Monday, June 30, 2025

ద్వంద్వ వైఖరి

అంశం: శాంతి శంఖం


శీర్శిక: *ద్వంద్వ వైఖరి*

భారత దేశం చతర్వేదాలకు పురాణాలకు
రామాయణం మహాభారతం వంటి
ఇతిహాసాలకు పుట్టినిల్లు!

ఋషులు మునులు జన్మించిన పుణ్యస్థలం
శ్రీ రాముడు కృష్ణుడు దేవతా స్వరూపులు
బుద్దుడు అశోక చక్రవర్తి రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద మహాత్మాగాంధీ వంటి
మహా నీయులు జన్మించిన పవిత్ర దేశం!

*భారత దేశం శాంతి కాముక దేశం*
భారతీయుల నరనరాల్లో ప్రసరిస్తున్న రుధిరం
శాంతి సౌభ్రాతృత్వం కోరుకునేదే
మహాత్మాగాంధీ సత్యాగ్రహాల ద్వారానే
దేశానికి స్వాతంత్య్రం వచ్చినదన్న విషయం
మరువరాదు

*చెప్పేటివి నీతులు సొచ్చేవి మరుగుదొడ్లు*
అన్నట్లు
నేడు కొన్ని దేశాలు శాంతి జపం చేస్తూనే
స్వార్ధంతో  యుద్ధ కాంక్షతో  వ్యాపారం దృష్ట్యా
ఉనికి కోసం ఎదుటి దేశాలను నామరూపాలు
లేకుండా చేస్తున్నాయి
సైనిక జననష్టం సంపదలను బూడిద చేస్తూ
ప్రకృతిని నాషణం చేస్తూ పర్యావరణాన్ని
కలుషితం చేస్తూ మేక పోతు గాంభీర్యంలా
*ద్వంద్వ వైఖరి* తో నటీస్తున్నాయి!

ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఒక దేశం
యుద్దాలను రెచ్చగొడుతూ ఆయుదాలు
పంపిస్తూ వ్యాపారం చేస్తూ, నేనే యుద్ధాన్ని
ఆపివేశాను నా వల్లనే శాంతి ఏర్పడిందని
*నోబుల్ శాంతి బహుమతి*  కొరకు
పోటీ పడుతున్నారు
అందుకు కొన్ని దేశాలకు ప్రయోజనాలను
చేకూరుస్తున్నారు

భారత దేశం అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ
శాంతి కాముక దేశం
భారత దేశం లౌకిక ప్రజాస్వామ్య దేశమే అయినా
నీతికి నిజాయితీకి కట్టుబడి ఉంటుంది
కానీ ద్వంద్వ వైఖరి ఉండదు
శాంతి శంఖారావమే భారతదేశ ప్రధమ ధ్యేయం!
 

No comments: