అంశం: *ఎండి పోయిన భూమి - పొంగిపొర్లే ఆశలు*
శీర్శిక: *జై జవాన్ జై కిసాన్*
బంజరు భూములైనా బీడు భూములైనా
అవి నీరు లేక ఎండి పోయినా
రైతులలో ఆశలు పొంగి పొర్లుతూనే ఉంటాయి
ఆకాశం వైపు కళ్ళు చూస్తూనే ఉంటాయి!
ఆరుద్ర కార్తెలో వర్షాలు పడక పోయినా
మృగశిర కార్తెలో నైనా పడక పోతాయాఅని
కళ్ళళ్ళో వత్తులు పెట్టుకుని చూస్తుంటారు
ఎందుకంటే రైతులకు వ్యవసాయమే కదా
ప్రధాన మైన ఆదాయ వనరు !
వ్యవసాయ పంటలకు మూలాధారం నీరు
నీటికి ప్రధాన ఆధారం వర్షాలు
సకాలంలో వర్షాలు పడుతేనే హాలికుడు
హలాన్ని పట్టి పొలాన్ని దున్ని విత్తనాలు చల్లి
పంటలు పండించగలడు
వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతులు
భూములు ఎండుతున్నా నెర్రెలు బాస్తున్నా
పొంగి పొర్లుతున్న ఆశలతో
రేపైన మాపైనా వర్షం పడకపోతుందా అని
ఆకాశం వైపు ఎదురు చూస్తూనే ఉంటారు!
చెరువులలోని నీటి కొరకు
బావులు కాలువలలోని నీటి కొరకు
విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు
ఫలించే వరకు ఆశతోనే జీవిస్తారు!
అతివృష్టి అనావృష్టి వలన
రేయింబవళ్ళు రైతుల కష్టాలు చెప్పలేనివి
రైతుల చేతిలోకి డబ్బు వచ్చే వరకు
సుమారుగా ఎనిమిది నెలలు
కోటి ఆశలతో ఎదిరిచూస్తూనే ఉంటారు!
భూమినే నమ్ముకున్న రైతుకు
భూమికి ఎంత సహనమో రైతుకు అంతే సహనం
అన్నదాతా సుఖీభవ
అందుకే అన్నారు లాల్ బహదూర్ శాస్త్రి
*జై జవాన్ జై కిసాన్* అని
No comments:
Post a Comment