ప్ర: దేశంలో గాని, రాష్ట్రాలలో గాని ప్రతి పక్ష పార్టీలు  బలంగా  (POWERFUL)  ఉండాలా ?
జ : అవును . దేశంలో గాని  , రాష్ట్రాలలో గాని  పాలక పక్షం  ఎంత బలంగా  ఉంటే , ప్రతి పక్షాలు కూడా  అంతే బలంగా  ఉండాలి . అప్పుడే  కొంత వరకైనా  అవినీతికి అడ్డు కట్ట  పడుతుంది . లేదంటే ' మోనో పాలై యి ' పోయి , గుత్తాధి పత్యంతో  దొరికినంత  దోచుకునే అవకాశం ఉంటుంది . వారికీ  అనుకూలమైన  చట్టాలను మార్చుకునే అవకాశం చిక్కుతుంది .  అందుకే ప్రజలు  నిబ్బరంతో చూస్తూ  ఉండాలి కానీ , అటు పాలక పక్షాన్ని గాని , ఇటు ప్రతి పక్షాన్ని గాని  ఎవ్వరినీ విమర్శించ కూడదు .  యేది ఎవ్వరు చేసినా  , అది మెజారిటీ  పేద మధ్య తరగతి ప్రజలకు  మేలు  జరుగ పోతుందనుకుంటే  , అది సరియైనదే  అనుకోవాలి . 
ఇక  కేంద్ర ప్రభత్వం  8 నవంబర్ , 2016 న  సదుద్దేశ్యంతో  , సాహసోపేతంగా ప్రకటించిన  పెద్ద నోట్ల  రద్దును , పెద్దగా విమర్శించ నవసరం  లేదు . వారి  ప్రధాన ఉద్దేశ్యం డైరెక్టుగా నల్లధనాన్ని  అరికట్టడం , అవినీతిని  నిర్ములించడం  మరియి పేక్ నోట్లను  లేకుండా చేయడం .  ఇక ఇండైరెక్టుగా  ఉగ్ర వాదాన్ని అణిచి వేయడం , పేద ధనికుల  ఆర్ధిక  అంతరాలను  తగ్గించడం, ప్రజలలో పొదుపు తనాన్ని పెంచడం , బ్యాంకింగ్ అవేర్నెస్ పెంచడం   మరియు అవినీతి రహిత దేశంగా , ప్రజలు సుభిక్షముగా   జీవించే  విధంగా  వ్యవస్థను  తయారు చేయడం . 
కానీ తొందరపాటో లేక ఉహించలేకనో కొన్ని నిర్ణయాలు తీసుకోలేక పోయారని సర్వత్రా వెల్లడవుతుంది . అవి ఏమంటే , ఎవ్వరికీ అనుమానం కలుగ కుండానే ఎక్కువగా చిన్న నోట్లను ముద్రించి బ్యాంకులకు పంపక పోవడం , ఆ రోజు మొత్తం బంగారు షాపులు మూసి వేయించ లేక పోవడం , అప్పటికే డిజిటల్ వ్యవస్థను పెంపొందించ లేక పోవడం మొదలైనవి .
ఇక అవకాశాలు , చట్టాల లోని లొసుగులు , తక్కువ సమయం మొదలైనవి నల్ల కుబేరుల , అవినీతి పరుల ఆలోచనలకు పదును పెట్టినవి . అవినీతి పరులకు మెదడు నిండా వాటిని ఎలా పొందాలో , అలానే ఎలా కాపాడు కోవాలనే ఆలోచనలు ఉంటాయి , వారికీ ఐడియాలు ఇచ్చే మేధావులు ఉంటారు . వెరసి , కోట్ల కొద్దీ కొత్త నోట్లు, కాలు బయట పెట్టకుండానే వారి వారి బంగ్లాలకు సిరి పోయాయి . వీటికి తోడు క్రొత్తగా కొందరు ఆర్ . బి . ఐ . అధికారులకు , ఐ . టి . అధికారులకు , బ్యాంకు అధికారులకు , పోస్టల్ అధికారులకు , ప్రయివేటు కమీషన్ ముఠాలకు , మేమెందుకు సంపాదించుకోకూడదు అనుకున్నారో ఏమో , దురాశ పుట్టి వారూ అవినీతికి తెగబడ్డారు . మరో వైపు నోట్ల ప్రింటింగ్ , పంపిణీ ఆలస్యం కావడం, ఇలా అనేకమైన ఇతర కారణాల వలన ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు . ఎదుర్కుంటున్నారు .
మనం ఒకటి గుర్తుంచు కోవాలి . మన ఇంట్లో కేవలం నలుగురు కుటుంబ సభ్యులు ఉంటేనే , ఇంటి యజమాని ఆ మిగిలిన ముగ్గురిని అదుపులో పెట్టలేని పరిస్థితి . నిజాయితీగా ఒప్పుకోండి . అలాంటిది 127 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో , ఒక ప్రధాన మంత్రో , ఆర్ధిక మంత్రో , ఆర్ . బి . ఐ . గవర్నరో అదుపు చేయడం ఆశ మాషి కాదు . కేవలం సిష్టం మీద , నమ్మకం మీద నడుస్తుంది . స్పాన్ ఆఫ్ కంట్రోల్ మీద నడుస్తుంది . ఇది ఒక యజ్ఞము లాంటిది . ఋషులు యజ్ఞము చేసే టప్పుడు , చెడ గొట్టాలన్న దృక్పధంతో మరికొందరు నీరు చల్లుతూనే ఉంటారు . ఏది ఏమైనా , సంబంధిత అవినీతి అధికారులపై ఇప్పటికే చర్యలు ప్రారంభించారు .
ఒక వేల మీరు ఈ యజ్ఞము అసత్యం అని అనుకున్నట్లయితే , మీరు అనుకున్నట్లు , వారిలో స్వార్ధం ఉంది , అవినీతి జరిగింది అని మీరు అనుకున్నట్లయితే , మీ మీదనే కక్ష కడుతున్నారు అని అనుకుంటే , లేదా చాలా మంది నల్ల కుబేరులను వదిలి పెట్టారని మీరు నమ్ముతే , ముందుగా వారు చేసేది చేయ నీయండి . వాస్తవానికి పెద్ద నోట్ల రద్దు వలన పేద మధ్య తరగతి ప్రజలకు మేలు జరుగుతుందని, నిజాయితీ ప్రజలకు గౌరవం దక్కుతుందని దేశంలోని మెజారిటీ ప్రజలు చాలా ఓపికతో ఇబ్బందులను భరిస్తున్నారు . బ్యాంకర్లు కూడా ఓపికతో వారి సేవలను అందిస్తున్నారు . ఎంతో మంది మేధావులు , సీనియర్ సిటిజన్లు , అతి సామాన్యులు కూడా దీనిని బాహాటంగానే సమర్థిస్తున్నారు . ప్రజలు నిజ జీవితంలో ఇంత కంటే ఎక్కువ క్యూలైన్లలో నిల బడ్డ సందర్భాలు లేక పోలేదు . ఎలక్షన్లలో , సినిమాహాళ్ళ దగ్గర , రేషన్ షాపులదగ్గర , హాస్పిటల్ ఓపిల దగ్గర , తిరునాళ్ల దగ్గర , ఉధ్యమాలలో , ఎమర్జెన్సీ కాలంలో , మరెన్నో చోట్ల నిలబడ్డారు . అన్ని రకాలుగా కష్ట సుఖాలు అనుభవించారు . ఇక్కడా అంతే . ఒక 50 రోజులు, దేశాభి మానంతో. రేపు దేశం అభివృద్ధి చెందుతుందనే నమ్మకంతో .
కానీ తొందరపాటో లేక ఉహించలేకనో కొన్ని నిర్ణయాలు తీసుకోలేక పోయారని సర్వత్రా వెల్లడవుతుంది . అవి ఏమంటే , ఎవ్వరికీ అనుమానం కలుగ కుండానే ఎక్కువగా చిన్న నోట్లను ముద్రించి బ్యాంకులకు పంపక పోవడం , ఆ రోజు మొత్తం బంగారు షాపులు మూసి వేయించ లేక పోవడం , అప్పటికే డిజిటల్ వ్యవస్థను పెంపొందించ లేక పోవడం మొదలైనవి .
ఇక అవకాశాలు , చట్టాల లోని లొసుగులు , తక్కువ సమయం మొదలైనవి నల్ల కుబేరుల , అవినీతి పరుల ఆలోచనలకు పదును పెట్టినవి . అవినీతి పరులకు మెదడు నిండా వాటిని ఎలా పొందాలో , అలానే ఎలా కాపాడు కోవాలనే ఆలోచనలు ఉంటాయి , వారికీ ఐడియాలు ఇచ్చే మేధావులు ఉంటారు . వెరసి , కోట్ల కొద్దీ కొత్త నోట్లు, కాలు బయట పెట్టకుండానే వారి వారి బంగ్లాలకు సిరి పోయాయి . వీటికి తోడు క్రొత్తగా కొందరు ఆర్ . బి . ఐ . అధికారులకు , ఐ . టి . అధికారులకు , బ్యాంకు అధికారులకు , పోస్టల్ అధికారులకు , ప్రయివేటు కమీషన్ ముఠాలకు , మేమెందుకు సంపాదించుకోకూడదు అనుకున్నారో ఏమో , దురాశ పుట్టి వారూ అవినీతికి తెగబడ్డారు . మరో వైపు నోట్ల ప్రింటింగ్ , పంపిణీ ఆలస్యం కావడం, ఇలా అనేకమైన ఇతర కారణాల వలన ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు . ఎదుర్కుంటున్నారు .
మనం ఒకటి గుర్తుంచు కోవాలి . మన ఇంట్లో కేవలం నలుగురు కుటుంబ సభ్యులు ఉంటేనే , ఇంటి యజమాని ఆ మిగిలిన ముగ్గురిని అదుపులో పెట్టలేని పరిస్థితి . నిజాయితీగా ఒప్పుకోండి . అలాంటిది 127 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో , ఒక ప్రధాన మంత్రో , ఆర్ధిక మంత్రో , ఆర్ . బి . ఐ . గవర్నరో అదుపు చేయడం ఆశ మాషి కాదు . కేవలం సిష్టం మీద , నమ్మకం మీద నడుస్తుంది . స్పాన్ ఆఫ్ కంట్రోల్ మీద నడుస్తుంది . ఇది ఒక యజ్ఞము లాంటిది . ఋషులు యజ్ఞము చేసే టప్పుడు , చెడ గొట్టాలన్న దృక్పధంతో మరికొందరు నీరు చల్లుతూనే ఉంటారు . ఏది ఏమైనా , సంబంధిత అవినీతి అధికారులపై ఇప్పటికే చర్యలు ప్రారంభించారు .
ఒక వేల మీరు ఈ యజ్ఞము అసత్యం అని అనుకున్నట్లయితే , మీరు అనుకున్నట్లు , వారిలో స్వార్ధం ఉంది , అవినీతి జరిగింది అని మీరు అనుకున్నట్లయితే , మీ మీదనే కక్ష కడుతున్నారు అని అనుకుంటే , లేదా చాలా మంది నల్ల కుబేరులను వదిలి పెట్టారని మీరు నమ్ముతే , ముందుగా వారు చేసేది చేయ నీయండి . వాస్తవానికి పెద్ద నోట్ల రద్దు వలన పేద మధ్య తరగతి ప్రజలకు మేలు జరుగుతుందని, నిజాయితీ ప్రజలకు గౌరవం దక్కుతుందని దేశంలోని మెజారిటీ ప్రజలు చాలా ఓపికతో ఇబ్బందులను భరిస్తున్నారు . బ్యాంకర్లు కూడా ఓపికతో వారి సేవలను అందిస్తున్నారు . ఎంతో మంది మేధావులు , సీనియర్ సిటిజన్లు , అతి సామాన్యులు కూడా దీనిని బాహాటంగానే సమర్థిస్తున్నారు . ప్రజలు నిజ జీవితంలో ఇంత కంటే ఎక్కువ క్యూలైన్లలో నిల బడ్డ సందర్భాలు లేక పోలేదు . ఎలక్షన్లలో , సినిమాహాళ్ళ దగ్గర , రేషన్ షాపులదగ్గర , హాస్పిటల్ ఓపిల దగ్గర , తిరునాళ్ల దగ్గర , ఉధ్యమాలలో , ఎమర్జెన్సీ కాలంలో , మరెన్నో చోట్ల నిలబడ్డారు . అన్ని రకాలుగా కష్ట సుఖాలు అనుభవించారు . ఇక్కడా అంతే . ఒక 50 రోజులు, దేశాభి మానంతో. రేపు దేశం అభివృద్ధి చెందుతుందనే నమ్మకంతో .
