అంశం: ప్రజా స్వామ్య ప్రతిధ్వని
శీర్శిక: *ప్రతి ఐదేళ్లకు ఒకసారి రాష్ట్రపతి పాలన*
*విధించాలి*
*పైన పటారం లోన లొటారం* అన్నట్లుగా
పేరుకే ప్రజాస్వామ్యం లోన అంతా నేతల స్వామ్యమే!
ఆదర్శమైన ప్రజాస్వామ్య దేశం భారతదేశం
ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం గల దేశం
జనాభాలో రెండవ అతి పెద్ద దేశం
సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు అద్దం!
భిన్నత్వంలో ఏకత్వంలా
విభిన్న మతాలు అనేక కులాలు భాషలు
ఎన్నోరకాల సంస్కృతి సాంప్రదాయాలతో
కలిసి మెలసి అన్యోన్యంగా జీవిస్తారు!
నేడు భారత దేశంలో ప్రజాస్వామ్యం
రోజు రోజుకు అపహాస్యం పాలవుతుంది
అప్రజాస్వామ్యం చాపకింద నీరులా
క్రమ క్రమేణా దేశమంతా విస్తరిస్తుంది!
లౌకిక రాజ్యమైన ప్రజాస్వామ్య దేశంలో
రాజ్యాంగ వ్యవస్థలు చట్టాలు ఉన్నాయి
రక్షక భటుల యంత్రాంగం ఉంది
కానీ, చట్టాలు ధనవంతుల చుట్టాలుగా
రక్షక భటులు నేతలకు రక్షకులుగా మారారు
*నేడు దుడ్టున్నోడిదే బర్రె*
*ధనం ఉన్నోడిదే మంచి గుణం* అవుతుంది!
రాజ్యాంగంలో అన్ని మతాలు కులాలు
అందరూ సమానమే అయినా
వాస్తవంలో మతాలను కులాలను బట్టి
ఓటు బ్యాంకు రాజకీయాలతో
భూస్వాములైననూ భూకబ్జా దారులైనా
పన్నుల మినహాయింపులు రైతు బంధు పధకాలు
ధనికులైనా సంక్షేమ పథకాలు రిజర్వేషన్లు!
ప్రశ్నించే స్వేచ్ఛ ఓటు వేసే స్వేచ్ఛ లేదు
పనిచేసే స్వేచ్ఛ జీవించే స్వేచ్ఛ లేదు!
అందుకే
ధనవంతులు మరింతగా ధనవంతులుగాను
పేద వారు మరింత పేదలవుతున్నారు
ఉచితాలను ఆశించకుండా
యువతలో ప్రశ్నించే శక్తి పెరుగుతే
ప్రజాస్వామ్యానికి పునరుజ్జీవనం జరుగుతుంది
*ప్రతి ఐదేళ్లకు ఒకసారి రాష్ట్రపతి పాలన*
*రాష్ట్రాలలో దేశంలో విధిస్తే*
దేశంలో అవినీతి పాలన అంతం అవుతుంది
No comments:
Post a Comment