సాహితీ వీణా కుసుమాలు:
తేది: 20.08.2023
అంశం: ఐచ్ఛికం
శీర్షిక: *నాగుల పంచమి*
ప్రక్రియ: వచన కవిత
పవిత్ర 'శ్రావణ మాస' శుక్ల పంచమిని
జనులు కొలిచెదరు గరుడపంచమని
భవిష్యత్ పురాణంలో నుండెనొక గాథయే
అది చదివినను , విన్నను గొప్ప పుణ్యమే!
కశ్యప రాజుకు నుండిరి నిరువురు భార్యలు
ఆ ఇరువురు మహారాణులే కద్రువ వినతలు
సంతానం లేక గడిచే నెన్నో కాలములు
కశ్యపుడు పుత్రకామేష్ఠి యాగములు
చేయ, కలిగిరి సంతానం కద్రువకు నాగులు
మహారాణి వినతకు కలిగే గరుడులు!
కద్రువ, ధవళ అశ్వ మోసపూరిత పందెమున
చేసే వినితను , కుద్రువకు దాసి గాను
గరుడు నదియు భరించ లేక విముక్తి కోరే
అంతట పెద్దతల్లి , నాగుళ్ళు షరతు విధించే
దేవలోకం నుండి అమృతమును కొనిరమ్మనే!
గరుడు సమ్మతించి , స్వర్గం పయణించే
దేవలోకము నుండి అమృతం తెచ్చే
తల్లికి గరుడు దాస్య విముక్తిని గావించే
అట్టి శ్రావణ శుక్లపంచమిరోజే ,గరుడపంచమి!
గరుడ పంచమి రోజుయే , నాగుల పంచమి
ఈ రోజు వనితలు స్నాన మాచరించి
పాలు గ్రుడ్డు నైవేధ్యాలు , ధూప దీపాలతో
పుట్టలకు , నైవేధ్యాలు జరిపించి మ్రొక్కేరు
నాగ దోషాలు బాపమని,సంతానం కల్గాలని
ముత్తైదవుగా నిలుపమని, శుభాలు కల్గాలని!
ఓం తాక్ష్యాయ నమః!
ఓం గరుడాయ నమః
ఓం వైన తేజాయ నమః!
ఓం ఖగాయ నమః
ఓం ఖగేశ్వరాయ నమః!
అని పఠించిన చాలు తొలుగు నాగ దోషాలు
ప్రజలకు కలుగు నెన్నో శుభాలు
జనులెల్లరు పొందేరు సుఖాలు!