ప్రజలు  ఎప్పుడూ  ఒక పార్టీనే  గెలిపించరు కదా . ఎప్పుడూ  మార్పునే  కోరుకుంటారు .  మీకు  నిజంగా  పేద మధ్య తరగతి ప్రజలపై , నిజాయితీ ప్రజలపై  ప్రేమ , గౌరవం , నమ్మకం  ఉన్నట్లయితే , రేపు మీరు గెలిచాక, మీరు  నమ్ముతున్న  నల్ల కుబేరుల , వారు వదిలి పెట్టిన  అవినీతి పరుల  నుండి నల్ల ధనాన్ని  వెలికి తీసే ప్రయత్నాలు  చేపట్టండి , బినామీ ఆస్తులను జప్తు చేయండి  . బంగారు కడ్డీలను బయటకు తీయండి , ఒకే రోజు లాకర్లను తెరిపించండి ,  ' లోక్ పాల్ ' బిల్లును ప్రవేశ పెట్టండి . సి . బి . ఐ  కి  స్వతంత్ర  అధికారాలకు  బిల్లు తెండి . అవినీతి  నాయకులను  కాల్ బ్యాక్ చేసే  అధికారాన్ని కల్పించండి . అప్పుడు మీకు కూడా  ప్రజలు మద్దతు పలుకుతారు .  అప్పుడు  దేశం లోని  నల్ల కుబేరులు , అవినీతి పరులు, బినామీ ఆస్తులు గల వారు  సంపూర్ణముగా  లేకుండా  పోతారు .  ఆ విధంగా  వెలికి తీసిన నల్ల డబ్బుతో   ఉత్పాదక  పరిశ్రమలను అభి వృద్ధి పరిచి  , ప్రతి ఒక్కరికి  ఉద్యోగాలు  కల్పించండి .దేశ మానవ  వనరులను అభి వృద్ధి పరచండి . దేశ ఆర్ధిక పరిస్థిని పఠిష్టపరచండి , దేశ భద్రతను పెంచండి . సైబర్ నేరాలను కట్టడి చేయండి . ఉగ్ర వాదాన్ని  నిర్ములించండి .  వృద్ధులందరికి  , అంగ వికలురందరికి మరిన్ని   సంక్షేమ  పధకాలు అంద  చేయండి . ఉచిత విద్యను , ఉచిత ఆరోగ్య సౌకర్యాలను   అంద  చేయండి . ప్రతి కుటుంబానికి  ఒక సొంత  ఇంటి కలను  సాకారం చేయండి . అడుక్కు తినే వ్యవస్థను రూపు మాపండి . అందరికి  సకాలంలో  న్యాయం జరిగే విధంగా  చూడండి . పేదలందరికీ ఉచితంగా  హెల్త్ కార్డులను  జారీ  చేయండి . రాజకీయ నాయకుల వేతనాలపై  కూడా పన్నులు వేసే బిల్లును పెట్టండి . సామాన్యులకు పన్నులు తగ్గించండి . రాజకీయ నాయకులకు ఇచ్చే అభివృద్ధి నిధులను ఎత్తి వేయండి . దేశంలోని ప్రజలను కేవలం  పేద ధనికులుగానే  గుర్తించి , ఆ విధంగా రిజర్వేషన్లను అమలు చేయండి . అప్పుడు  మీకు కూడా ప్రజలు మద్దతు పలుకుతారు . జే  జే లు కొడుతారు .    అప్పుడే   దేశంలో ఆర్ధిక అంతరాలు అంతరించి , దేశ  ప్రజలందరూ  ప్రశాంతంగా , సుఖ సంతోషాలతో , హాయిగా  జీవిస్తారు . 
అయితే , ఇప్పడు అవి నీతి పరులు , నల్ల ధన కుబేరులు మోసాలతో పెద్ద నోట్లను కూడ బెట్టినా , దాచి పెట్టినా వాటిని ఫిల్టర్ చేయడం , వాటికీ విలువ లేకుండా చేయడం పెద్ద కష్ట మేమి కాదు . కొంత కాలం పోయాక పెద్ద నోట్లను రద్దు చేసి , బ్యాంకు అకౌంట్ల ద్వారానే డిపాజిటుకు అనుమతించాలి . అప్పుడు వారు కేవలం , పెద్ద నోట్లు రద్దయ్యేనాటికి బ్యాంకు ద్వారా డ్రా చేసిన డబ్బును మరియు లెక్కల ప్రకారం ప్రజల నుండి వచ్చిన డబ్బును మాత్రమే డిపాజిట్ చేయ గలుగుతారు . మిగిలిన పెద్ద నోట్లన్నీ నల్ల ధనమన్నట్లే కదా . అవినీతి సొమ్ము అన్నట్లే కదా .
