Saturday, February 22, 2025

పుల్వామా దాడి

అంశం:పుల్వామా దాడి

శీర్శిక: *తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదురువు*

అది ఒక పీడ కల
దేశంపై జరిగిన కుట్ర
పిరికి వాండ్ల వికృత చేష్ట
భారత దేశం పై చెరగని మచ్చ
భారతీయ వీర సైనికులకు ఒక గట్టి పరీక్ష !

సరిగ్గా అది ఫిబ్రవరి పదునాలుగు
రెండువేల పందొమ్మిదివ సంవత్సరం
భారత దేశ శిరస్సైన కాశ్మీర్
నుదుట సిందూరంమైన లేథిపురాలో
ఒక్కసారే బాంబు పేలిన చప్పుడు!

ఏమైందో తెలుసుకునే లోపే
కారు బాంబుతో ఆత్మాహుతి దాడి
నలుబది మంది సిఆర్పిఎఫ్ సైనికులు
ఒక ఉగ్రవాది "అదిల్ అహ్మద్ దార్" దుర్మరణం
ముప్పది ఐదు మంది క్షతగాత్రులయ్యారు
వీర సైనికుల శరీర భాగాలు రోడ్డంతటా
చెల్లాచెదురుగా పడ్డాయి, రుధిరం యేరులై పారింది
పాకిస్థాన్ లోని, ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ
*జైస్-ఎ- అహమ్మద్*
తామే ఈ పని చేశామని ప్రకటించుకుంది!

నిజంగా, అది ఒక హీనమైన చర్య
సైనికుల ధైర్యాన్ని బలహినం చేసే కుట్ర
అభం శుభం ఎరుగని ఆ సైనికుల
కుటుంభాల మాతృమూర్తుల, పిల్లల
దుఃఖాలను ఎవరు ఓదార్చ గలరు
ఏమిచ్చి వారి ఋణం తీర్చుకోగలం!

*తాటాకు చప్పుల్లకు కుందేళ్ళు బెదరవు*
*జైస్ ఎ అహమ్మద్* దొంగ చాటు దెబ్బలకు
బలహీనుల బాంబు పేలుళ్ల కుట్రలకు
అఖండ భారత దేశం వణకదు బెదరదు
దేశ భక్తి గల, ఐక్యత భారత సైనికులను
భారతీయ ప్రజలను ఏ పిరికి చర్యలు
లక్ష యేండ్లైనా విడదీయ లేవు
తస్మాత్ జాగ్రత్త!

No comments: