అంశం: *కవి*
శీర్షిక: *కవులు - సవ్యసాచులు*కవి ఒక తెరిచిన పుస్తకం
ధవళ వస్త్రంలా స్వచ్ఛం
ధీనుల పాలిట దైవం
అక్షరాలను ఆయుధంగా చేసుకుని
అదరక బెదరక నిర్భయంగా వ్రాయగల సాహాసి
ఏ ప్రక్రియలలో నైనా ఆవిష్కరించ గల జ్ఞాని
సమస్యలపై , సంఘటనలపై తక్షణమే
స్పందించే సున్నిత మనస్కుడు
స్వంత పనులను కొంత మానుకుని
ప్రజల చైతన్యానికి కృషి సల్పే కృషీవలుడు
సమస్యలపై , వ్యవస్థలపై, కాల పరిస్థితులపై
సంపూర్ణ అవగాహన కలిగి అస్త్ర శస్త్రాలను
సంధించు సవ్యసాచి
అందుకే అంటారు,
*రవి గాంచని చోటు , కవి గాంచునని*
*కత్తి పట్టిన కసాయి కన్నా, కలం పట్టిన*
*కవియే గొప్ప వాడనీ*
కవులు సమాజంలోని లోటు పాట్లను
ప్రజా సమస్యలైన విద్య, వైద్యం ,
కూడూ, గుడ్డా, నేరాలు, ఘోరాలు
కరోనా సమస్య అయినా, కార్గిల్ యుద్దమైనా
మహా కుంభమేళయినా,
ఏ మూలన జరిగినా ఎక్కుపెట్టు శర వేగాన
సమాజంలోని అవినీతి, కుల్లు కుతంత్రాలను
తూర్పర బట్టే ధీరోదత్తులు
కుటిల రాజకీయాలను ఎండగట్టు
నిప్పు కణికలు
కుల మత భాష ప్రాంతాలకు అతీతులు
కవి సమ్మేళనాలను ఏర్పాటు చేస్తూ
ప్రసంగాలు చేస్తూ, నూతన కవులను
ఆలోచింప జేస్తూ
ప్రజలలో చైతన్యం తీసుకొచ్చే కవన శిల్పులు
కవితలు, పద్యాలు, వ్యాసాలు
పుస్తకాలు, గ్రంధాలను వెలువరించి
చరిత్రలో స్థిర స్థాయిగా నిలిచి పోతారు
సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్ళి
నవ సమాజ నిర్మాణానికి తోడ్పడుతారు
కవులు ఏ ప్రభుత్వ ఉద్యోగులయినా కాకున్నా
ఎవరికీ తలొగ్గరు , ఏ ప్రలోభాలకు లొంగరు
కవులు ఏ పార్టీకి చెందిన వారు కాదు
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు
ప్రజల పక్షాన నిలిచే రథ సారధులు
గుర్రం జాషువా అంటారు,
*రాజు మరణిస్తే శిలా విగ్రహాలలో*
*కవి మరణిస్తే ప్రజల నాలుకలలో*
*నిలుస్తాడు* అని
నేడు వ్యవస్థలు సజావుగా ఉన్నాయంటే
అందుకు కారణం నాటి నేటి మేటి కవులేనని
గొప్పగా చెప్పడంలో అతిశయోక్తి లేదు
నన్నయ తిక్కన ఎర్రన పోతన, వేమన
సోమనాధుడు, గిడుగు రామమూర్తి,
జాషువా,శ్రీ శ్రీ, కాళోజీ, దాశరధీ, సినారె,
సిధారెడ్డి మొ.న ఎంతోమంది కవులు
కవులలోనూ అనేక రకాలుగా ఉన్నారు:
జంట కవులు, శివ కవులు, ప్రబంధ కవులు
పద్య కవులు, శతక కవులు, జాతీయోద్యమ
కవులు, భావ కవులు, దిగంబర కవులు
అభ్యుదయ కవులు ,విప్లవ కవలు!
No comments:
Post a Comment