Tuesday, February 25, 2025

సరోజినీ నాయుడు

అంశం: సరోజినీ నాయుడు


శీర్శిక: *నైటింగేల్ ఆఫ్ ఇండియా*

తెలుగు నేలపై విరిసిన సిరిమల్లె
తెలుగునేల తెలంగాణ ముద్దుబిడ్డ
భవ్య భారతీయ  *గాన కోకిల*
అఘోరనాధ్ వరద సుందరి మానస పుత్రిక
సరోజినీ నాయుడు ఛటోపాధ్యాయ

పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న చందాన
మెట్రిక్యులేషన్ పరీక్షలోనే  ప్రతిభ కనబరిచి
ప్రశంసలనందుకున్న మహిమాన్వితురాలు
గొప్ప ధైర్యవంతురాలు, సాహాసవంతురాలు
మహా ప్రతిభావంతురాలు , జ్ఞాని
పట్టు వీడని విక్రమార్కులు సరోజినీ
చిరు ప్రాయంలోనే పదమూడు వందల
పంక్తుల కవిత వ్రాసి కవియిత్రిగా పేరుగాంచే

సరోజినీ మొదటి కవిత్వం "గోల్డెన్ త్రెషోల్డ్"
దీని ద్వారా  *నైటింగేల్ ఆఫ్ ఇండియా* గా
ఖ్యాతి గడించె, దేశానికి కీర్తిప్రతిష్టలు తెచ్చే
"ది బర్డ్ ఆఫ్ టైం", "ది బ్రోకెన్ వింగ్"  వంటి
మరెన్నో గ్రంధాలను వెలువరించిఘనతకెక్కె

తన పందొమ్మిది యేళ్ళ వయసులోనే
తెలుగింటి గోవింద రాజులు నాయుడి గారిని
కులాంతర వివాహం చేసుకుని
నాడు ఎందరికో ఆదర్శంగానిలిచిన ధీర వనిత

ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని గాంధీజీ మెప్పు
పొందిన స్వాతంత్ర్య సమరయోధురాలు
బ్రిటిష్ పాలకులను గడగడ లాడించిన
వీర వనిత సరోజినీ నాయుడు ఛటోపాధ్యాయ

విదేశాల్లో విద్యాభ్యాసం చేసినా
మాతృదేశంపై మమకారంతో
దేశానికి తిరిగి వచ్చి స్వాతంత్ర్య సమరంలో
విస్త్రుతంగా పాల్గొన్న దేశభక్తురాలు సరోజినీ

సరోజినీ దేవి గొప్ప కవి, రచయిత, గ్రంధకర్త
వక్త, సంఘ సంస్కర్త, సేవాపరురాలు
దయార్ధ హృదయురాలు, దానకర్ణులు,
తెలుగింటి ఆడపడుచు,
భారత దేశ ఆశ జ్యోతి, ఆదర్శమూర్తి!



No comments: