ప్ర . "జాతస్య మరణం DEATH)  ధృవం "అంటే ఏమిటి ?
డబ్బు సంపాదించడంలో ఒక్కొక్కరిది ఒక్కో పంధా . ఒకరు తనకు తన కుటుంభ సభ్యుల జీవనం కొరకు కష్టపడి డబ్బు సంపాదిస్తే , అదే అవసరానికి మరికొందరు దొంగతనాన్ని వృత్తిగా ఎంచుకుంటారు . ఒకరు భవిష్యత్ అవసరాల కొరకు నిజాయితీగా సంపాదిస్తే , మరొకరు తరతరాల వారసుల అవసరాలకొరకు మోసాలు చేసి , కుంభ కోణాలు చేసి , డబ్బు సంపాదించి నల్ల ధనంగా స్విస్ బ్యాంకులలో దాచి పెడుతుంటారు . విదేశాలలో దాక్కుంటారు . కష్ట పడండి . నిజాయితీగా సంపాదించండి . ప్లాన్డ్ గా మదుపు చేయండి . అనుకోకుండా వచ్చే ఖర్చులకు , ఆరోగ్య ఖర్చులకు , వృద్ధా ప్య జీవనం గడవడానికి పొదుపు చేయండి . కాని మోసాలు చేసి నల్ల ధనం కూడ పెట్టకండి . ఏమి సంపాదించినా , ఎంత కూడా బెట్టినా పోయే టప్పుడు ఏమి వెంట తీసుక పోము అని గుర్తుంచుకోవడం వలన ఎక్కడా మోసాలు జరుగవు . ఎక్కడా అవినీతి జరుగదు . ఎక్కడా కొట్టుకోవడం , తిట్టుకోవడం జరుగదు . ఎక్కడా కుంభ కోణాలు జరుగవు . ఎక్కడా యుద్దాలు జరుగవు . అలానే మనిషికి త్రుప్తి సుఖం , ఆనందం దక్కు తుంది . సర్వే నిజాయితీ జన : సుఖినో భవంతు .
జ . "జాతస్య మరణం  ధృవం" అనగా  "పుట్టిన  ప్రతి  జీవి చావక మానదు" అని దీని అర్ధం . " పుట్టిన  ప్రతి  ఒక్కరు  చావక మానరు "  అని దీని అర్ధం . ఇది  సత్యం . మనిషి   పుట్టే  టపుడు  నూలు పోగు లేకుండా , తల్లి  పేగును  కోసుకుని  ఏడ్చు కుంటూనే   భూమి మీదికి  వస్తాడు   లేదా  వస్తుంది . కాని మరే ఇతర ఆస్తులను , సంపదను  వెంట తీసుకుని రారు . అలానే  మనిషి  చని పోయే టప్పుడు కూడా  కనీసం  పార్ధీవ  శరీరం పై  ఉన్న తెల్లటి బట్టను కూడా  తీసుకుని పోకుండా ,  ఆత్మీయుల  భందాన్ని  తెంపుకుని ఏదో ఒక రోజు  మల్లీ ఏడ్చుకుంటూనో  లేదా  ఏదో రకమైన భాధతోనో  మరని స్తాడు లేదా మరనిస్తుంది . కాలి బూడిదై  పోతాడు లేదా పోతుంది .  కాని  తమ   వెంట  యే   భూములను , యే  డబ్బులను , యే  ఆస్తులను , యే  నల్లదనాన్ని  తీసుకుని పోరు . అంటే  కష్ట పడో  , మోసాలు  చేసో  సంపాదించిన వన్నీ, ఇక్కడే ,  అంటే  భూమి మీదనే వదిలి పెట్టి పోతారు .   ఇంతటి  నగ్న సత్యం తెలిసి కూడా  మనుష్యులు దేనికోసమో ఆరాట పడుతుంటారు . దేని కోసమో  ఇతరులను  నిందిస్తుంటారు , దేని కోసమో ఇతరులను  కించ పరుస్తుంటారు .దేని కోసమో చిన్న చూపు చూస్తుంటారు  .  దేని కోసమో  కొట్లాటలు పెట్టు  కుంటారు . దేని కోసమో  పోట్లాడు తుంటారు . దేని కోసమో  పోరాడుతుంటారు . దేని కోసమో  హైరానా  పడుతుంటారు .  ఎందు కోసమో  మోసాలు చేస్తుంటారు . మరి దేనికోసమో  స్విస్ బ్యాంకులలో లేదా ఇతర బ్యాంకులలో లేదా బినామి పేర్లతో  నల్ల ధనంగా  దాచి పెడుతుంటారు.  హత్యలు చేస్తారు . ఆత్మ హత్యలు  చేసు కుంటారు .
అలానే , ప్రతి జీవికి  జీవిత కాలంలో  4  దశలు ఉంటాయని  మనకు తెలుసు  . అవి , బాల్యం , కౌమార్యం , యవ్వనం  మరియు వృద్ధాప్యం . మనిషికి బాల్యంలో ఉన్నపుడు ఏమి తెలియదనే చెప్పాలి .  కౌమార్యం లో  విద్యా , ఆటలు పాటల తోనే  కాలం గడిచి పోతుంది . ఇక మిగిలింది  యవ్వనం , వ్రుదాప్యం . యవ్వనం లోనే మనిషికి అహం అధికంగా ఉంటుంది . నాకే ఇన్ని ఆస్తులున్నాయనో , నేనే అధికంగా చదివాననో , నేనే పెద్ద హోదాలో ఉన్నాననో , నేనే అధికారంలో  ఉన్నాననో  గర్వం , పొగరు ఉంటుంది . నా అంతటి వారే లేరని  విర్ర వీగు తుంటారు . కసురుకుంటారు . గొడవ పెట్టుకుంటారు . ఎదుటి వారిని  హీనంగా చూస్తారు . ఎదుటి వారిని లెక్క చేయరు .  అయితే  ఎలా  సంపద వారికి  వచ్చింది , ఎలా మోసం చేస్తే   వచ్చింది . యే  ప్రభుత్వ  దయా దాక్షన్యాల వలన వచ్చింది . యే రిజర్వేషన్ల  అవకాశాల ద్వారా వచ్చింది  గుర్తు చేసుకోరు .  అంతే కాకుండా , వారే  ఏదో ఒక రోజు  వృద్ధాప్య దశకు  వస్తామన్న విషయం మరిచి పోతారు . లేదా వారే ఏదో ఒక రోజు అనారోగ్యం పాలు కావచ్చని  గాని , ప్రమాదాలకు గురి కావచ్చని గాని  గుర్తుకు రాదు .  ఒక్కో సారి  యే  అస్స్తులున్నా , ఎంత డబ్బు ఉన్నా  పనికి రాదనీ గ్రహించరు . మనిషి కి  కావాల్సింది  తోటి  వారి  ప్రేమ , ఆప్యాయత , కరుణ అని  గుర్తించరు . 
డబ్బు సంపాదించడంలో ఒక్కొక్కరిది ఒక్కో పంధా . ఒకరు తనకు తన కుటుంభ సభ్యుల జీవనం కొరకు కష్టపడి డబ్బు సంపాదిస్తే , అదే అవసరానికి మరికొందరు దొంగతనాన్ని వృత్తిగా ఎంచుకుంటారు . ఒకరు భవిష్యత్ అవసరాల కొరకు నిజాయితీగా సంపాదిస్తే , మరొకరు తరతరాల వారసుల అవసరాలకొరకు మోసాలు చేసి , కుంభ కోణాలు చేసి , డబ్బు సంపాదించి నల్ల ధనంగా స్విస్ బ్యాంకులలో దాచి పెడుతుంటారు . విదేశాలలో దాక్కుంటారు . కష్ట పడండి . నిజాయితీగా సంపాదించండి . ప్లాన్డ్ గా మదుపు చేయండి . అనుకోకుండా వచ్చే ఖర్చులకు , ఆరోగ్య ఖర్చులకు , వృద్ధా ప్య జీవనం గడవడానికి పొదుపు చేయండి . కాని మోసాలు చేసి నల్ల ధనం కూడ పెట్టకండి . ఏమి సంపాదించినా , ఎంత కూడా బెట్టినా పోయే టప్పుడు ఏమి వెంట తీసుక పోము అని గుర్తుంచుకోవడం వలన ఎక్కడా మోసాలు జరుగవు . ఎక్కడా అవినీతి జరుగదు . ఎక్కడా కొట్టుకోవడం , తిట్టుకోవడం జరుగదు . ఎక్కడా కుంభ కోణాలు జరుగవు . ఎక్కడా యుద్దాలు జరుగవు . అలానే మనిషికి త్రుప్తి సుఖం , ఆనందం దక్కు తుంది . సర్వే నిజాయితీ జన : సుఖినో భవంతు .
No comments:
Post a Comment