద్దీ పెరుగుతుంది. ఆ విధంగా ఆర్టీసీ లాభాల బాట పడుతుంది.
02. రైతు భరోసా పథకం ద్వారా, ప్రస్తుతం ఉన్నటువంటి, రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేయాలి. ఆ తర్వాత 10 ఎకరాల లోపు మాగాణి భూమి ఉన్నవారికి, 15 ఎకరాల లోపు మెట్ట భూమి ఉన్న వారికి మాత్రమే రైతు రుణమాఫీ వర్తింప చేయాలి.
03. అలానే రైతు బంధు పథకం 10 ఎకరాల లోపు మాగాణి భూమి, 15 ఎకరాల లోపు మెట్ట భూమి ఉన్న వారికే వర్తింప చేయాలి. మైనింగ్ భూములకు, గుట్టలకు, కాలేజీల భూములకు, బీడు భూములకు, భూస్వాములకు రైతు బంధు పథకం, రుణమాఫీ వర్తింప జేయకూడదు.  ఇక పోతే,
భూమిని సాగు చేసేది, భూమిని అభివృద్ధి చేసేది , రైతుల భూమిని కాపాడేది , రేయింబవళ్ళు కష్టపడేది, పంట పండినా, పండక పోయినా, గిట్టుబాటు ధర దొరకక పోయినా భరించేది , పంటలను పండించేది కౌలు దారులు కాబట్టి , కౌలు దారులకు సం.రానికి 15000 రూ.లు (రెండు దఫాలుగా)  ఇవ్వాలి.
ఒక వేళ రైతులే పంటలు పండిస్తే, రైతులకే రైతు బంధు , రుణమాఫీ వర్తింప చేయాలి.
04. అలానే మీరు ఇచ్చిన గ్యారంటీల ప్రకారం వ్యవసాయ కూలీలకు సం. రానికి 12000 రూ.లు ఇవ్వాలి . కూలీలు అంటే రైతు బంధు రాని వారు మాత్రమే కూలీలు. కూలీలకు ప్రత్యేక కార్డులను జారీ చేయాలి. , ప్రతి వరి పంట క్వింటాల్ కు 500 బోనస్ అది రైతులు కావచ్చు, కౌలు దారులు కావచ్చు ఇవ్వాలి. అలాగే,  రైతులకు నాణ్యమైన ఎరువులను, సమయానికి పంపిణీ చేయాలి. నీరు విద్యుత్ సమృద్ధిగా అందించాలి. పండిన పంటలు నిల్వ చేసుకోడానికి, ప్రతి మండలంలో గిడ్డంగులను నిర్మించాలి. పండిన పంటకు ,మధ్య దళారులు లేకుండా, గిట్టుబాటు ధరను కల్పించాలి. రైతులు పండించే పంటలపై, అమ్మకాలపై రైతులకే/ కౌలు దారులకే పూర్తి స్వేచ్ఛ ఉండాలి.

05. గృహ జ్యోతి పథకం ద్వారా, పేద, మధ్య తరగతి వారికి మాత్రమే 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలి. దీనికి , గత సంవత్సరం వినియోగించిన ఆవిరేజ్ యూనిట్లను బేస్ చేసుకుని , కొంత పర్సెంట్ యూనిట్లను అదనంగా కలిపి, ఎల్జిబిలిటీని నిర్ణయించాలి. ఆపై వినియోగించిన వారికి బిల్లులు వేయాలి. అందరికీ ఉచితం అనగానే సాధారణంగా, విద్యుత్ బంధు చేయాలని, పొదుపుగా వాడుకోవలనే ఆలోచన ఉండదు. దీని వలన ప్రభుత్వంపై భారం అధికంగా పడుతుంది. కరెంట్ వాడకం పై సామాజిక బాధ్యతను పెంచాలి.

06. ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా, భూకబ్జాలను గురైన  భూములను సేకరించి, అర్హులైన  పేదలకు, మధ్య తరగతి వారికి మాత్రమే ఇండ్లు లేని వారికి డబుల్ బెడ్ రూమ్  ఇండ్లు కట్టించి ఇవ్వాలి. ఇంటి స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయలు దశల వారీగా ఇవ్వాలి.
ఇండ్లు లేని వారు , వారే ఇండ్లు కట్టుకుంటానంటే 100 గజాలు ఉచిత స్థలాన్ని ఇవ్వాలి. ఇండ్లు లేని జర్నలిస్టులకు, కళాకారులకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలి.
ఉద్యమకారులకు గ్యారంటీలో చెప్పిన ప్రకారం 250 గజాలు ఇండ్ల స్థలాలు ఉచితంగా ఇవ్వాలి.
మరి కొందరు ఇండ్లు లేని వారికి , డబ్బు మేము కూడా చెల్లించగలం అనేవారికి, సబ్సిడీతో 10 లక్షల లోపు ఇండ్లు నిర్మించి ఇవ్వాలి.  పూర్తిగా ప్రభుత్వం పైననే భారం పడకుండా, ఇలా ప్రజల భాగస్వామ్యంతో, అందరికీ ఇండ్లు సమకూరే అవకాశం ఉంటుంది. అలానే, ఆల్రెడీ ఇండ్లు ఉన్న వారికి  , ఇండ్లు గానీ, ఇంటి స్థలం గానీ, ఇండ్లు నిర్మించు కోడానికి డబ్బు గానీ ఇవ్వ కూడదు.

07. యువ వికాసం పథకంలో  మీరు ఎలాగో నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావించ లేదు. దానికి బదులుగా ముఖ్యమైన ప్రాంతాలలో , ఉద్యోగం వచ్చే వరకు, ఉచిత స్కిల్స్ డెవలప్ మెంట్ కోచింగ్ సంస్థలను ఏర్పాటు చేయాలి. ప్రతి ఒక యువతీ యువకులకు ఉచిత వసతి , ఉచిత భోజనం కల్పించాలి.  ప్రతి మండలంలో ఒక కోచింగ్ సెంటర్ ను, కాలేజీలను ఏర్పాటు చేయాలి. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ను ఏర్పాటు చేయాలి. ప్రయివేట్ స్కూళ్ళకు ధీటుగా, నాణ్యమైన విద్యను అందించాలి.
నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలి.
ప్రభుత్వ శాఖలలో ఖాలీగా ఉన్న ఉద్యోగాలను
ఏ సంవత్సరానివి ఆ సంవత్సరంలోనే, నోటిఫికేషన్లు జారీ చేసి, పరీక్షలు జరిపించి భర్తీ చేయాలి. ఏ అక్రమ బిల్డింగ్ లను కూలగొట్ట కుండా, వాటిని విద్యార్ధులకు వసతి గృహాలుగా మార్చాలి.
08. చేయూత పథకం ద్వారా, అర్హులైన వారికి ఆసరా పెన్షన్ 4000 చెల్లించాలి. అలానే 10 లక్షల ఆరోగ్యశ్రీని భీమాను కల్పించాలి.
09. ఈ 6 గ్యారంటీల అమలుకు ప్రత్యేక వెబ్సైట్ ను
ఏర్పాటు చేయాలి మరియు దాని వివరాలు, అప్లై చేసుకునే విధానం, నియమ నిబంధనలు ప్రచారం చేయాలి.
10. తెలంగాణా రాష్ట్రం కొరకు బలిదానాలు చేసిన కుటుంబాలకు , వారి పిల్లలకు ఆర్ధిక భరోసా, ఆరోగ్య భరోసా మానసిక స్థైర్యాన్ని కల్పించాలి.
11. పార్టీలతో సంబంధం లేకుండా, ప్రతిపక్షాలు, గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా, అన్ని గ్రామాలను, పట్టణాలను సమానంగా అభివృద్ధి చేయాలి. గ్రామాలను, పట్టణాలకు ధీటుగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఉపాధి అవకాశాలు, ప్రయివేట్  పాఠశాలలకు , ప్రభుత్వ  పాఠశాలలో ఉచిత విద్యను  అందించాలి. అలానే ఉచిత వైద్యశాలలను అభివృద్ధి చేస్తే పట్టణాలకు వలసలు తగ్గుతాయి. పట్టణాలలో రద్ధీ తగ్గుతుంది.
12. బెల్ట్ షాపులను పూర్తిగా ఎత్తి వేయాలి.
13. అక్రమ కేసులను, విచారణ చేసి ,ఎత్తి వేయాలి.
14. ప్రజలకు ప్రశ్నించే స్వేచ్ఛను, సమస్యలపై ధర్నాలు చేసుకునే స్వేచ్ఛను, ప్రభుత్వ కార్యాలయాలు, సభలకు, సచివాలయంలోకి అనుమతితో ప్రవేశించేందుకు స్వేచ్ఛను కల్పించాలి.
15. అర్హులైన పేద మధ్యతరగతి వారి కుటుంబాల వారికే రేషన్ కార్డులు వర్తింప చేయాలి. అవి రెండు రకాలుగా ఉండాలి. పేదలకు 1 రూపాయికి కిలో బియ్యం , మధ్య తరగతి వారికి 5 రూ.లకు కిలో సన్న బియ్యం ఇవ్వాలి. అప్పుడే అన్ని రేషన్ కార్డులు ఉపయోగం లోకి వస్తాయి. నేడు దొడ్డు బియ్యం తెచ్చుకుని, తినలేక, అమ్ము కుంటున్నారు. మరికొందరు తెచ్చుకోడానికే ఇష్ట పడటం లేదు. తీసుకోని బియ్యం దొడ్డిదారి పడుతున్నాయి. అన్నపూర్ణ కార్డులకు ఉచిత బియ్యం యధావిధిగా అమలు చేయాలి.
ప్రతి రేషన్ కార్డుకు, ఆధార్ నెంబర్ లింక్ చేయాలి.అప్పుడే అవినీతి, అక్రమాలు తగ్గిపోతాయి.

16.  ట్రాఫిక్ ఛలాన్ల రేట్లు తగ్గించాలి.
17. పెట్రోల్ డీజిల్ పై పన్నులను తగ్గించాలి.
18. ఓటరు కార్డులకు, ఆధార్ నెంబర్ ను లింక్ చేయాలి. అప్పుడే ఒకే వ్యక్తి  పేరు రెండు చోట్ల రిజిస్టర్ అవదు. దీని వలన రెండు ప్రాంతాలలో, రెండు రాష్ట్రాలలో ఓటు వేయడం ఆగిపోతుంది. దొంగ ఓట్లు పడవు
19. గ్రామాలలో, గ్రేటర్ హైదరాబాద్ లో  మోరీలను, డ్రైనేజీ సిస్టంను సరిచేయాలి.
20. కనీసం ప్రతి 5 కి.మీ. దూరంలో ఒక పార్కింగ్ బిల్డింగ్ లను నిర్మించాలి.
21. గ్రేటర్ హైదరాబాద్ లో జనాభా రద్ధీని తగ్గించాలి. రింగ్ రోడ్ల వరకు మెట్రోరైలును విస్తరింప జేయాలి. రింగ్ రోడ్ల చుట్టూ టౌన్ షిప్ లను , ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను , విద్య వైద్యం ఉపాధి సంస్థలను నెలకొల్పాలి.
23. రాష్ట్ర ఆదాయం పెంచడానికి, విదేశీ పెట్టుబడులను, విదేశీ ఉపాధి సంస్థలను రప్పించాలి. టూరిజంను అభివృద్ధి చేయాలి.
24. సామాన్యులకు ఓటు హక్కు కావాలని కృషి చేసిన డా. అంబేడ్కర్ గారి కృషికి ఫలితం దక్కాలంటే, ఓటుకు విలువను పెంచాలంటే, ప్రతి ఒక్కరు ఓటు వేయడానికి ఆసక్తి చూపాలంటే, ఓటరు ఆత్మాభిమానం దెబ్బ తీయకుండా ఉండాలంటే,  "పార్టీ పిరాయింపుల నివారణ చట్టాన్ని" మరియు " అవినీతికి పాల్పడే, హామీలను అమలు చేయని అభ్యర్థుల కాల్ బ్యాక్ చట్టాన్ని" తీసుకుని రావాలి.

Monday, December 4, 2023

పార్టీ పిరాయింపుల చట్టాన్ని తీసుకుని రావాలి

భారతీయులమైన మనం స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవించాలని నాటి స్వాతంత్ర సమరయోధులు ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు, రాణీ రుద్రమదేవి, గాంధీజీ, నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్ధార్ వల్లభాయ్ పటేల్ , డా.బాబా సాహెబ్ అంబేద్కర్, భగత్ సింగ్ మరెందరో త్యాగాల ద్వారా, బ్రిటిష్ లేను తరిమి కొట్టి , స్వాతంత్ర్యం సాధించి సుమారుగా ఏడు దశాబ్దాలు గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు అయిపోయింది. ప్రజాస్వామ్యంగా ప్రజలు జీవించాలని రాజ్యాంగాన్ని రచించిన డా. అంబేడ్కర్ గారు , 18 యేండ్లు నిండిన ప్రతి ఒక్కరికి  వారికి ఓటు హక్కును కల్పించారు. పూర్వ కాలంలో  ఈ ఓటు  హక్కు కేవలం  ధనవంతులకు , విద్యావంతులకే   ఉండేది .  కానీ, ఈ రోజు అప్రజాస్వామికంగా ఎన్నికలు జరుగుచున్నవి. పలుగు ఉన్న వారిదే బర్రె అన్నట్లు, బుజ బలం , కండ బలం ఉన్న వారిదే, ధనం ఉన్న వారిదే గెలుపు,వారసులదే అధికారం అన్నట్లుగా ఉంది. రాజకీయాల్లోకి యువత ధైర్యంగా రావాలి. కానీ , రాజకీయ వ్యాపారం చేయడానికి చేయకూడదు. ఎన్నికల విధానంలో అనేక లోపాలు ఉన్నాయి. ఎన్నికల వ్యవస్థలో లోపాలు గురించి నేను " ఎన్నికల సంస్కరణల దిక్సూచి" అనే పుస్తకాన్ని రచించాను. ఆసక్తి గలవారు స్టడీ చేయ గలరు. నా బ్లాగ్ #www. sollutions2all.blogspot.com ను చూడ గలరు. ఎన్నికల సంస్కరణలు చేయకుండా, వెయ్యేండ్లు ఎన్నికలు జరిగినా, లక్షల కోట్లు వృధానే తప్పా ప్రయోజనం ఉండదు. నేటికీ రాష్ట్రాలలో, దేశంలో , పేదరికం తగ్గక పోవడం , అవినీతి పెచ్చు పెరగడం, నియంతృత్వ పాలనలు, ప్రశ్నించే స్వేచ్ఛ లేక పోవడం, దేశ సంపదను సమానంగా అనుభవించనివ్వక పోవడం , ఉపాధి కల్పన వికేంద్రీకరించక పోవడం , నిరుద్యోగుల సంఖ్య పెరగడం, పేద తనం తగ్గక పోవడం, గ్రామాల ప్రజలు కొందరు త్రాగుడుకు బానీసలవడం కారణంగా, నేటికీ ప్రజలు , చకోర పక్షుల్లా, ఉచితాల కొరకు, ఉచిత పథకాల కొరకు ఎదురు చూస్తున్నారు. ఓటర్లకు డబ్బు ఆశ, మధ్యం ఆశ, బిర్యాని ఆశ చూపుతూ, అభ్యర్ధులు ఓటర్లను కొంటున్నారు. ఇది జగమెరిగిన సత్యం. ఎక్కడా నియంత్రణ లేదు. ఎన్నికల సమయంలో పట్టుబడ్డ డబ్బును, ఆయా గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయాలి. నేడు అలాకూడా చేయడం లేదు. గత ఏడు దశాబ్దాల నుండి అనేక మార్లు ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఓటర్లే ఓడి పోతున్నారు తప్పా అభివృద్ధి చెందడం లేదు. పైగా ఉచితాలకు అలవాటుపడి సోమరులు అవుతున్నారు, బానీసలుగా మారిపోతున్నారు. 
అందుకు ముఖ్యమైన కారణాలను పరిశీలిస్తే, 
 01. భారతీయులై యుండి, 25 సం.రాలు నిండి, మానసికంగా బాగా ఉంటే చాలు, పోటీ చేయడానికి అవకాశం ఉండటం 

 02. విద్య లేక పోయినా, ఎన్ని కేసులు ఉన్నా, ఎంతటి అవినీతికి పాల్పడినా , పోటీ చేయడానికి అర్హత కలిగి ఉండటం 

03. వారసత్వాలకే అధిక అవకాశాలు ఉండటం 

04. చనిపోయిన అభ్యర్థుల వారసులకు, అర్హత లేక పోయినా పోటీ చేయడానికి అవకాశాలు కల్పించడం 
 
05. ఎన్నికలలో చేసే ఖర్చుపై నియంత్రణ లేకపోవడం , ఇలా మరెన్నో.. 

06. యువతీ యువకులు రాజకీయాల్లోకి రావడానికి ప్రోత్సాహం లేక పోవడం 

07. డెబ్భై యేండ్లు నిండిన వృద్ధులు కూడా , రాజకీయాల్లో పోటీ చేయడానికి అవకాశాలు ఉండటం

ఇప్పుడు ప్రజలు ముఖ్యంగా కోరుకునేది, పార్టీలు ఏవైనా కానీ, అవి కాంగ్రెస్, బిఎస్పీ, బిజేపి,ఎం.ఐ.ఎమ్ , బి.ఎస్.పి. మరియు ఇతర పార్టీలు ఏవైనా కావచ్చు. ప్రజాస్వామ్య దేశంలో, ప్రజలే గెలవాలంటే, ప్రజాభిప్రాయాలను , ప్రజల ఆశయాలను వమ్ము చేయకుండా ఉండాలంటే, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే, తక్షణమే ఈ చర్యలు చేపట్టాలి. 

 01. అభ్యర్థుల "పిరాయింపుల నివారణ " చట్టాన్ని తీసుకుని రావాలి 

 02. ప్రజాభిప్రాయాలకు వ్యతిరేకంగా, ప్రజల విశ్వాసాలకు వ్యతిరేకంగా పాల్పడే అభ్యర్థులను " కాల్ బ్యాక్ " చేసే చట్టాన్ని తీసుకుని రావాలి. 
 
03. అప్పటి వరకు గెలిచిన ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, ఎంపీలు , ఓటర్ల అభిప్రాయాలను, ఆకాంక్షలను, ఆశలను వమ్ము చేయకుండా, నైతిక భాద్యత వహించి, ఇతర పార్టీల లోకి పిరాయించకుండా ఉండాలి. ఒక వేళ ఇతర పార్టీల లోకి వెళ్ళాలనుకుంటే, గెలిచిన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి, ఓటర్ల అభిప్రాయాలకు , ఓటు వేయడానికి విలువైన సమయం వెచ్చించి నందుకు, నష్ట పరిహారం కట్టించి, వేరే పార్టీలోకి వెళ్ళాలి. ఇది స్వతంత్ర అభ్యర్ధులకు కూడా వర్తిస్తుంది. 

 04. ఓటర్ల ఓటు హక్కును దుర్వినియోగ పరిచే విధంగా, అగౌరవ పరిచే విధంగా, ఓటర్ల నమ్మకాన్ని చెదరగొట్టే విధంగా, ఓటర్లు 3 గంటలు క్యూలైన్లలో నిలబడి, ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యే లపై అనర్హత వేటు వేయకుండా, అబ్సల్యూట్ పవర్స్ ను స్పీకర్లకు తొలగించాలి. 

 05. పార్టీ పిరాయించడానికి , మా ప్రాంతాల అభివృద్ధి కొరకు అని సాకు చూపెడుతున్నారు. కాబట్టి, ఏ ప్రభుత్వం వచ్చినా అభివృద్ధికి నోచుకోని అన్ని గ్రామాలను, మండలాలను, జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయాలి. ఎన్నికల వరకే పార్టీలు, అభ్యర్థులు మరియు ఓటర్లు. ఆ తరువాత అందరూ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలే అని భావించాలి. 
 
06. ఇతర పార్టీల లోకి వెళ్ళే ఎమ్మెల్యేలను , ఎంపీలను, ఆయా నేతల గెలుపు కొరకు కష్ట పడిన కార్యకర్తలు, ఓట్లు వేసిన ఓటర్లు సామదాన భేదోపాయాలతో పార్టీ పిరాయించకుండా చూడాలి. 
 
07. బిల్లులు పాస్ చేసే సమయాలలో, అవి ప్రజోపయోగకరమైనవి అయినట్లయితే, బయట నుండి సపోర్ట్ చేయవచ్చు. 

 08. ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను, అవినీతిని, మోసాలను, భూకబ్జాలను ప్రశ్నించడానికి, వ్యక్తులుగా కాకుండా, "ప్రజా మేధావుల సంఘాలను" ఏర్పాటు చేయాలి.అలానే పిరాయించే నేతలను వీరు గట్టిగా అడ్డుకోవాలి

Friday, December 1, 2023

బర్రెలక్క కొరకు దేశ విదేశాల మేధావుల స్పందనకు కారణాలేమిటి?

బర్రెలక్క/ Barrelakka దేశ విదేశాలలోని మానవతా వాదులు, మేధావులు , లాయర్లు, నెటిజన్లు బర్రెలక్క (శిరీష) లో ఏమి చూసి, ఎందుకు ఇంత భారీగా స్పందిస్తున్నారనేది , ఒక సారి పరిశీలిస్తే, ఆమే కులం చూసి కాదు. ఆమే మతం చూసి కాదు. ఆమే ఆడ పిల్ల అని కాదు. ఆమే పేద రాలు , డబ్బు లేదు ఇల్లు లేదు అని కాదు. ఆమే చిన్న వయసు అని కాదు. ఆమే చదువు కున్నదని కాదు. ఆమెకు ఉద్యోగం రాలేదని కాదు.ఇవన్నీ చివరి అంశాలు. బర్రెలక్క లో నెటిజన్లు, మానవతా వాదులు, మేధావులు చూసి స్పందిస్తున్నది ముఖ్యంగా; 01. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా, దేశంలో నియంతృత్వ పాలనలు, పేదరికం పోకపోవడం. సమానత్వం లేక పోవడం. రాజ్యాంగం, చట్టాలు బలంగా ఉన్నా అవి అమలు కాక పోవడం మొదటి దైతే. 02. బర్రెలక్క ఒక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం 03. బర్రెలక్క లో ధైర్యం, పట్టుదల 04. బర్రెలక్క లో పోరాట పటిమ ఉండటం 05. బర్రెలక్కలో సాధించే శక్తి ఉందని గ్రహించడం 06. బర్రెలక్క లో చురుకు తనం,కలుపుగోలుతనం 07. బర్రెలక్క లో ముక్కుసూటి తనం ,చతురత 08. బర్రెలక్క ప్రతి ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పే మేధా శక్తి ఉండటం. అది కూడా ఒక పేపర్ లేకుండా, ఎవరి సలహాలు, సూచనలు లేకుండా 09. బర్రెలక్క లో అనంతమైన ఏదో ఒక ''సిక్స్ సెన్స్" ఉందని,పేద ప్రజలకు ప్రతినిధి అవుతుందని గ్రహించడం 10. బర్రెలక్కకు దేశం, రాష్ట్రాల ప్రజా సమస్యలపై ప్రాధమిక అవగాహన ఉండటం 11. బర్రెలక్క మాటలలో అబద్దాలు, తడబాటు తనం లేక పోవడం 12. బర్రెలక్క లో కించిత్తు గర్వం కనిపించక పోవడం 13. బర్రెలక్క లో అమాయకత్వం ఉండటం 14. బర్రెలక్క లో ఇతర నిరుద్యోగుల, పేదల సమస్యలు తీర్చాలనే మానవతా దృక్పథం ఉండడం. 15. వ్యవ‌స్థల లోపాలను ఎత్తి చూపాలనే తపన కలిగి ఉండటం. 16. ఇలాగ నిర్భయంగా ఎదిరించే, మాట్లాడే యువతీ యువకులు రాజకీయాల్లోకి రావాలని మేధావులు కోరుకోవడం ఆ తర్వాత నే మొదట "కాదు" అని చెప్పిన అంశాలు వచ్చి చేరినాయి ఈ అంశాలే నెటిజన్లను, మానవతా వాదులను, మేధావులను ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి లక్షణాలు/ అంశాలు ఎవరిలో ఉన్నను మానవతా వాదులు, మేధావులు, ప్రజాస్వామ్య వాదులు, నెటిజన్లు తప్పకుండా స్పందిస్తారు ఇలాంటి యువతీ యువకులను ప్రోత్సహించాల్సిన భాద్యత మనందరిపైనా ఉంది. దేశ సంపదను వికేంద్రీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.