Saturday, April 26, 2025

1వెండి కొండలలో రక్తపుటేరులు

శీర్షిక: వెండి కొండలలో రక్తపుటేరులు

వారు కల్మషం లేని పసి మనసులు
కల్లా కపటం ఎరుగని పసిడి హృదయాలు
ఎన్నో ఆశలతో ఎన్నెన్నో ఊహలతో
కలిసి వెళ్ళారు యాత్రికులతో విహారయాత్రకు

వెండి కొండలను దర్శించాలనీ
చల్లని లోయలలో సేద తీరాలనీ
కాళ్ళ పారాణి ఆరని ఒక నూతన జంట
బయలుదేరారు ఆడుతూ పాడుతూ 
ఉల్లాసంగా ఉత్సాహంగా విహార యాత్రకు!

*ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరూ*
అని ఓ సినీ కవి అన్నట్లుగానే
కాశ్మీర్ లో అనంతనాగ్ జిల్లా పహల్గాం
ప్రదేశం ఒక మినీ స్విట్జర్లాండ్ లోయలో
ముష్కర మూకలు ఉన్మాద రక్కసులు
విరుచుకుపడ్డారు విహార యాత్రికులపై!

వరుసగా నిలబెట్టారు అందరినీ
పేరు అడుగలేదు భాష అడుగలేదు
కులం కాదు ప్రాంతం కాదు ఉన్మాదులకు
హిందువైతే చాలు పంతం నెగ్గించుకోడానికి!

అలా ఒక్కొక్కరి పురుషుల ప్యాంట్లూడదీసి
నిర్ధారించుకుని మోకాళ్ళమీద కూర్చోబెట్టి
ఇరువది ఏడు మందిని పిట్టలను కాల్చినట్లు కాల్చారు ఉగ్ర మూకలు

వెండి కొండలు వణికి పోయాయి రక్తపుటేరులతో
కాశ్మీర్ తల్ల డిల్లింది రక్తపు ధారలతో!

చంప వద్దని వేడుకున్నా కనుకరించలేదు
*నన్నుకూడా చంపండని వేడుకుంటే*
*నిన్ను చంపం, మోడీకి చెప్పుకో మనిరి*
ఏమిటీ వీరి ధైర్యం? ఎవరు వీరి వెనుక బలం?
హెచ్చరిస్తున్నారా?  రెచ్చగొడుతున్నారా?

మంచుకొండలుకావవి రక్తసిక్తమైన ప్రదేశాలు
ఒక్కటొక్కటిగా ఇంటికి చేరుతున్నాయి
చేయని తప్పుకు మాయని మచ్చలుగా
మహిళలల నుదుటీ సింధూరం చెరిపి వేసిరి
తల్లిదండ్రులు భార్యా పిల్లలు అనాధలయిరి!

విహారయాత్రకు వెళ్ళడం శాపమా?
హిందువుగా పుట్టడమే పాపమా ?
ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలి
భారతీయులలో రక్తం ఉడికి పోవాలి
ఉగ్రవాదంపై ఉక్కు పిడికిలి బిగించాలి!

No comments: