Monday, March 24, 2025

రామ జన్మ

శీర్షిక: *రామజన్మ*

త్రేతా యుగమున అవతరించే మహుడు

అవతార పురుషుడు శ్రీ రామచంద్రుడు

చైత్ర మాస తొమ్మిదవ రోజైన నవమి నాడు

ధశరథమహారాజు కౌసల్యలకు కవల 

పిల్లలలో శ్రేష్టుడుగా

దశావతారాలలో ఏడవ అవతారముగా

అవతరించె నిలన ధర్మ పాలన కొరకు

పట్టాభిషేక సమయాన మందరకు పుట్టె

చెడు బుద్ది నొకటి

మదిన తొలచ , కైకేయి దరి చేరి చెప్పె నొకటి

రేపు రాముడి పట్టాకషేకమని,నీకు దశరథుడు

యిచ్చిన రెండు వరాలను కోరమని వివరించ

పరుగు పరుగున కైకేయి కదిలె దశరథుడి చెంతకు

వచ్చిన విషయమేమని , దశరథుడు కోరగా

వివరించే కైకేయి ,తనకిచ్చిన రెండు కోర్కెల

మొదటిది భరతుడి పట్టాభిషేకం కోరే

రెండవది 14 సం.రాలు వనవాసం

నిర్ఘాంత పోయే దశరథుడు దుష్ట కైక కోర్కెలకు

విధి లేక దశరథుడు ,అటులనే నని మూర్చిల్లే!

No comments: