*నేటి అంశం*వాక్య కవిత*
*మది లోగిలిలో తివాచీ పరిచా మరలి రావా*శీర్షిక: ప్రియా.. ఓ నా ప్రియా..
ప్రియా ..ఓ నా ప్రియా..
కలలోనూ నీ రూపమే..
ఇలలోనూ నీ రూపమే..
ఎటు చూసిన నీ ద్యాసనే..
నా కలల ఆశవు నీవేగా...
ఆకాశంలో వయ్యారంగా విహరిస్తావు..
విరహ బాధ తాళలేక నేనున్నాను...
నింగి లోన నీవు నీటి లోన నేనూ..
కలువ లేక నేనున్నా కనికరం నీకు లేదా...
తళతళ మెరుస్తూ కనువిందు చేస్తావు..
ఆశలన్నో రేకెత్తిస్తుంటావు...
కనుమరుగై పోతుంటావు..
కనులార చూసినా తనివి తీరకున్నది...
కమ్మని ఊసులెన్నో చెప్పాలని ఉందీ..
నీ ఎదలపై కడదాకా ఒదిగి పోవాలని ఉందీ...
నా గుండెలోని అమృతాన్ని పంచాలని ఉందీ?..
నీ కోసమే నేనున్నా....
నా కోసమే నీ వనుకున్నా...
కదిలిరా నా ప్రియా... ఇంకను జాగు ఏలరా...
నేల పైకి కదలిరా నా ప్రియా..
*మది లోగిలిలో తివాచి పరిచా మరలి రావా..*
*కలువ* లోన ఒదిగి పోవా..!
నిండు పున్నమి రోజున...పండు వెన్నెలలా..
మామలా ... చందమామలా..!
No comments:
Post a Comment