"125 కోట్ల ప్రజలకు చెందాల్సిన దేశ సంపద, కేవలం కొంత మంది అనుభవించడం ధర్మం కాదు " ( WHEN THE WEALTH OF 125 CRORE PEOPLE, ENJOYED BY FEW PEOPLE IS NOT JUSTIFUL").
ప్రతి ఒక్కరికీ రెండే చేతులుంటాయి , రెండే కాళ్ళుంటాయి . రెండే చెవులు , రెండే కళ్ళు , ఒకటే ముక్కు , ఒకటే నోరు , ఒకటే మెదడు ఉంటాయి . అందరూ వచ్చింది ఒక దగ్గరినుండే , పోయిది ఒక దగ్గరికే . వచ్చే టపుడు ఏమి తీసుక రారు , పోయేటప్పుడు ఏమీ తీసుక పోరు . అందరూ రోజుకు 8 నుండి 12 గంటలే పని చేస్తారు . అలాంటప్పుడు , కొందరికే ఇంత డబ్బు ఎలా సమకూరుతున్నది . వ్యవస్థల్లో ఎక్కడో బ్లాక్ హోల్స్ ఉన్నయి . వాటిని మూసి వేయాలి .
అయితే , ఇప్పడు అవి నీతి పరులు , నల్ల ధన కుబేరులు మోసాలతో పెద్ద నోట్లను కూడ బెట్టినా , దాచి పెట్టినా వాటిని ఫిల్టర్ చేయడం , వాటికీ విలువ లేకుండా చేయడం పెద్ద కష్ట మేమి కాదు . కొంత కాలం పోయాక పెద్ద నోట్లను రద్దు చేసి , బ్యాంకు అకౌంట్ల ద్వారానే డిపాజిటుకు అనుమతించాలి . అప్పుడు వారు కేవలం , పెద్ద నోట్లు రద్దయ్యేనాటికి బ్యాంకు ద్వారా డ్రా చేసిన డబ్బును మరియు లెక్కల ప్రకారం ప్రజల నుండి వచ్చిన డబ్బును మాత్రమే డిపాజిట్ చేయ గలుగుతారు . మిగిలిన పెద్ద నోట్లన్నీ నల్ల ధనమన్నట్లే కదా . అవినీతి సొమ్ము అన్నట్లే కదా .
"125 కోట్ల ప్రజలకు చెందాల్సిన దేశ సంపద, కేవలం కొంత మంది అనుభవించడం ధర్మం కాదు " ( WHEN THE WEALTH OF 125 CRORE PEOPLE, ENJOYED BY FEW PEOPLE IS NOT JUSTIFUL").
ప్రతి ఒక్కరికీ రెండే చేతులుంటాయి , రెండే కాళ్ళుంటాయి . రెండే చెవులు , రెండే కళ్ళు , ఒకటే ముక్కు , ఒకటే నోరు , ఒకటే మెదడు ఉంటాయి . అందరూ వచ్చింది ఒక దగ్గరినుండే , పోయిది ఒక దగ్గరికే . వచ్చే టపుడు ఏమి తీసుక రారు , పోయేటప్పుడు ఏమీ తీసుక పోరు . అందరూ రోజుకు 8 నుండి 12 గంటలే పని చేస్తారు . అలాంటప్పుడు , కొందరికే ఇంత డబ్బు ఎలా సమకూరుతున్నది . వ్యవస్థల్లో ఎక్కడో బ్లాక్ హోల్స్ ఉన్నయి . వాటిని మూసి వేయాలి .
" నీరు  శంకు  నుండి వస్తేనే  తీర్థం  అవుతుంది" . సామాన్యులనుండి  ఏది వచ్చినా  దానికి విలువ ఉండదు .
  
www.sollutions2all.blogspot.com
www.sollutions2all.blogspot.com
No comments:
Post a Comment