Monday, December 4, 2023

పార్టీ పిరాయింపుల చట్టాన్ని తీసుకుని రావాలి

భారతీయులమైన మనం స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవించాలని నాటి స్వాతంత్ర సమరయోధులు ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు, రాణీ రుద్రమదేవి, గాంధీజీ, నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్ధార్ వల్లభాయ్ పటేల్ , డా.బాబా సాహెబ్ అంబేద్కర్, భగత్ సింగ్ మరెందరో త్యాగాల ద్వారా, బ్రిటిష్ లేను తరిమి కొట్టి , స్వాతంత్ర్యం సాధించి సుమారుగా ఏడు దశాబ్దాలు గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు అయిపోయింది. ప్రజాస్వామ్యంగా ప్రజలు జీవించాలని రాజ్యాంగాన్ని రచించిన డా. అంబేడ్కర్ గారు , 18 యేండ్లు నిండిన ప్రతి ఒక్కరికి  వారికి ఓటు హక్కును కల్పించారు. పూర్వ కాలంలో  ఈ ఓటు  హక్కు కేవలం  ధనవంతులకు , విద్యావంతులకే   ఉండేది .  కానీ, ఈ రోజు అప్రజాస్వామికంగా ఎన్నికలు జరుగుచున్నవి. పలుగు ఉన్న వారిదే బర్రె అన్నట్లు, బుజ బలం , కండ బలం ఉన్న వారిదే, ధనం ఉన్న వారిదే గెలుపు,వారసులదే అధికారం అన్నట్లుగా ఉంది. రాజకీయాల్లోకి యువత ధైర్యంగా రావాలి. కానీ , రాజకీయ వ్యాపారం చేయడానికి చేయకూడదు. ఎన్నికల విధానంలో అనేక లోపాలు ఉన్నాయి. ఎన్నికల వ్యవస్థలో లోపాలు గురించి నేను " ఎన్నికల సంస్కరణల దిక్సూచి" అనే పుస్తకాన్ని రచించాను. ఆసక్తి గలవారు స్టడీ చేయ గలరు. నా బ్లాగ్ #www. sollutions2all.blogspot.com ను చూడ గలరు. ఎన్నికల సంస్కరణలు చేయకుండా, వెయ్యేండ్లు ఎన్నికలు జరిగినా, లక్షల కోట్లు వృధానే తప్పా ప్రయోజనం ఉండదు. నేటికీ రాష్ట్రాలలో, దేశంలో , పేదరికం తగ్గక పోవడం , అవినీతి పెచ్చు పెరగడం, నియంతృత్వ పాలనలు, ప్రశ్నించే స్వేచ్ఛ లేక పోవడం, దేశ సంపదను సమానంగా అనుభవించనివ్వక పోవడం , ఉపాధి కల్పన వికేంద్రీకరించక పోవడం , నిరుద్యోగుల సంఖ్య పెరగడం, పేద తనం తగ్గక పోవడం, గ్రామాల ప్రజలు కొందరు త్రాగుడుకు బానీసలవడం కారణంగా, నేటికీ ప్రజలు , చకోర పక్షుల్లా, ఉచితాల కొరకు, ఉచిత పథకాల కొరకు ఎదురు చూస్తున్నారు. ఓటర్లకు డబ్బు ఆశ, మధ్యం ఆశ, బిర్యాని ఆశ చూపుతూ, అభ్యర్ధులు ఓటర్లను కొంటున్నారు. ఇది జగమెరిగిన సత్యం. ఎక్కడా నియంత్రణ లేదు. ఎన్నికల సమయంలో పట్టుబడ్డ డబ్బును, ఆయా గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయాలి. నేడు అలాకూడా చేయడం లేదు. గత ఏడు దశాబ్దాల నుండి అనేక మార్లు ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఓటర్లే ఓడి పోతున్నారు తప్పా అభివృద్ధి చెందడం లేదు. పైగా ఉచితాలకు అలవాటుపడి సోమరులు అవుతున్నారు, బానీసలుగా మారిపోతున్నారు. 
అందుకు ముఖ్యమైన కారణాలను పరిశీలిస్తే, 
 01. భారతీయులై యుండి, 25 సం.రాలు నిండి, మానసికంగా బాగా ఉంటే చాలు, పోటీ చేయడానికి అవకాశం ఉండటం 

 02. విద్య లేక పోయినా, ఎన్ని కేసులు ఉన్నా, ఎంతటి అవినీతికి పాల్పడినా , పోటీ చేయడానికి అర్హత కలిగి ఉండటం 

03. వారసత్వాలకే అధిక అవకాశాలు ఉండటం 

04. చనిపోయిన అభ్యర్థుల వారసులకు, అర్హత లేక పోయినా పోటీ చేయడానికి అవకాశాలు కల్పించడం 
 
05. ఎన్నికలలో చేసే ఖర్చుపై నియంత్రణ లేకపోవడం , ఇలా మరెన్నో.. 

