ప్ర; కొడుకులు బిడ్డలు (PARENTS THOSE WHO DO NOT HAVE  SONS AND DAUGHTERS) లేని తల్లి దండ్రులు , కొడుకులు బిడ్డలు, మనుమలు,  మనుమరాండ్లు  ఉండి  కూడా  ప్రేమలకు, ఆప్యాయతలకు , ఆధరణకు  నోచుకోని తల్లి దండ్రులు , వృద్ధాప్య దశను  గుర్తుకు తెచ్చుకొని  దిగులు పడాల్సిందేనా?
జ :  "మాతృ దేవో  భవ" 
"పితృ దేవో భవ "
"ఆచార్య దేవో భవ " అన్నారు పెద్దలు .
కొడుకులు బిడ్డలు (PARENTS THOSE WHO DO NOT HAVE SONS AND DAUGHTERS) లేని తల్లి దండ్రులు , కొడుకులు బిడ్డలు, మనుమలు, మనుమరాండ్లు ఉండి కూడా ప్రేమలకు, ఆప్యాయతలకు , ఆధరణకు నోచుకోని తల్లి దండ్రులు , వృద్ధాప్య దశను గుర్తుకు తెచ్చుకొని ఎంత మాత్రం దిగులు పడ నవసరం లేదు . చింతించ నవసరం లేదు . బాధ పడనవసరం లేదు . కొడుకులు బిడ్డలు లేని వారు , కొడుకులు బిడ్డలు, మనుమలు, మనుమరాండ్లు ఉండి కూడా ప్రేమలకు, ఆప్యాయతలకు , ఆధరణకు , నోచుకోని తల్లి దండ్రులు , వృద్ధాప్య దశను గుర్తుకు తెచ్చుకొని ఎంత మాత్రం దిగులు పడ నవసరం లేదు . దానికో చక్కని ఉపాయం / పరిష్కారం ఉంది .
"పితృ దేవో భవ "
"ఆచార్య దేవో భవ " అన్నారు పెద్దలు .
కొడుకులు బిడ్డలు (PARENTS THOSE WHO DO NOT HAVE SONS AND DAUGHTERS) లేని తల్లి దండ్రులు , కొడుకులు బిడ్డలు, మనుమలు, మనుమరాండ్లు ఉండి కూడా ప్రేమలకు, ఆప్యాయతలకు , ఆధరణకు నోచుకోని తల్లి దండ్రులు , వృద్ధాప్య దశను గుర్తుకు తెచ్చుకొని ఎంత మాత్రం దిగులు పడ నవసరం లేదు . చింతించ నవసరం లేదు . బాధ పడనవసరం లేదు . కొడుకులు బిడ్డలు లేని వారు , కొడుకులు బిడ్డలు, మనుమలు, మనుమరాండ్లు ఉండి కూడా ప్రేమలకు, ఆప్యాయతలకు , ఆధరణకు , నోచుకోని తల్లి దండ్రులు , వృద్ధాప్య దశను గుర్తుకు తెచ్చుకొని ఎంత మాత్రం దిగులు పడ నవసరం లేదు . దానికో చక్కని ఉపాయం / పరిష్కారం ఉంది .
పూర్వ కాలంలో దేశంలో  జనాభా తక్కువగా  ఉండేది . ఉన్న  జనాభాలో  అన్నీ  పెద్ద కుటుంభాలు  , ఉమ్మడి  కుటుంభాలే  ఉండేవి . అప్పుడు  సంతానానికి  పరిమితి అంటూ ఉండేది కాదు . ఏ కుటుంభంలో చూసినా  5 నుండి  15 వరకు  ఉండే వారు . ఆ కాలంలో పెద్దగా  హాస్పిటల్స్  లేక పోయినా  సంతాన శక్తి  అలా ఉండేది . ఇక  ఏ  సమస్య వచ్చినా ఆ ఇంటి పెద్దే పరిష్కరించే  వా డు . ఏ  ఖర్చు వచ్చినా  ఆ పెద్దే చోసుకునే వాడు . ఆ పెద్ద మనిషి మాటే వేదం .  ఏ ఫంక్షన్  జరిగినా , ఒక్కరు కూడా  మిస్ అయ్యే వారు కాదు . సంపాదించే వారు అనేకం . ఖర్చు  పెట్టేది మాత్రం  ఒక్కరి ద్వారానే జరిగేది . చిన్నా పెద్దా ఎవ్వరికీ ఏ చిన్న బాధ లేకుండా  కడుపులో  పెట్టుకుని  చూసుకునే వారు . ఇక వారి మధ్య ప్రేమలు , ఆప్యాయతలు , అనురాగాలు , సంస్కృతి , సాంప్రదాయాలు వెల్లి  విరిసేవి. అందరూ కడుపు నిండా  బుజిస్తూ , ఆటా పాటలతో  సంతోషంగా , ఆనందంగా  కాలం గడిపే వారు . 
కానీ  రానూ  రానూ  కాలం మారి పోయింది  .  జనాభా  అడ్డు అదుపూ  లేకుండా పెరిగి పోయింది . అవసరాలు పెరిగి పోయాయి . విద్యా  వంతులు  పెరిగి  పోతున్నారు . సైన్స్ & టెక్నాలజీ  పెరిగి పోయింది . స్వార్ధం పెరిగి పోయింది . మనుష్యులకు ఇగో పెరిగి పోయింది .  ఒంటరిగా జీవించాలనే  ఆలోచన  పెరిగి పోయింది . ఉపాధి అవకాశాలు పెరిగి పోయాయి . సంపాదన పెరిగి పోయింది . దేశ  విదేశాలకెళ్లి  సంపాదించే , జీవించే అవకాశాలు  మెరుగయ్యాయి . స్వతహాగా  కూడా బెట్టుకోవాలి , ఇతరులకంటే ఉన్నతంగా ఎదుగాలి , పిల్లలని అధికంగా చదివించాలి , విలాస వంతంగా   జీవించాలి , ఒంటరిగా  స్వేచ్ఛగా జీవించాలనే  భావన పెరిగి పోయింది .  అదే  విధంగా  సమస్యలూ   కూడా  పెరిగాయి . పెద్దల యెడ భాద్యత  తగ్గి పోసాగింది. ముసలి వారంటే భారంగా ఫీలవ్వ సాగారు .   ఆ కారణంగా  ఉమ్మడి  కుటుంభాలు , పెద్ద కుటుంభాలు కనుమరుగయి , చిన్న కుటుంభాలు  సంతరించుకున్నాయి . అలానే  ఒకరిద్దరికే సంతానాన్ని  పరిమితం చేసుకుంటున్నారు . అయినను  నేడు  కనీసం  40 కోట్ల జనాభా పేద తనంలోనే జీవిస్తున్నారనేది కఠోర సత్యం .  
ఇంత వరకూ  బాగానే ఉందను కున్నా , ఇప్పుడు మరో సమస్య  సమాజానికి  పెను ముప్పుగా తయారు  కాబోతుంది  . ఏ కుటుంభం లో చూసినా ,  అది  చాప క్రింద నీరులా తయా రవుతుంది . " కర్ణుడి చావుకు  శతకోటి కారణాలు అన్నట్లు " దీనికి కారణాలు అనేకం . గ్లోబలైజేషన్ కావచ్చు , పాశ్చాత్త్యా  పోకడలు కావచ్చు ,   మరింత  సైన్స్   & టెక్నాలిజీ పెరుగడం  కావచ్చు , స్వార్ధం పెరుగడం కావచ్చు , మనుష్యులలో  ఇగో పెరుగడం  కావచ్చు . అనారోగ్యాలు  కారణం  కావచ్చు , సామాజిక  మీడియాలు  కావచ్చు , టీవీ లు కావచ్చు , ఇంటర్ నెట్ కావచ్చు , అధికంగా విద్యావంతులు కావడం కావచ్చు , ఇతరులు అక్రమంగా , మోస పూరితంగా , అధికంగా  సంపాదించి , విచ్చలవిడిగా ఖర్చు చేయడం   కావచ్చు , దేశ విదేశాలలో  విహరించడం కావచ్చు , వారిని  ప్రభుత్వాలు పెద్దగా  పట్టించు కోక  పోవడం కావచ్చు , స్వతహాగా  డబ్బు సంపాదించే  శక్తి కావచ్చు , నాలుగు డబ్బులు  చేతిలో  కనబడటం కావచ్చు , ఒకరిని చూసి మరొకరు అనుకరించడం కావచ్చు , పాలకులు  కొడుకుల కోడండ్ల , బిడ్డలా అల్లుండ్ల  భాద్యతలను  పెంచే చర్యలు  తీసుకోక పోవడం కావచ్చు , ప్రీ పేయిడ్ ' అనాధ ఆశ్రమాల ' వ్యాపార  మాయ కావచ్చు ,  స్వేచ్ఛగా , ఎవరి ఆజమాయిషీ  లేకుండా  జీవించాలనే  కోరికలు కావచ్చు , ప్రేమగా ఉంటే  పెద్దల భాద్యతలను  తీసుకోవాల్సి వస్తుందని కావచ్చు , లేదా తల్లి దండ్రులలో విభేదాలు కావచ్చు , వారిలో ఒకరి జీన్స్ కావచ్చు , లేదా తల్లి దండ్రుల  పెంపకం లో  లోపం  కావచ్చు , గ్రహ  బలాలు కావచ్చు , మరింకేదేమైనా కావచ్చు .  తరాలు  మారు తున్నపుడు , కాలాలు  మారు తున్నపుడు ఇది  కూడా  కొంత వరకు సహజమే . ఇది  పారు తున్న  సెల యేరు లాంటిది . భూకంపం  లాంటిది . పెను తుఫాన్  లాంటిది .  అగ్ని గుండం లాంటిది . దీనిని  ఎవ్వరూ  ఆపలేరు .  నేటి  మెజారిటీ యువతీ యువకుల  మాటలు , పద్ధతులు , విధానాలు , తల్లి దండ్రుల  యెడ భావన చూస్తుంటే  అలానే అని పిస్తుంది . 
ఈ కారణంగా ఆ చిన్న కుటుంబాలు కూడా పోయి , కేవలం భార్యా భర్తల వరకే పరిమితం కావాలని కోరుకుంటున్నారు . సంస్కృతికి , సాంప్రదాయాలకు పూజ్యం పెడుతున్నారు . నవ మాసాలు మోసి, కనీ పెంచి పెద్ద చేసి , విద్యా బుద్దులు చెప్పించి , కాళ్లరిగేలా తిరిగి , లక్షలు ఖర్చు పెట్టి , మంచి అల్లుండ్లను కోడండ్లను తెచ్చి వివాహాలు జరిపిస్తే , తల్లి దండ్రులన్నా , అత్తా మామలన్నా అసహించుకుంటున్నారు . రెక్కలు వచ్చిన పక్షుల్లా ఎగిరి పోతున్నారు . వారి మూలాలను మరిచి పోతున్నారు . ప్రతి చిన్న చిన్న విషయాలకు తప్పులు తీయడం , చిన్న బుచ్చుకోవడం , ఆవేశాలకు లోనుకావడం , తల్లి దండ్రులకు , అత్తా మామలకు దూరంగా జీవించాలనుకోవడం మొదలైనవి నేడు సర్వ సాధారణం అయి పోయినవి . వీటిని వారు గొప్పగా చెప్పుకుని సంతోషిస్తున్నారు . ఏమైనా అంటే కాలం మారింది , కాలానికి అనుగుణంగా మారాలి . పెద్దలు పాత చింత కాయ పచ్చడి లాంటి వారు అని ఉచిత సలహాలు ఇస్తున్నారు .
ఈ విధంగా అసహ్యించుకుని   తల్లి దండ్రులను,  కొడుకులు బిడ్డలు   దూరం పెట్టినా , పట్టించుకోక పోయినా  , ఘర్షణ పడినా  , చీదరించుకున్నా , పెద్దగా  బాధ పడనవసరం లేదు . వృద్ధాప్య  దశ  గురించి ఎంత మాత్రం చింతించ నవసరమూ  లేదు .  దీనికో చక్కని ఉపాయం ఉంది .  చక్కటి  పరిష్కార మార్గముంది . "మనసుంటే   మార్గముంటుంది" అన్నట్లు ,  సమస్య వచ్చినప్పుడు  అవసాన దశలో , వృద్దాప్య దశలో , చేత కాని  దశలో  బాధపడటం కంటే ,  ఆ సమయంలో పరిష్కారానికి ఆలోచించడం కంటే , ముందు  నుండే , ఓ పది  విత్తనాలను నాటడానికి  ఆసక్తి  చూపాలి .  అంటే  ఓ  పది మందిని , మీ స్వభావానికి సరిపోయేటువంటి వారిని,    మీరంటే అభి మానం , గౌరం  ఉన్నటు వంటి వారిని , నిజాయితీ గల ,  నమ్మకమైన , అనుకూలమైన  పేద మధ్య  తరగతి పిల్లలను చేర దీయడం  ప్రారంభించాలి .  వారికి  మీరు వయస్సులో ఉన్నపుడు , చేతనయినపుడు  , వారికి మీ చేతనైన  సేవను  సహాయ సహకారాలు  , ప్రేమతో నిజాయితీతో  అందించాలి . ఇది మీకు చేతనైన పనే .  దేశంలో  70 %  పేద  మధ్య తరగతి  ప్రజలే ఉన్నారు . అన్ని రకాల  సహాయ సహకారాలు అందుకోడానికి  కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు . మీ స్వభవానికి  సరి పడే వారు  వేలల్లో  ఎదిరి చూస్తున్నారు . అంతా  మీ ప్రేమ , నిజాయితీ లపైననే  ఆధార పది ఉంటుంది . ఆ పది మందిలో  మీ మనుమలు  మనుమరాండ్లు  ఉండ వచ్చు , పని మనుషులు  ఉండవచ్చు , ఇతరులు ఉండ వచ్చు . అది మీ ఇష్టం . ఇక  వారికి ప్రేమను అందించాలి . వారి చిన్న చిన్న అవసరాలకు  చేయూత నివ్వాలి . డబ్బు పెట్టడమే కాక పోవచ్చు . మాట సహాయం కావచ్చు . సలహా చెప్పడం కావచ్చు . ఆపదలో ఉన్నపుడు ఆదు  కోవడం కావచ్చు . చిన్న చిన్న కానుకలు ఇవ్వడం కావచ్చు . ఈ ప్రక్రియ నిరంతరం , కన్న బిడ్డలను చూసుకున్నట్లుగానే  ఉండాలి . జీవన శైలిలో ఇదొక భాగంగా మారాలి . ఆ విధంగా  చేయడం  వలన , మీ సహాయం  పొందిన  బయటి వ్యక్తులకు , మీపై  తప్పకుండా , గౌరవం , ప్రేమా, దయ , కరుణ , ఆప్యాయత , అభిమానం  ఉంటుంది . మిమ్మల్ని ఖచ్చితంగా  చేర దీస్తారు . అక్కున చేర్చు కుంటారు . మీ దగ్గర కొద్దో గొప్పో  డబ్బు ఉంటుంది . ఎందుకంటే  ముందు నుండే మీరు ప్లాన్ చేసుకున్నారు కాబట్టి . దానిని రోజు వారి ఖర్చులకు  ఉపయోగించు కోవచ్చు . అప్పుడు వారికి  పెద్దగా ఆర్ధిక భారం పడదు . 
మనం రోజూ పత్రికలలో , టీవీలలో చూస్తుంటాం . కొడుకులూ కోడండ్లు సరీగా చూడక పోవడం వలన ఉరిపెట్టుకున్నారని , ఆత్నహాత్యలు చేసుకున్నారని , తిరుపతి వెంకన్నకు ఆస్తులన్నీ వ్రాసిచ్చారనీ , కోట్లాది ఆస్తులుండి అనాధలయ్యారని , అడక్కు తింటున్నారని , దిక్కులేని చావు చచ్చారనీ వింటూ ఉంటాం . చూస్తూ ఉంటాం . ముందుగానే ఈ సోషల్ సర్వీస్ నిజాయితీగా , మనస్పూర్తిగా ప్రారంభిస్తే , పాజిటివ్ ధోరణితో నడుచుకుంటే నిండా నూరేళ్లు ఏ ఇబ్బందీ లేకుండా , ఎవ్వరితో చీవాట్లు పడకుండా , హాయిగా జీవించ వచ్చు . ఇక , ఆ పది విత్తనాలలో ఒకటి రెండూ గాలికి కొట్టుకు పోయినా , ఒకటి రెండింటిని పిట్టలు తిన్నా , ఒకటి రెండూ పుచ్ఛి పోయినా , చివరికి రెండు మూడయినా మిగులుతాయి . "కొడుకులు కోడండ్లు ,బిడ్డలు అల్లుండ్లు మిమ్ముల దూరం చేసిన రోజు , చీదరించుకున్న రోజు , అసహించుకున్న రోజు , బాధ పెట్టిన రోజు , మరింత వారికి దగ్గరై , మీ దగ్గర ఉన్న కొద్దీ పాటి నగదును , నగలను , ఆస్తులను , లేదా పెద్ద మొత్తం ఆస్తులను , మిమ్ములను ప్రాణానికి ప్రాణంగా చూసుకునే ఆ మిగిలిన వారందరికీ లేదా మీకు నచ్చిన ఒకరిద్దరికీ విడతల వారీగా వీ లు నామా రాసేసి లేదా రిజిస్టర్ చేయిస్తే , వృధ్యాప్య దశలో హాయిగా జీవించ వచ్చు" .తల్లి దండ్రులు స్వతహగ సంపాదించిన ఆస్తులు , వారి కొడుకులు బిడ్డలకు నైతిక హక్కే కానీ , చట్టబద్దమైన హక్కు అని ఎక్కడా లేదు . ఇది కేవలం తరాలుగా వస్తున్న ఆనవాయితీ మాత్రమే . బాధ్యతలు నెరవేరుస్తే , నైతిక హక్కుగా తల్లి దండ్రుల ఆస్తులను పొందవచ్చు . దీనికి గ్రామస్తులే పూనుకోవాలి. సమాజమే పూనుకోవాలి . ఒక మంచి ప్రయోజనం కొరకు చట్టాలు సహకరించాలి .
దీనికి , వృద్ధులకు కావాల్సింది ఒకటే . మనో ధైర్యం . సాహసం . పట్టుదల , పిల్లలు ఎంచుకున్న దారినే నడువగలిగే మొండితనం అలవర్చుకోవడం . ఎంత మాత్రం ఫీలవ్వక పోవడం అనేవి ముఖ్యం . మొదట ప్రారంభించిన వారికి కొంత ఇబ్బంది , మానసిక ఆంధోలన ఉండవచ్చు . కానీ రాను రాను అందరూ అదే బాటలో నడిస్తే , ఏ బాధ అనిపించదు . చట్టాలను కూడా వీటికి అనుగుణంగా మార్చాలి . నైతిక బాధ్యత వహించి , కొడుకులు బిడ్డలు కూడా స్వచ్చందంగా , తల్లి దండ్రులు సంపాదించుకున్న ఆస్తులను వదులు కోవాలి . లేదా వారిని ఎదో విధంగా , వారికి కష్టం బాధ కలుగ కుండా పోషించే బాధ్యతను తీసు కోవాలి .
అయితే దేశంలో కొడుకులు కోడండ్లు , బిడ్డలు అల్లుండ్లు మంచి వారు అసలే లేరు అని అనడం లేదు . తల్లి దండ్రులను మంచిగా పోషించే వారు ఉన్నారు , ప్రేమలను , ఆప్యాయతలను పంచే వారు ఉన్నారు . " ఒకే వరలో రెండు కత్తులు ఇమడవు " అన్నట్లు , ఒకే కుటుంభం లో ఆధి పత్య పోరుగల అత్తా కోడండ్లు , 'ఒక తరం 'వయస్సు తేడా గల అత్తా కోడండ్లు , విద్య , సంపాదనలో తేడా గల అత్తా కోడండ్లు , పాత సాంప్రదాయాలు గల అత్తలు , పాశ్చాత్త్యా పోకడలు గల కోడండ్లతో నివసించ లేరు , " స్త్రీ కి , స్త్రీయే శత్రువు " అనే నానుడి ఏనాడో పుట్టింది . ఎవరికో ఒకరికి లేదా ఇద్దరికీ సర్దుబాటు గుణం ఉంటే తప్పా . " రౌతు గుర్రాన్ని కొలను వరకు తీసుకుని రాగలడే గాని, నీటిని త్రాగించలేడు " అన్నట్లు , కొడుకుల పరిస్థితి అలానే ఉంది . బిడ్డల పరిస్థితి కూడా అలానే ఉంది . చాదస్తపు తల్లి దండ్రులు , అత్తా మామలు , 70, 80 యేండ్లు వచ్చినా మా మాటే అందరూ వినాలనే వారు , మేము చెప్పినట్లుగానే నడుచుకోవాలి అనే వారు లేక పోలేదు. చాదస్తం తోటి గిల్లి పంచాయితీలు పెట్టుకునే తల్లి దండ్రులు లేక పోలేదు . ఈ కారణంగానే ప్రతి కుటుంభంలో అనేక సమస్యలు ఉంటున్నాయి . ఇక ముందూ ఉంటాయి కూడా .
అయితే , మీరు ఇక్కడ ఒక సమస్యను లేవదీయ వచ్చు . డబ్బు , ఆస్తులున్న వారు సరే . మరి డబ్బు , ఆస్తులు లేని వృద్ధుల పరిస్థితి ఏమిటి ?
'ఎంత చెట్టుకి అంతే గాలి' అన్నట్లు , వారికి తగ్గట్టే సేవలు లభించ వచ్చు . అంత కంటే ఎక్కువగా , పెద్దగా వారు ఊహించరు , ఆశించరు కూడా . నిజానికి ఏ తల్లి తండ్రి పేదలు కారు. ఆర్ధికంగా పేదలు కావచ్చు . కానీ పిల్లలకు ప్రేమను పంచడంలో , పిల్లలను పోషించడంలో పేదలు కారు . ధన వంతులైన , పేదలైనా , తల తాకట్టు పెట్టి అయినా , కడుపులో బిడ్డ పడిన కాన్నుండి , బిడ్డ భూమి మీద పడిన కాన్నుండి , రోగాలు వచ్చిన రొప్పులూ వచ్చినా , గాయాలైనా కంటికి రెప్పలా చూసుకుంటారు . తాము పెద్దగా చదువక పోయినా , తమ బిడ్డలు పెద్ద పెద్ద చదువులు చదివి , గొప్ప వారు కావాలని , మంచి పేరు తేవాలని , రిక్షా త్రొక్కయినా , అప్పులు తెచ్చి అయినా , నానా తంటాలు పడి అయినా , ఉన్నత విద్యలు కాన్వెంట్ స్కూళ్లలో , ప్రయివేట్ స్కూళ్లలో చదివించి , మంచి మంచి ఉద్యోగాలు లేదా వ్యాపారాలు వచ్చేటట్లు చేసి , పెళ్ళిండ్లు , పేరంటాలు , పురుడ్లు చేస్తే , తల్లి దండ్రులు పేద వారు ఎలా అవుతారు? పిల్లలను ప్రయోజకులను చేసే క్రమం లో ఆస్తులను పోగొట్టుకుని , అప్పుల పాలయితే వారు పేదలు ఎలా అవుతారు? ఒక వేల వారు నిజంగానే వారు పేద వారు అయితే , పిల్లలు కూడా పేద తనంగానే జీవిస్తే , తల్లి దండ్రులు కూడా అంతే స్థాయి పోషణను కోరుకుంటారు . అంతే స్థాయి ప్రేమలను , ఆప్యాయతలను ఆశిస్తారు . అంతే కానీ ఏ సి లు , 5 స్టార్ రెస్టారెంట్లు , మినరల్ వాటర్ , బంగళాలు , విల్లాలు అడిగరు . మానవత్వమున్న కొడుకులు బిడ్డలు ఇలాంటి లెక్కలు ఎవ్వరూ వేయరు . ఇలాంటి పేదల కోసమే ప్రభుత్వాలు , నెలకు 1,000/- రు . లు . పెన్షన్ ఇస్తుంది . తెల్ల రేషన్ కార్డు ఇస్తుంది . మందులు ఇస్తుంది . వీటినే ఇతరులకు ఇవ్వాలి . సచ్ఛంద సంస్థలు , ధాతలు , మా న వత్వం గల వారు , ప్రభు త్వాలు , ఇలాంటి పేదలకు , ధన వంతులైన వారు , అనాధ తల్లి దండ్రులకు చోటు కల్పించాలి , ఆర్ధిక సహాయం చేయాలి.
ఏది ఏమైనప్పటికి , ఏ కొడుకైనా బిడ్డయినా కొన్ని జీవిత నగ్న సత్యాలను మరువరాదు . అవి ఏమంటే ,
01. " ఏ కొడుకైనా , బిడ్డయినా కూడా , రేపు వారి కొడుకూ బిడ్డలకు తల్లి దండ్రులవుతామనే విషయం మరువరాదు . "
02." ఏ కొడుకైనా , బిడ్డయినా వారు కూడా , రేపు వారి అల్లుడూ కోడలుకు అత్తా మామ లవుతారనే విషయం మరువరాదు ".
03." ఏ కొడుకైనా , బిడ్డయినా వారు కూడా , రేపు వారూ వృద్ధాప్య దశను తప్పించుకోలేరనే విషయం మరువరాదు ".
04." ఏ కొడుకైనా , బిడ్డయినా నేడు వారి కొడుకూ , బిడ్డలను ఎలా పెంచు తున్నారో , తమను కూడా అలానే పెంచి ఉంటారనే విషయం మరువరాదు ".
05." ఏ కొడుకైనా , బిడ్డయినా వారికి కూడా , రేపు రోగాలు రొప్పులేస్తున్నాయని , ఆర్ధిక ఇబ్బందులు, కష్ట సుఖాలు , లాభ నష్టాలు ఉంటాయన్న విషయం మరువరాదు "..
06. " జాతస్య మరణం ధృవం " . అనగా పుట్టిన వారు గిట్టక తప్పదు అనే విషయం ఎవ్వరూ మరువరాదు" .
07. " ప్రతి మనిషి సమాజంలో ఒక భాగమే నన్న విషయం ఎవ్వరూ మరువరాదు ".
08. " ఏ మనిషి అయినా వారి వారి దశల నుండి , గ్రహాల నుండి , ప్రారబ్ధ ఖర్మల నుండి తప్పించు కోలేరు అనే విషయం మరువరాదు ".
09. " తల్లి దండుల ఆస్తులపై , కొడుకులకు బిడ్డలకు , నైతిక హక్కే గాని , చట్టబద్దమైన హక్కు లేదన్న విషయం మరువరాదు ".
శతాబ్దాలు గడిచినా , 16 శతాబ్దం నాటి మన జనకవి ,' వేమన ' వ్రాసిన అనేక మైన పద్యాలలో ఒకటి ఇప్పటి అందరి నోటిలో నానుతూనే ఉంది , నానుతూనే ఉంటుంది . అది ఏమంటే ,
" తల్లి దండ్రుల యెడ దయ లేని పుత్రుండు , పుట్ట నేమి వాడు గిట్టనేమి ,
పుట్ట లోన చెదలు పుట్టదా గిట్టదా , విశ్వదాభి రామ వినుర వేమా "
మనం రోజూ పత్రికలలో , టీవీలలో చూస్తుంటాం . కొడుకులూ కోడండ్లు సరీగా చూడక పోవడం వలన ఉరిపెట్టుకున్నారని , ఆత్నహాత్యలు చేసుకున్నారని , తిరుపతి వెంకన్నకు ఆస్తులన్నీ వ్రాసిచ్చారనీ , కోట్లాది ఆస్తులుండి అనాధలయ్యారని , అడక్కు తింటున్నారని , దిక్కులేని చావు చచ్చారనీ వింటూ ఉంటాం . చూస్తూ ఉంటాం . ముందుగానే ఈ సోషల్ సర్వీస్ నిజాయితీగా , మనస్పూర్తిగా ప్రారంభిస్తే , పాజిటివ్ ధోరణితో నడుచుకుంటే నిండా నూరేళ్లు ఏ ఇబ్బందీ లేకుండా , ఎవ్వరితో చీవాట్లు పడకుండా , హాయిగా జీవించ వచ్చు . ఇక , ఆ పది విత్తనాలలో ఒకటి రెండూ గాలికి కొట్టుకు పోయినా , ఒకటి రెండింటిని పిట్టలు తిన్నా , ఒకటి రెండూ పుచ్ఛి పోయినా , చివరికి రెండు మూడయినా మిగులుతాయి . "కొడుకులు కోడండ్లు ,బిడ్డలు అల్లుండ్లు మిమ్ముల దూరం చేసిన రోజు , చీదరించుకున్న రోజు , అసహించుకున్న రోజు , బాధ పెట్టిన రోజు , మరింత వారికి దగ్గరై , మీ దగ్గర ఉన్న కొద్దీ పాటి నగదును , నగలను , ఆస్తులను , లేదా పెద్ద మొత్తం ఆస్తులను , మిమ్ములను ప్రాణానికి ప్రాణంగా చూసుకునే ఆ మిగిలిన వారందరికీ లేదా మీకు నచ్చిన ఒకరిద్దరికీ విడతల వారీగా వీ లు నామా రాసేసి లేదా రిజిస్టర్ చేయిస్తే , వృధ్యాప్య దశలో హాయిగా జీవించ వచ్చు" .తల్లి దండ్రులు స్వతహగ సంపాదించిన ఆస్తులు , వారి కొడుకులు బిడ్డలకు నైతిక హక్కే కానీ , చట్టబద్దమైన హక్కు అని ఎక్కడా లేదు . ఇది కేవలం తరాలుగా వస్తున్న ఆనవాయితీ మాత్రమే . బాధ్యతలు నెరవేరుస్తే , నైతిక హక్కుగా తల్లి దండ్రుల ఆస్తులను పొందవచ్చు . దీనికి గ్రామస్తులే పూనుకోవాలి. సమాజమే పూనుకోవాలి . ఒక మంచి ప్రయోజనం కొరకు చట్టాలు సహకరించాలి .
దీనికి , వృద్ధులకు కావాల్సింది ఒకటే . మనో ధైర్యం . సాహసం . పట్టుదల , పిల్లలు ఎంచుకున్న దారినే నడువగలిగే మొండితనం అలవర్చుకోవడం . ఎంత మాత్రం ఫీలవ్వక పోవడం అనేవి ముఖ్యం . మొదట ప్రారంభించిన వారికి కొంత ఇబ్బంది , మానసిక ఆంధోలన ఉండవచ్చు . కానీ రాను రాను అందరూ అదే బాటలో నడిస్తే , ఏ బాధ అనిపించదు . చట్టాలను కూడా వీటికి అనుగుణంగా మార్చాలి . నైతిక బాధ్యత వహించి , కొడుకులు బిడ్డలు కూడా స్వచ్చందంగా , తల్లి దండ్రులు సంపాదించుకున్న ఆస్తులను వదులు కోవాలి . లేదా వారిని ఎదో విధంగా , వారికి కష్టం బాధ కలుగ కుండా పోషించే బాధ్యతను తీసు కోవాలి .
అయితే దేశంలో కొడుకులు కోడండ్లు , బిడ్డలు అల్లుండ్లు మంచి వారు అసలే లేరు అని అనడం లేదు . తల్లి దండ్రులను మంచిగా పోషించే వారు ఉన్నారు , ప్రేమలను , ఆప్యాయతలను పంచే వారు ఉన్నారు . " ఒకే వరలో రెండు కత్తులు ఇమడవు " అన్నట్లు , ఒకే కుటుంభం లో ఆధి పత్య పోరుగల అత్తా కోడండ్లు , 'ఒక తరం 'వయస్సు తేడా గల అత్తా కోడండ్లు , విద్య , సంపాదనలో తేడా గల అత్తా కోడండ్లు , పాత సాంప్రదాయాలు గల అత్తలు , పాశ్చాత్త్యా పోకడలు గల కోడండ్లతో నివసించ లేరు , " స్త్రీ కి , స్త్రీయే శత్రువు " అనే నానుడి ఏనాడో పుట్టింది . ఎవరికో ఒకరికి లేదా ఇద్దరికీ సర్దుబాటు గుణం ఉంటే తప్పా . " రౌతు గుర్రాన్ని కొలను వరకు తీసుకుని రాగలడే గాని, నీటిని త్రాగించలేడు " అన్నట్లు , కొడుకుల పరిస్థితి అలానే ఉంది . బిడ్డల పరిస్థితి కూడా అలానే ఉంది . చాదస్తపు తల్లి దండ్రులు , అత్తా మామలు , 70, 80 యేండ్లు వచ్చినా మా మాటే అందరూ వినాలనే వారు , మేము చెప్పినట్లుగానే నడుచుకోవాలి అనే వారు లేక పోలేదు. చాదస్తం తోటి గిల్లి పంచాయితీలు పెట్టుకునే తల్లి దండ్రులు లేక పోలేదు . ఈ కారణంగానే ప్రతి కుటుంభంలో అనేక సమస్యలు ఉంటున్నాయి . ఇక ముందూ ఉంటాయి కూడా .
అయితే , మీరు ఇక్కడ ఒక సమస్యను లేవదీయ వచ్చు . డబ్బు , ఆస్తులున్న వారు సరే . మరి డబ్బు , ఆస్తులు లేని వృద్ధుల పరిస్థితి ఏమిటి ?
'ఎంత చెట్టుకి అంతే గాలి' అన్నట్లు , వారికి తగ్గట్టే సేవలు లభించ వచ్చు . అంత కంటే ఎక్కువగా , పెద్దగా వారు ఊహించరు , ఆశించరు కూడా . నిజానికి ఏ తల్లి తండ్రి పేదలు కారు. ఆర్ధికంగా పేదలు కావచ్చు . కానీ పిల్లలకు ప్రేమను పంచడంలో , పిల్లలను పోషించడంలో పేదలు కారు . ధన వంతులైన , పేదలైనా , తల తాకట్టు పెట్టి అయినా , కడుపులో బిడ్డ పడిన కాన్నుండి , బిడ్డ భూమి మీద పడిన కాన్నుండి , రోగాలు వచ్చిన రొప్పులూ వచ్చినా , గాయాలైనా కంటికి రెప్పలా చూసుకుంటారు . తాము పెద్దగా చదువక పోయినా , తమ బిడ్డలు పెద్ద పెద్ద చదువులు చదివి , గొప్ప వారు కావాలని , మంచి పేరు తేవాలని , రిక్షా త్రొక్కయినా , అప్పులు తెచ్చి అయినా , నానా తంటాలు పడి అయినా , ఉన్నత విద్యలు కాన్వెంట్ స్కూళ్లలో , ప్రయివేట్ స్కూళ్లలో చదివించి , మంచి మంచి ఉద్యోగాలు లేదా వ్యాపారాలు వచ్చేటట్లు చేసి , పెళ్ళిండ్లు , పేరంటాలు , పురుడ్లు చేస్తే , తల్లి దండ్రులు పేద వారు ఎలా అవుతారు? పిల్లలను ప్రయోజకులను చేసే క్రమం లో ఆస్తులను పోగొట్టుకుని , అప్పుల పాలయితే వారు పేదలు ఎలా అవుతారు? ఒక వేల వారు నిజంగానే వారు పేద వారు అయితే , పిల్లలు కూడా పేద తనంగానే జీవిస్తే , తల్లి దండ్రులు కూడా అంతే స్థాయి పోషణను కోరుకుంటారు . అంతే స్థాయి ప్రేమలను , ఆప్యాయతలను ఆశిస్తారు . అంతే కానీ ఏ సి లు , 5 స్టార్ రెస్టారెంట్లు , మినరల్ వాటర్ , బంగళాలు , విల్లాలు అడిగరు . మానవత్వమున్న కొడుకులు బిడ్డలు ఇలాంటి లెక్కలు ఎవ్వరూ వేయరు . ఇలాంటి పేదల కోసమే ప్రభుత్వాలు , నెలకు 1,000/- రు . లు . పెన్షన్ ఇస్తుంది . తెల్ల రేషన్ కార్డు ఇస్తుంది . మందులు ఇస్తుంది . వీటినే ఇతరులకు ఇవ్వాలి . సచ్ఛంద సంస్థలు , ధాతలు , మా న వత్వం గల వారు , ప్రభు త్వాలు , ఇలాంటి పేదలకు , ధన వంతులైన వారు , అనాధ తల్లి దండ్రులకు చోటు కల్పించాలి , ఆర్ధిక సహాయం చేయాలి.
ఏది ఏమైనప్పటికి , ఏ కొడుకైనా బిడ్డయినా కొన్ని జీవిత నగ్న సత్యాలను మరువరాదు . అవి ఏమంటే ,
01. " ఏ కొడుకైనా , బిడ్డయినా కూడా , రేపు వారి కొడుకూ బిడ్డలకు తల్లి దండ్రులవుతామనే విషయం మరువరాదు . "
02." ఏ కొడుకైనా , బిడ్డయినా వారు కూడా , రేపు వారి అల్లుడూ కోడలుకు అత్తా మామ లవుతారనే విషయం మరువరాదు ".
03." ఏ కొడుకైనా , బిడ్డయినా వారు కూడా , రేపు వారూ వృద్ధాప్య దశను తప్పించుకోలేరనే విషయం మరువరాదు ".
04." ఏ కొడుకైనా , బిడ్డయినా నేడు వారి కొడుకూ , బిడ్డలను ఎలా పెంచు తున్నారో , తమను కూడా అలానే పెంచి ఉంటారనే విషయం మరువరాదు ".
05." ఏ కొడుకైనా , బిడ్డయినా వారికి కూడా , రేపు రోగాలు రొప్పులేస్తున్నాయని , ఆర్ధిక ఇబ్బందులు, కష్ట సుఖాలు , లాభ నష్టాలు ఉంటాయన్న విషయం మరువరాదు "..
06. " జాతస్య మరణం ధృవం " . అనగా పుట్టిన వారు గిట్టక తప్పదు అనే విషయం ఎవ్వరూ మరువరాదు" .
07. " ప్రతి మనిషి సమాజంలో ఒక భాగమే నన్న విషయం ఎవ్వరూ మరువరాదు ".
08. " ఏ మనిషి అయినా వారి వారి దశల నుండి , గ్రహాల నుండి , ప్రారబ్ధ ఖర్మల నుండి తప్పించు కోలేరు అనే విషయం మరువరాదు ".
09. " తల్లి దండుల ఆస్తులపై , కొడుకులకు బిడ్డలకు , నైతిక హక్కే గాని , చట్టబద్దమైన హక్కు లేదన్న విషయం మరువరాదు ".
శతాబ్దాలు గడిచినా , 16 శతాబ్దం నాటి మన జనకవి ,' వేమన ' వ్రాసిన అనేక మైన పద్యాలలో ఒకటి ఇప్పటి అందరి నోటిలో నానుతూనే ఉంది , నానుతూనే ఉంటుంది . అది ఏమంటే ,
" తల్లి దండ్రుల యెడ దయ లేని పుత్రుండు , పుట్ట నేమి వాడు గిట్టనేమి ,
పుట్ట లోన చెదలు పుట్టదా గిట్టదా , విశ్వదాభి రామ వినుర వేమా "
మరో విషయం , "కొడుకులు  కోడండ్లు ,బిడ్డలు అల్లుండ్లు  మిమ్ముల  దూరం చేసిన రోజు , చీదరించుకున్న రోజు , అసహించుకున్న రోజు , బాధ పెట్టిన రోజు ,  మీరు స్వయంగా  ఎంచు కున్న వారికి , నమ్ముకున్న వారికీ మరింత వారికి దగ్గరై ,  మీ దగ్గర ఉన్న  కొద్దీ పాటి నగదును , నగలను , ఆస్తులను , లేదా పెద్ద మొత్తం ఆస్తులను , మిమ్ములను ప్రాణానికి ప్రాణంగా చూసుకునే  ఆ మిగిలిన వారందరికీ లేదా  మీకు నచ్చిన  ఒకరిద్దరికీ  విడతల వారీగా  వీ లు నామా రాసేసి లేదా  రిజిస్టర్ చేయిస్తే , వృధ్యాప్య దశలో హాయిగా , ప్రశాంతంగా , మనఃశాంతితో  జీవించ వచ్చు".  అంతే కాదు , దీని వలన  అనేక లాభాలు కూడా  ఉన్నాయి  . అవి ,
01. పేద పిల్లలకు  కొంత ఆదరణ , ఆర్ధిక సహాయం  అందుతుంది . వారు విద్య వంతు లవుతారు. ఉపాధిని పొందుతారు . తమ కాళ్ళ మీద , తాము  జీవించ గలుగుతారు . 
02. ప్రభుత్వాలకు  కొంత భారం తగ్గుతుంది . 
03. సంపద వికేంద్రీకరణ  జరుగుతుంది . ఆర్ధిక  అసమానతలు తొలిగి పోతాయి . 
04. వృద్ధాప్య దశలో  తల్లి దండ్రులకు  ఎలాంటి దిగులు , బాధ కష్టం ఉండదు . 
05. సమాజం దృష్టి కూడా  పిల్లలపై పడుతుంది కాబట్టి , వారిలో  కూడా కొంత మార్పు రావచ్చు . ఆస్తుల కొరకైనా  లేదా ప్రేమ తోటైనా  , లేదా జ్ఞ్యానోదయం  కలిగయినా తల్లి దండ్రులను , ఎదో విధంగా  చూసుకోడానికి , ఆదు కోడానికి ముందుకు రావచ్చు .  
06. అనేకమైన ఇతర కారణాల వలన అనగా అత్తా కోడలుకు పడక పోవడం కావచ్చు , కొడుకు కోడలు ఇద్దరూ ఉద్యోగాలు చేయడం కావచ్చు , మరే ఇతర కారణాలు కావచ్చు . అలాంటప్పుడు కొడుకులు , తల్లి దండ్రులను దూరంగా ఉంచయినా ఆర్ధిక భారాన్ని భరిస్తూ , ప్రేమలను , ఆప్యాయతలను పంచినా చాలు . అందులో తప్పేమి లేదు . కోడళ్లతో , తిట్లు , కొట్లు , చంపబడటాలు పడే బదులు , పరిస్థితులను బట్టి వారిని దూరంగా ఉంచి పోషించడం నేరం కాదు . వృద్ధాశ్రమం లలో లేదా వారి వారి గృహాలలో ఉంచడంలో తప్పు లేదు . తల్లీ దండ్రుల మీద ప్రేమ ఉందా లేదా అనేదే ముఖ్యం . కొడుకులకు ఇలాంటి ఆలోచనలైనా రావచ్చు . ఏ కొందరికి వచ్చినా నా జీవితం ధన్యమే .
06. అనేకమైన ఇతర కారణాల వలన అనగా అత్తా కోడలుకు పడక పోవడం కావచ్చు , కొడుకు కోడలు ఇద్దరూ ఉద్యోగాలు చేయడం కావచ్చు , మరే ఇతర కారణాలు కావచ్చు . అలాంటప్పుడు కొడుకులు , తల్లి దండ్రులను దూరంగా ఉంచయినా ఆర్ధిక భారాన్ని భరిస్తూ , ప్రేమలను , ఆప్యాయతలను పంచినా చాలు . అందులో తప్పేమి లేదు . కోడళ్లతో , తిట్లు , కొట్లు , చంపబడటాలు పడే బదులు , పరిస్థితులను బట్టి వారిని దూరంగా ఉంచి పోషించడం నేరం కాదు . వృద్ధాశ్రమం లలో లేదా వారి వారి గృహాలలో ఉంచడంలో తప్పు లేదు . తల్లీ దండ్రుల మీద ప్రేమ ఉందా లేదా అనేదే ముఖ్యం . కొడుకులకు ఇలాంటి ఆలోచనలైనా రావచ్చు . ఏ కొందరికి వచ్చినా నా జీవితం ధన్యమే .
07. కొందరు  తల్లి దండ్రుల మనస్థత్వాలు  కూడా  కొడుకులకు, లేదా  కోడన్లకు కు లేదా బిడ్డలకు లేదా అల్లుండ్లకు నచ్చక పోవచ్చు ,  గిట్టక  పోవచ్చు . అలాంటి వారికి  ఇలాంటి  పిల్లల మనస్థత్వాలు  నచ్చ వచ్చు .  ఆ కారణంగా కూడా  వీరికి వృద్ధాప్య దశలో  ఎలాంటి  దిగులు ఉండదు . 
08. ఒక్క కుటుంభంతో మొదలైన ఈ విధానం , దేశమంతా విస్తరిస్తే , సంపద విస్తరించి ,ఆర్ధిక అసమానతలు తగ్గి పోయి , పేద కుటుంబాలు కనుమరుగయి పోతాయి . దేశం ఆర్ధికాభి వృద్ధి చెందుతుంది.
09. వృద్ధులకు జీవించాలనే ఆశ పెరుగుతుంది . జీవించ గలమనే ధైర్యం పెరుగు తుంది . బలవంతపు చావులు / ఆత్మ హత్యలు తగ్గి పోతాయి .
10. వృధ్యాప్య దశలో హాయిగా , ప్రశాంతంగా , మనఃశాంతితో జీవించ వచ్చు".
ఈ ఆర్టికల్ ను నేటి వృద్ధులు చదువలేక పోవచ్చు . వారికి ఇప్పటికీ ఇప్పుడే నిర్ణయాలు తీసుకోగల శక్తి , ధైర్యం లేక పోవచ్చు . కానీ నేటి యువతీ యువకులకు తల్లి దండ్రులు తప్పకుండా ఉండి ఉంటారు . వారిలో మార్పు వస్తే చాలు . మరో విషయం , నేటి యువతీ యువకులే , రేపు తల్లి దండ్రులుగా మారుతారు . అప్పుడైనా వారు ఈ నిర్ణయాలు తీసుకోడానికి అవకాశం ఉంటుంది . అయితే వీరు ఇప్పటి నుండే కొంత డబ్బు పొదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది . అలానే ఇతర పిల్ల యెడ ప్రేమ , దయ , కరుణ , ఆప్యాయత , సహనం పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉంది . అంతే కాకుండా ఎక్కడైనా , ఒంటరిగానైనా సంతోషంగా జీవిస్తాం అనే విధంగా మనో ధైర్యాన్ని పెంచు కోవాలి .
ఇది ఎదో ఒక రోజు తప్పకుండా మొదలవుతుంది . ముసలి వారంటే చీదరించుకునే
, ఏ విధమైన సహకారం , ప్రేమలు అందించని కొడుకులు బిడ్డలకు , కోడండ్లకు అల్లుండ్లకు జ్ఞ్యానోదయం కలుగుతుంది .
08. ఒక్క కుటుంభంతో మొదలైన ఈ విధానం , దేశమంతా విస్తరిస్తే , సంపద విస్తరించి ,ఆర్ధిక అసమానతలు తగ్గి పోయి , పేద కుటుంబాలు కనుమరుగయి పోతాయి . దేశం ఆర్ధికాభి వృద్ధి చెందుతుంది.
09. వృద్ధులకు జీవించాలనే ఆశ పెరుగుతుంది . జీవించ గలమనే ధైర్యం పెరుగు తుంది . బలవంతపు చావులు / ఆత్మ హత్యలు తగ్గి పోతాయి .
10. వృధ్యాప్య దశలో హాయిగా , ప్రశాంతంగా , మనఃశాంతితో జీవించ వచ్చు".
ఈ ఆర్టికల్ ను నేటి వృద్ధులు చదువలేక పోవచ్చు . వారికి ఇప్పటికీ ఇప్పుడే నిర్ణయాలు తీసుకోగల శక్తి , ధైర్యం లేక పోవచ్చు . కానీ నేటి యువతీ యువకులకు తల్లి దండ్రులు తప్పకుండా ఉండి ఉంటారు . వారిలో మార్పు వస్తే చాలు . మరో విషయం , నేటి యువతీ యువకులే , రేపు తల్లి దండ్రులుగా మారుతారు . అప్పుడైనా వారు ఈ నిర్ణయాలు తీసుకోడానికి అవకాశం ఉంటుంది . అయితే వీరు ఇప్పటి నుండే కొంత డబ్బు పొదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది . అలానే ఇతర పిల్ల యెడ ప్రేమ , దయ , కరుణ , ఆప్యాయత , సహనం పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉంది . అంతే కాకుండా ఎక్కడైనా , ఒంటరిగానైనా సంతోషంగా జీవిస్తాం అనే విధంగా మనో ధైర్యాన్ని పెంచు కోవాలి .
ఇది ఎదో ఒక రోజు తప్పకుండా మొదలవుతుంది . ముసలి వారంటే చీదరించుకునే
, ఏ విధమైన సహకారం , ప్రేమలు అందించని కొడుకులు బిడ్డలకు , కోడండ్లకు అల్లుండ్లకు జ్ఞ్యానోదయం కలుగుతుంది .
" సర్వే  జన : సుఖినో భవంతు "   
No comments:
Post a Comment