అంశం: గమ్యం తెలియని పయనం
**********************శీర్షిక: గమ్యం తెలియని నలమహారాజు
ప్రక్రియ: వచన కవిత
**********************
తీరం తెలియని ఎగిసిపడే సముద్రం అలల వలెను..
ఓడ లంగరుకు తెలియని తీరం వలెను...
గాలికి దారం తెగిపడిన రంగుల పతంగి వలెను...
పద్మవ్యూహం నుండి బయటకు రాలేని అభిమన్యుడి వలెను..
మనిషి గమ్యం తెలియని పయనం నెరవేరదు లక్ష్యం...
ఆశయం లేకుండా ప్రణాళిక లేకుండా ఏ పని చేసినా సఫలంకాదు...
ఆశ కోరిక ఉంటే సరిపోదు అది సాధించాలనే తపన ఉండాలి...
తపన పట్టుదలతో పాటు నిరంతర సాధన ఉంటేనే విజయం...
జూదంలో ఓడి సర్వస్వం కోల్పోయిన నలమహారాజు అనారోగ్యంతో గమ్యం తెలియక....
ఏమి చేయాలో తోచక ఎటు పోవాలో తెలియక...
పిల్లల భార్యను అత్తారింటిలో విధిలేక దిగబెట్టి పయనమయ్యాడు...
ఇక భార్య నలదమయంతి నాధేశ్వరా! నేనూ నీ వెంటే వస్తా అంటూ...
నలమహారాజు ఎంత వారించినా నీవే నా సర్వస్వం అంటూ సేవలను అందిస్తుంటుంది...
గమ్యం తెలియని ప్రయాణంలో నలమహారాజు దమయంతి అనేక ఇక్కట్ల పాలవుతారు...
మండుటెండలో నడుస్తూ నీరు దొరకక ఆహారం అందక ఇబ్బందులను ఎదుర్కొంటారు..
అడవిలో తన గోచి గుడ్డ పై పక్షులకు ధాన్యాలు వేస్తే దానిని....
పక్షులు ఎత్తుకుని పోతాయి దమయంతి చూడలేక తన చీర కొంగు....
చింపి ఇచ్చి ఆదుకుంటుంది దమయంతికి కష్టాలు వలదని రాత్రి సమయాన..
భార్యను విడిచి అడవుల్లోకి వెళ్లి పోతాడు దమయంతి తల్లిగారింటికిచేరి...
నలమహారాజు కొరకు భటులను పెట్టి వెతికి తీసుకొచ్చి బాగుచేస్తారు...
No comments:
Post a Comment