Saturday, May 24, 2025

పర్యావరణ గీతాలు

అంశం: పర్యావరణ గీతాలు 


శీర్షిక:తరువులు పెంచాలి చెరువులు నింపాలీ

పల్లవి:
మానవా... ఇది నీకు ధర్మమా...
ఆధునికతంటూ... అభివృద్ధి అంటూ..
పర్యావరణంతోనే పరిహాసమా.....   "మానవా"

చరణం:01
నీటి కొరత నీకు ఎరుక...
నీటి అవసరం నీకు తెలుసు..
నీటిలో చెత్తాచెదారం వేస్తూ..
నీటిని కలుషితం చేయడం ధర్మమా.... "మానవా"

చరణం:02
స్వచ్ఛ గాలిని పీల్చకుండా..
అర నిమిషం జీవించలేమూ...
పెట్రోల్ డీజిల్ ఇంధనాలు మండిస్తూ..
యుద్దాలంటూ బాంబులు వేస్తూ..
వాయు కాలుష్యం చేయడం ధర్మమా... "మానవా"

చరణం:03
నల్లబంగారం అంటూ బావులు త్రవ్వుతూ
నిర్మాణాలంటూ నదులలో ఇసుకతోడుతూ
పరీక్షలంంటూ అణుబాంబులు వేస్తూ
భూమాతను చిధ్రం చేస్తున్నారు.       "మానవా"

చరణం:04
తరువులు పెంచాలి చెరువులు నింపాలీ
ప్లాస్టిక్ వస్తువులు వాడటం ఆపేయాలీ
నడిచి ప్రయాణించాలీ సైకిల్లపై వెళ్ళాలీ
పర్యావరణాన్ని పరిరక్షించాలీ      "మానవా"

No comments: