అంశం: సాహిత్యంలో రాజకీయం
శీర్శిక: యధారాజా తధాప్రజా
పగలంతా బగ బగ మండే కిరణాలతో
వెలుగులు చిమ్మే భాస్కరుడు
నిశిలో వెన్నెల రాణి చంద్రమతి
కోట్లాది తారలు, పంచ భూతాలు
నిత్యం డేగ కళ్ళతో వీక్షిస్తున్నా!
చావడులు ఎన్ని ఉన్నా
చట్టాలు ఎన్ని ఉన్నా
సి.సి. కెమరాలు ఎన్ని ఉన్నా
సి.బి.ఐ.లు ఎన్ని ఉన్నా
జీతాలను పెంచుకుంటూ
ఐదేళ్ళ సేవకే పెన్సన్లను తీసుకుంటూ
నటన చేస్తుండే స్వార్ధ నేతలు
విశ్వమంతా వ్యాపించే అవినీతిపరులు!
దీపముండగానే ఇల్లుచక్కబెట్టుకున్నచందాన
అధికారం చేపట్టి అందలమెక్కను
దేశ సంపదలను దోచుకునను
అమృత్ మహోత్సవ్ జరుపుకున్నా
రిజర్వేషన్లను కదిలించరైరి!
ఓటుబ్యాంక్ ను పదిలపరచుకుంటూ
కొత్త సీసాలో పాత బీరులా
ఏలు తుండిరి దేశాన్ని యధేచ్ఛగా
యధా రాజా తధా ప్రజ అన్నట్లు
సాగుతుండే లోకం
చావకుండ బ్రతుక కుండ
గడుస్తుండే పేదల కటిక జీవితం!
ఇక రాజకీయాలు సాహిత్యం లోకి ప్రవేశిస్తే
అవినీతికి చట్టబద్ధత ఏర్పడుతుంది
అది మూడు పువ్వులు ఆరు కాయలుగా
పరిఢవిల్లుతుంది.
కవులకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు కరువవు
దేశం నేతల ఆగడాలకు నెలవవు!