06. యువతీ యువకులు రాజకీయాల్లోకి రావడానికి ప్రోత్సాహం లేక పోవడం 

07. డెబ్భై యేండ్లు నిండిన వృద్ధులు కూడా , రాజకీయాల్లో పోటీ చేయడానికి అవకాశాలు ఉండటం

ఇప్పుడు ప్రజలు ముఖ్యంగా కోరుకునేది, పార్టీలు ఏవైనా కానీ, అవి కాంగ్రెస్, బిఎస్పీ, బిజేపి,ఎం.ఐ.ఎమ్ , బి.ఎస్.పి. మరియు ఇతర పార్టీలు ఏవైనా కావచ్చు. ప్రజాస్వామ్య దేశంలో, ప్రజలే గెలవాలంటే, ప్రజాభిప్రాయాలను , ప్రజల ఆశయాలను వమ్ము చేయకుండా ఉండాలంటే, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే, తక్షణమే ఈ చర్యలు చేపట్టాలి. 

 01. అభ్యర్థుల "పిరాయింపుల నివారణ " చట్టాన్ని తీసుకుని రావాలి 

 02. ప్రజాభిప్రాయాలకు వ్యతిరేకంగా, ప్రజల విశ్వాసాలకు వ్యతిరేకంగా పాల్పడే అభ్యర్థులను " కాల్ బ్యాక్ " చేసే చట్టాన్ని తీసుకుని రావాలి. 
 
03. అప్పటి వరకు గెలిచిన ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, ఎంపీలు , ఓటర్ల అభిప్రాయాలను, ఆకాంక్షలను, ఆశలను వమ్ము చేయకుండా, నైతిక భాద్యత వహించి, ఇతర పార్టీల లోకి పిరాయించకుండా ఉండాలి. ఒక వేళ ఇతర పార్టీల లోకి వెళ్ళాలనుకుంటే, గెలిచిన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి, ఓటర్ల అభిప్రాయాలకు , ఓటు వేయడానికి విలువైన సమయం వెచ్చించి నందుకు, నష్ట పరిహారం కట్టించి, వేరే పార్టీలోకి వెళ్ళాలి. ఇది స్వతంత్ర అభ్యర్ధులకు కూడా వర్తిస్తుంది. 

 04. ఓటర్ల ఓటు హక్కును దుర్వినియోగ పరిచే విధంగా, అగౌరవ పరిచే విధంగా, ఓటర్ల నమ్మకాన్ని చెదరగొట్టే విధంగా, ఓటర్లు 3 గంటలు క్యూలైన్లలో నిలబడి, ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యే లపై అనర్హత వేటు వేయకుండా, అబ్సల్యూట్ పవర్స్ ను స్పీకర్లకు తొలగించాలి. 

 05. పార్టీ పిరాయించడానికి , మా ప్రాంతాల అభివృద్ధి కొరకు అని సాకు చూపెడుతున్నారు. కాబట్టి, ఏ ప్రభుత్వం వచ్చినా అభివృద్ధికి నోచుకోని అన్ని గ్రామాలను, మండలాలను, జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయాలి. ఎన్నికల వరకే పార్టీలు, అభ్యర్థులు మరియు ఓటర్లు. ఆ తరువాత అందరూ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలే అని భావించాలి. 
 
06. ఇతర పార్టీల లోకి వెళ్ళే ఎమ్మెల్యేలను , ఎంపీలను, ఆయా నేతల గెలుపు కొరకు కష్ట పడిన కార్యకర్తలు, ఓట్లు వేసిన ఓటర్లు సామదాన భేదోపాయాలతో పార్టీ పిరాయించకుండా చూడాలి. 
 
07. బిల్లులు పాస్ చేసే సమయాలలో, అవి ప్రజోపయోగకరమైనవి అయినట్లయితే, బయట నుండి సపోర్ట్ చేయవచ్చు. 

 08. ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను, అవినీతిని, మోసాలను, భూకబ్జాలను ప్రశ్నించడానికి, వ్యక్తులుగా కాకుండా, "ప్రజా మేధావుల సంఘాలను" ఏర్పాటు చేయాలి.అలానే పిరాయించే నేతలను వీరు గట్టిగా అడ్డుకోవాలి

No comments: