అంశం: చిత్ర కవిత (చరవాణితో పిల్లవాడు)
శీర్శిక: *అమ్మా నాన్నలే ప్రేరణ*
పంజరంలో చిలుకలా
అడవిలో ఒంటరి పక్షిలా
అక్వేరియంలో బంధించిన చేప పిల్లలా
నేటి తరం పిల్లలు తెగిన గాలిపటంలా!
గ్లోబలైజేషన్ పుణ్యమా అనీ
ప్రపంచమే కుగ్రామమాయే
ఇంటర్నెట్ విస్తరించే జగమంతా
వైఫై చౌక ధరలకే లభిస్తుండుటంతో
చరవాణుల మోజులో పడి నేటి తరం పిల్లలు!
తరం మారుతుంది
వణికిపోతున్నారు జనం
మనిషి కోరుకుంటున్నాడు ఒంటరితనం
తల్లిదండ్రులలో పెరుగుతుంది భయం
మారకుంటే జీవితాలు ఇక అయోమయం !
పక్షుల వలే పంజరంలో కూర్చొని
చెవులకు హెడ్ ఫోన్స్ పెట్టుకుని పిల్లలు
పాటలు వినుకుంటూ, గేములాడుకుంటే
ఆనందంతో ఊగుతూ ఉక్కిరిబిక్కిరవుతుంటే
జంట పక్షులు చూస్తూ చూస్తూ విస్తు పోతుండే!
చిన్నారులు తిండీ తిప్పలు మరిచిరి
చదువు సంస్కారాలు ప్రక్కన పెట్టిరి
*అమ్మా నాన్నలే ప్రేరణవుతుండిరి*
పిల్లల భవిష్యత్తును పాడు చేస్తుండిరి!
No comments:
Post a Comment