అంశం: లలిత గేయాలు
శీర్షిక: విరహ వేదన
పల్లవి:
ఓ.... రాధా... రావా.....
నా ...సేద తీర్చ రావా...
మనసు లేక నీవున్నా...
మరువ లేక నేనున్నా...
మమత లేక నీవున్నా...
సమత నిండి నేనున్నా.... "ఓ రాధా.."
చరణం:01
ఊసులెన్నో చెప్పావు...
ఆశలెన్నో పెంచావు....
కాసులు కంట చూడగానే...
బాసలన్నీ మర్చి పోయావు..... "ఓ రాధా.."
చరణం:02
ఆస్తులేమైనా శాశ్వతమా....
అందమేమైనా శాశ్వతమా...
ఆయుష్షేమైనా శాశ్వతమా...
శాశ్వతం కాని వాటి గురించి
తాపత్రయం దేనికీ.... "ఓ రాధా.."
చరణం:03
కలసి తిరిగిన జ్ఞాపకాలు
చెదిరి పోవుననీ తెలియదా...
కలలు గన్న మధుర స్వప్నాలు
అమూల్యమైనవనీ తెలియదా ..... "ఓ.. రాధా.."
చరణం:04
వెచ్చని సూర్య వెలుగులను
చల్లని వెన్నెల రాత్రులును కాలరాచీ...
ఓ విషపు చుక్కను రాల్చిపో...
నేను అమృతంగా సేవిస్తా..... "ఓ .. రాధా.."
No comments:
Post a Comment