Monday, March 3, 2025

పదాల కవిత

అంశం: పదాల కవిత

పదాలు:
*మధుర స్వరం*
*మమతలవర్షం*
*వీనుల విందు*
*కన్నుల పండుగ*

శీర్షిక: నైటింగేల్ ఆఫ్ ఇండియా

తెలుగు నేలపై విరిసిన సిరిమల్లె
తెలంగాణ ముద్దుబిడ్డ సరోజినీ నాయుడు
*మధుర స్వరం* తో  గాన కోకిల
నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు గాంచే!

విదేశాలలో విద్యాభ్యాసం చేసినా
మాతృదేశం పై  మమకారంతో
*మమతల వర్షం*  కురిపిస్తూ
స్వదేశానికి తిరిగి వచ్చి , గాంధీజీతో
స్వాతంత్ర సమరంలో విస్తృతంగా పాల్గొన్న
దేశభక్తురాలు సరోజినీ దేవి నాయుడు!

సరోజినీ దేవి నాయుడు గారి కంఠ స్వరం
గానం ప్రేక్షకుల నలరించే విధంగా
*వీనుల విందు* గా మధురంగా ఉండేది

తన పందొమ్మిదవ యేళ్ళ వయసులోనే
తెలుగింటి గోవింద రాజులునాయుడిని
కులాంతర వివాహం చేసుకుని
ఆదర్శవంతంగా నిలిచిన సరోజినీ దేవి
వివాహ వేడుక   ప్రకాశం పంతులు గారి
సమక్షాన ఎంతో వైభవంగానూ
*కన్నుల పండుగ* లా జరిగింది!

      

No comments: