Saturday, January 25, 2025

బొబ్బిలి యుద్ధం

అంశం: బొబ్బిలి యుద్ధం


శీర్షిక: *బొబ్బిలి యుద్ధం *

విజయనగర రాజు
విజయరామ గణపతి రాజు అంటే
బొబ్బిలి రాజు గోపాల కృష్ణ రంగారావుకు
వల్ల మాలిన ప్రేమ, అభిమానం
ప్రతి ఉత్సవంలో కలిసి మెలిసి ఉండేవారు
ఆనందంగా గడిపే వారు
రాజులు కవులను పోషించే వారు
అప్పుడప్పుడు బొబ్బిలిలో కుస్తీ పోటీలు
జరిగేవి
బొబ్బిలి తాండ్ర పాపారాయుడే నెగ్గేవాడు
కోడి పందాలు జరిగేవి,బొబ్బిలి వారే నెగ్గేవారు

కాలం గడుస్తున్న కొలదీ
గ్రహాలు మారుతే గృహాలు తారుమారవుతాయి
అన్నట్లు
వరుస విజయాలతో, అహాలు పెరుగుతే,
లోకం అల్లకల్లోలం అవుతుందంటారు
అది నిజమే కాబోలు
పౌరుషం బొబ్బిలి గడ్డపై పుట్టిన
ప్రతి పౌరుడికి ఉగ్గుపాలతో పెట్టిన విద్య
*పౌరుషాల అడ్డ, బొబ్బిలి గడ్డ*
బొబ్బిలి రాజు డామినేషన్, ఆగడాలు
జల పంపకాలపై, పంటలపై , సంస్థానాలాపై
రాచరికం పై పెరిగి పోయే

ఎంతగా అంటే ఇద్దరి  మధ్య
*పచ్చ గడ్డి వేస్తే భగ్గున మండే అంతగా*
అంతా కాల మహిమ

అదే సమయంలో,ఫ్రెంచ్ లెఫ్టినెంట్ గవర్నర్
కప్పం కట్టాలని వత్తిడి తెస్తాడు
అసలే పౌరుషాల గడ్డ, బొబ్బిలి రాజు పీడ
వదిలించుకోవాలనుకుంటారు
విజయ నగర రాజు!

తన సైన్యంతో బొబ్బిలి రాజును
ఎదిరించడం అసాధ్యమని తలచి
తన పలుకుబడితో, సైన్యాన్ని పంపమని
ఫ్రెంచ్ గవర్నర్ బుస్సీ సహాయం కోరుతాడు

అది పదిహేడు వందల యాభై ఏడు
జనవరి ఇరువది నాలుగు

ఫ్రెంచ్ సైన్యంతో, విజయనగర సైన్యం
బొబ్బిలి సైన్యంపై విరుచుకు పడుతారు
బొబ్బిలి కోట నేలమట్టం అవుతుంది
బొబ్బిలి రాజు వీర మరణం చెందుతారు!

తెల్లదొరల , విజయనగర సైన్యంతో
కుట్రలు కుతంత్రాలతో బొబ్బిలి సైన్యంతో
హోరీ హోరీ పోరు
దురాక్రమణ దారుల వణికించి
పరాక్రమం చూపిన వీర విక్రమ సింహం
సర్ధార్ పాపారాయుడు

శత్రు సైన్యాన్ని హతమార్చగ
ప్రతి పౌరుడు వీరోచిత పోరాటం చేసిరి
యుద్ధంలో బొబ్బిలి రాజా హతమాయే
ప్రజలు కుటింబీకులు అగ్నికి ఆహుతి
ఫిరంగులతో బొబ్బిలి కోట నేలమట్టం 

విజయం సాధించాననుకున్న
విజయనగర రాజుకు మిగిలింది
సర్వ సైనికుల శవాల గుట్టలే

చివరికి ఉభయ సంస్థానాల రాజులు
సైనికులు,ప్రజలు,కుటుంబీకులుహతమవగ
మిగిలింది, బొబ్బిలి వీర మరణం చెందిన
సైనికుల స్థూపం ,
పోరాట యోధుల సాక్షిగా !

      

No comments: