Monday, June 2, 2025

నేటి విద్యా విధానం

అంశం: ప్రతిస్పందన - తప్పెవరిది, శిక్ష ఎవరికి?

నేటి విద్యా విధానం ఎలా ఉంది?


శీర్షిక: బాధ్యత గల అధికారులను కఠినంగా శిక్షించాలి

సూర్యుడు తూర్పున ఉదయం ఉదయించడానికి...
సాయంత్రం పడమర హస్తమించడానికి కారణం ఉంటుంది...
పగలు రాత్రి ఏర్పడడానికి కారణం ఉంటుంది...
అది భూభ్రమణం భూపరిభ్రమణం గ్రహాల కదలిక..

అలానే మార్కుల తప్పిదాల విషయంలోనూ..
అనేక కారణాలు ఉంటాయి అవి కొన్ని
మానవ తప్పిదాలు కావచ్చు...
మరికొన్ని యాంత్రిక తప్పిదాలు కావచ్చు...
శిక్ష పడేది విద్యార్ధులకు విద్యార్థుల తల్లిదండ్రులకు...

ఆ శిక్షలు ఒక్కోసారి బాధ పడేవి కావచ్చు...
ఓ సంవత్సర కాలం సమయం వృధా కావచ్చు...
ఆర్ధికంగా అతిగా నష్ట పోవాల్సి రావచ్చు...
మరో సారి ఆత్మ హత్యలకు దారి తీయవచ్చు...

పొరపాట్లు అనేది సహజం ఎవరికైనను..
అవి మానవ పొరపాట్లయినా  కావచ్చు...
యాంత్రిక పొరపాట్లైనా కావచ్చు....
తక్షణం సరిచేసుకుని విద్యార్థులు నష్టపోకుండా చూడటం ఆవశ్యకం...

ఎక్కువ శాతం పొరపాట్లకు కారణం మనిషి స్వార్థం...
డబ్బుకో మరోదానికో కక్కుర్తి పడి సిండికేట్ గా మారి..
తమ అనుయాయులకు మంచి ర్యాంకులు రావడానికి ప్రయత్నించడం...
డబ్బులు ఇచ్చిన వారికి అధిక మార్కులు వచ్చేట్లు చూడటం..
జవాబు పత్రాలను తారు మారు చేయడం...
లేదా వారిని ప్రత్యేక రూములో కూర్చోబెట్టి వ్రాయించడం..
కావాల్సిన వారికి ముందుగానే ప్రశ్న పత్రాలు లీక్ చేయడం...

విద్యార్థులకు శిక్ష పడకుండా ఉండాలంటే...
బాధ్యత గల అధికారులను పరీక్షల బోర్డులో నియమించాలి..
రెండు మూడు ప్రశ్న పత్రాల సెట్లను సిద్ధం చేయించాలి..
ఏ ప్రశ్న పత్రాలు ఇస్తున్నారో ఒకరిద్దరికే తెలిసి ఉండాలి...
ఓట్ల లెక్కింపు లాగానే జవాబు పత్రాలను ఒకచోట భద్రపరుచాలి...
అక్కడే వాల్యుయేషన్ చేసి అక్కడే రిజల్ట్స్ ప్రకటించాలి...
అప్పటికీ తప్పులు జరుగుతే బాధ్యత గల అధికారులను కఠినంగా శిక్షించాలి.... 

No comments: