Monday, April 28, 2025

అదొక భూతల స్వర్గం

అంశం:*సువర్ణ వంగాతలం*

శీర్శిక: *నేడు దేశానికి గుది బండ పశ్చిమ బెంగాల్*


నాడు అదొక భూతల స్వర్గం 

కవి శ్రేష్టుల ఉత్పత్తికి కర్మాగారం 

రబీంద్ర నాధ్ ఠాగూర్ రచించిన గీతాంజలిలో 

చోటు దక్కించుకున్న పవిత్ర ప్రదేశం *వంగ*!

 

మహా మహా నీయులు జన్మించిన పుణ్యతలం

స్వామి వివేకానంద, ఠాగూర్ 

సుభాస్ చంద్ర బోస్ థెరిస్సా 

రాజా రామ్మోహన్ రాయ్ లాంటి 

ఎందరో దేశ భక్తులు కవులు ఉధ్యమ కారులు 

సేవా తత్పరులు సంఘ సేవకులు మరెందరో!


తూర్పున బంగాళాఖాతం 

పచ్చని తరువులు పచ్చని పైరులు 

సస్యశ్యామల మైన భూములు 

బంగారు పంటలు పండించు వంగాతలం 

పశ్చిమ బెంగాల్ 


అలాంటి సువర్ణ వంగాతలం 

అతి తక్కువ ఖర్చుతో జీవనమని 

పేరుగాంచిన కోలకత్తా 

జగన్మాతకు పుణ్య తలమైన బెంగాల్ 

నేడు కుట్రలకు కుతంత్రాలకు నిలయమై 

లక్షలాదిమంది బంగ్లా దేశీయులకు 

స్వాగతం పలుకుతూ రోహింగియాలను 

భూభాగంలోకిరానిస్తూ దొంగ ఆధార్ కార్డులు

సృష్టిస్తూ ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ 

నేడు దేశానికే గుది బండలా మారింది 

పశ్చిమ బెంగాల్ 

అక్కడి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ! 

No comments: