అంశం:ప్రతి పందెంలో నిచ్చెన వస్తే
శీర్షిక: శ్రమలో సాంద్రత ఉండాలి
జీవితంలో నైనా పందెంలో నైనా వ్యాపారంలో ఒక్కో మెట్టు ఎక్కాలి...
అప్పుడే విజయం సిద్ధిస్తుంది దానికో విలువ గుర్తింపు ఉంటుంది...
ఏక బిగిన ఒకే సారి కోటేశ్వరుడయిపోతే పేకమేడలా
కూలడం తధ్యం...
మోసాలు అక్రమాలతో సంపాదించిన ఆస్తులు సంపదలు ఎంతో కాలం నిలువవు...
ఎప్పుడూ నిదానం ప్రధానంగా ఉండాలి ఎదుగుతూ వెళ్ళాలి...
సాధ్యమైనదే ఎంచుకున్నప్పుడు శ్రమలో సాంద్రత ఉన్నప్పుడు విజయం తప్పక వరిస్తుంది....
అలాంటి విజయం లోనే ఆత్మ సంతృప్తి ఉంటుంది...
నిచ్చెనలతో రెకమండేషన్లతో మారక ద్రవ్యాలు వాడి పోటీలో గెలిస్తే....
అది విజయం అనబడదు ఆ గుర్తింపు ఎంతో కాలం నిలువదు....
ఈ కారణంగానే ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయన్న నానుడి పుట్టింది...
గెలుపు సాధించాలంటే నిచ్చెనలు కాదు చక్కని ప్లానులు వేయాలి...
విషయంపై అవగాహన పెంచుకోవాలి అందరితో అనుకూలంగా ఉండాలి...
చక్కని నిర్ణయాలు తీసుకోవాలి నిరంతరం సాధన చేయాలి...
పనిపై దృష్టి కేంద్రీకరించాలి అప్పుడే విజయం అనుకూలిస్తుంది...
శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది అది శాశ్వతంగా నిలుస్తుంది...
No comments:
Post a Comment