అంశం: పదాల కవిత
పదాలు:*మధుర స్వరం*
*మమతలవర్షం*
*వీనుల విందు*
*కన్నుల పండుగ*
శీర్షిక: నైటింగేల్ ఆఫ్ ఇండియా
తెలుగు నేలపై విరిసిన సిరిమల్లె
తెలంగాణ ముద్దుబిడ్డ సరోజినీ నాయుడు
*మధుర స్వరం* తో గాన కోకిల
నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు గాంచే!
విదేశాలలో విద్యాభ్యాసం చేసినా
మాతృదేశం పై మమకారంతో
*మమతల వర్షం* కురిపిస్తూ
స్వదేశానికి తిరిగి వచ్చి , గాంధీజీతో
స్వాతంత్ర సమరంలో విస్తృతంగా పాల్గొన్న
దేశభక్తురాలు సరోజినీ దేవి నాయుడు!
సరోజినీ దేవి నాయుడు గారి కంఠ స్వరం
గానం ప్రేక్షకుల నలరించే విధంగా
*వీనుల విందు* గా మధురంగా ఉండేది
తన పందొమ్మిదవ యేళ్ళ వయసులోనే
తెలుగింటి గోవింద రాజులునాయుడిని
కులాంతర వివాహం చేసుకుని
ఆదర్శవంతంగా నిలిచిన సరోజినీ దేవి
వివాహ వేడుక ప్రకాశం పంతులు గారి
సమక్షాన ఎంతో వైభవంగానూ
*కన్నుల పండుగ* లా జరిగింది!
No comments:
Post a Comment