అంశం: జై జగన్నాధ
శీర్శిక: పూరీ జగన్నాథ్ రథ యాత్ర
భారత దేశం సంస్కృతి సాంప్రదాయాలకు
చతుర్వేదాలకు రామాయణ మహాభారత
భాగవతం ఇతిహాసాలకు పురాణాలకు
సనాతన ధర్మాలకు సృష్టి లోని చతుష్షష్టి
కళలకు పుట్టినిల్లు!
గుడులకు గోపురాలకు పుణ్యక్షేత్రాలకు
నదులు సముద్రాలు జలపాతాలకు
ప్రకృతి సంపదలకు సకల మతాలకు
నిలయం భారత దేశం!
ఒడిస్సా రాష్ట్రంలోని పూరీ పట్టణంలో
నెలకొన్న జగన్నాథ్ పుణ్యక్షేత్రం
ఎంతో పవిత్రమైనది శ్రేష్టమైనదని
భక్తుల ప్రగాఢ విశ్వాసం నమ్మకం!
కృష్ణుడు బలరాముడు చెల్లెలు సుభద్ర
దేవతా మూర్తులను నాటి మహా రాజు
ప్రతిష్టించిన దివ్య క్షేత్రం జగన్నాథ్ పుణ్యక్షేత్రం
నేటికీ కనుల పండుగగా కళకళ లాడుతుంది!
ప్రతి యేటా ఆషాఢమాసం శుక్ల విదియ రోజున
జగన్నాథ్ రథ యాత్ర జరుగుతూ ఉంటుంది
కోట్లాది మంది భక్త జనం *మనిమా...*
*జగన్నాధా..* అంటూ నినాదాలు చేస్తూ
జగన్నాథ రథ చక్ర త్రాడులను లాగుతూ
ఘణంగా ఉత్సవాలను నిర్వహిస్తారు
దేశవిదేశాల నుండి కోట్లాది భక్తులు పాల్గొంటారు!
No comments:
Post a Comment