*నేటి అంశం*నగరాలు కాంక్రీట్ జంగిల్లు*
శీర్షిక: అభివృద్ధి వికేంద్రీకరణ జరుగాలి
*మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అన్నట్లు*
స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుండి
భూమి ఒక ఇంచు పెరుగ లేదు
కానీ జనాభా మూడు రెట్లు పెరిగింది!
పల్లె సీమలలో అక్షరాస్యత పెరిగింది
పనులు లేక నిరుద్యోగం పెరిగింది
వసతులు ఆదాయ వనరులు మృగ్యం
పెద్ద చదవుల కళాశాలలు శూన్యం!
చదువులకని పిల్లలు
ఉద్యోగాలకనీ యువతీయువకులు
రెక్కడుతే గానీ డొక్కాడని జనులు
ఉపాధికనీ పట్టణాలకు ఎగబ్రాకుతుంటే
పట్టణాలు కాంక్రీటు జంగిల్లు గాక
మరేమి అవుతాయి
మనుషులది యాంత్రిక జీవితం గాక
మరేమి అవుతుంది?
తక్షణమే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగాలి
పల్లెలలో రోడ్డు రవాణా సౌకర్యాలు
విద్యా వసతులు ఆరోగ్య సౌకర్యాలు
ఇంటర్నెట్ సౌకర్యాలు
వినోదం విహార సౌకర్యాలు కల్పించాలి
కంపెనీలను స్థాపించి ఉద్యోగ అవకాశాలు
కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి!
No comments:
Post a Comment